UPDATES  

NEWS

సరైన రోడ్డు సౌకర్యం లేకా వర్ష కాలం వస్తే రైతులకు కష్టాలే… ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి: గిరిజన సంక్షేమ సంఘం నాయకులు రాంబాబు,ఎంపీ నాయక్ ఉపాధి హామీ కూలీల ప్రాణం తీసుకున్న అతివేగం లక్ష్మీదేవి పల్లి మండలంలో వడదెబ్బకు వ్యవసాయ కూలీ మహిళా మృతి మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు పసునూరి నరహరి లొంగుబాటు గిరిజనాభివృద్ధి పనులు నాణ్యతతో సకాలంలో పూర్తి చేస్తాం : ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మధుకర్ 10 లక్షలు లంచం డిమాండ్ చేసిన అటవీశాఖ అధికారులు కరీంనగర్‌లో ఉద్రిక్తత కస్టమర్ల ముసుగులో వచ్చి కాల్పులు.. షోరూమ్‌లో దోపిడీ మే 4న మెగా జాబ్ మేళాకు ఆన్లైన్‌లో నమోదు చేసుకోవాలి : కలెక్టర్ అంకిత్

 అత్యున్నత న్యాయవ్యవస్థపై దాడి దారుణం

ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు మహమ్మద్ అబ్దుల్ రహీం

ఖమ్మం (తెలాంగాణ వాణి ప్రతినిధి హనీఫ్ పాషా) మతోన్మాదం ఏ విధంగా రెచ్చిపోతుందో చెప్పడానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పి ఆర్ గవాయిపై జరిగిన దాడే ప్రధాన సాక్ష్యం అని, దాడి చేసిన రాకేష్ కిషోర్ ను కఠినంగా శిక్షించాలని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడు మొహమ్మద్ అబ్దుల్ రహీం డిమాండ్ చేశారు. సభ్యసమాజం తలదించుకునేలా రాకేష్ కిషోర్ చేసిన దాడి దేశానికి కళంకమని ఆయన పేర్కొన్నారు. సనాతన ధర్మాన్ని అడ్డం పెట్టుకొని అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి పైనే దాడికి పాల్పడటం ముమ్మాటికీ దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. కుల వివక్ష రోజుకు పెరిగిపోతుందని దీని ఆసరాగా చేసుకొని దాడులకు పాల్పడుతున్నారని ఇలాంటి పరిణామాలు సమాజానికి ప్రమాదకరమని కఠిన చర్యలతో శిక్షలు విధించాలని లేకపోతే న్యాయస్థానంపై ప్రజలకు నమ్మకం పోతుందని కావున వెంటనే రాకేష్ కిషోర్ ను కఠినంగా శిక్షించి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest