UPDATES  

NEWS

రచ్చపల్లిలో ఆర్థిక, సాంకేతిక అక్షరాస్యతపై అవగాహన కార్యక్రమం సి.పి.ఎస్ రద్దు చేయాలని ఉపాధ్యాయుల డిమాండ్ తడి చెత్త పొడి చెత్త వేరుగా చేసి ఇస్తున్నా ప్రజలు కొత్తగూడెం మేయర్ బరిలోకి ప్రముఖ విద్యావేత్త డా. యం.వీరనాయక్ తెలంగాణ వాణి దిన పత్రిక క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఖేడ్ డిఎస్పి వెంకట్ రెడ్డి ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలి: టి పి టి ఎఫ్ మండల అధ్యక్షుడు బి.సుక్య సర్పంచ్ కె.రవి ను సన్మానం చేసిన సొసైటీ వైస్ చైర్మన్ కాంపల్లి కనకేష్‌ కిన్నెరసాని గ్రామపంచాయతీ సర్పంచ్ వజ్జ రామకృష్ణ, ఉపసర్పంచ్ వజ్జా ఇంద్రజ ఆధ్వర్యంలో ముగిసిన క్రికెట్ టోర్నమెంట్ మహిళల కళలకు వేదికగా ముగ్గుల పోటీలు

 అన్ని శాఖల సమన్వయంతో విజయవంతముగా ముగిసిన ఇంటర్ పరీక్షలు

డిఐఈఓ ను అభినందన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు

నిజామాబాద్ (తెలంగాణ వాణి ప్రతినిధి)

నిజామాబాద్ జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు అన్ని శాఖల సమన్వయంతో విజయవంతంగా నిర్వహించినందుకు డీ ఐ ఈ వో తిరుమల పూడి రవికుమార్ ను జిల్లా కలెక్టర్ అభినందించారు. శనివారం కలెక్టర్ ఛాంబర్ లో డిఐఈఓ తో పాటు ఇంటర్ బోర్డు అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ వారిని అభినందించారు.2024-25 విద్యా సంవత్సరం ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా విజయవంతంగా నిర్వహించినందుకు జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు జిల్లా ఇంటర్ విద్య అధికారితో పాటు పరీక్షల నిర్వహణ కమిటీని అభినందించారు. అనంతరం అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్చం అంద చేశారు కలెక్టర్ ను కలిసిన వారిలో జిల్లా ఇంటర్ విద్యా ఆధికారి తిరుమలపుడి రవికుమార్, పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు చిన్నయ్య, రజియోదిన్, అస్లాం, హై పవర్ కమిటీ శ్రీనాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఇంటర్ విద్యా ఆధికారి మాట్లాడుతూ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్ ఆదేశం మేరకు జిల్లా పరీక్షల విభాగంకు విద్యుత్ శాఖ, ఆర్టీసీ, ఆరోగ్యశాఖ, పోస్టల్, శాఖ, పోలీస్ శాఖ మున్సిపల్, గ్రామ పంచాయతీ, విభాగాలు సహకరంతో ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా నిర్వహించడం జరిగిందని అన్నారు.అలాగే అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ ఎప్పటికప్పుడు తమకు సహకరిస్తూ అన్ని విభాగాలను సమన్వయం చేసి తమను ఇంటర్ పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసేందుకు ముందుకు నడిపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest