UPDATES  

NEWS

కొత్తగూడెం మేయర్ బరిలోకి ప్రముఖ విద్యావేత్త డా. యం.వీరనాయక్ తెలంగాణ వాణి దిన పత్రిక క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఖేడ్ డిఎస్పి వెంకట్ రెడ్డి ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలి: టి పి టి ఎఫ్ మండల అధ్యక్షుడు బి.సుక్య సర్పంచ్ కె.రవి ను సన్మానం చేసిన సొసైటీ వైస్ చైర్మన్ కాంపల్లి కనకేష్‌ కిన్నెరసాని గ్రామపంచాయతీ సర్పంచ్ వజ్జ రామకృష్ణ, ఉపసర్పంచ్ వజ్జా ఇంద్రజ ఆధ్వర్యంలో ముగిసిన క్రికెట్ టోర్నమెంట్ మహిళల కళలకు వేదికగా ముగ్గుల పోటీలు దేశ అభివృద్ధి మోదీ లక్ష్యం- రఘునాధ్ కాజీపేటలో అట్టహాసంగా ముగిసిన 58వ జాతీయ సీనియర్ ఖోఖో ఛాంపియన్‌షిప్ క్రీకెట్ టోర్నమెంట్ పోస్టర్ ను ఆవిష్కరించిన లక్ష్మీదేవి పల్లి ఎస్ ఐ రమణ రెడ్డి

 జర్నలిస్టులకు అండగా ఉంటా : ఎంపీ ధర్మపురి అరవింద్

నిజామాబాద్ (తెలంగాణ వాణి)

ప్రజల కోసం పనిచేస్తున్న జర్నలిస్టులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు ఎంపీ ధర్మపురి అరవింద్. జర్నలిస్టుల వరుస మరణాలు బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. ఒత్తిడులు తగ్గించుకుంటు జర్నలిస్టులు ఆరోగ్యం కాపాడుకోవాలని సూచించారు. జిల్లాకు పసుపు బోర్డు సాధించిన తర్వాత తొలిసారిగా నిజామాబాద్ లో పర్యటించిన అరవింద్ ను జర్నలిస్టులు మర్యాద పూర్వకంగా కలిశారు. సుభాష్ నగర్ లోని తన నివాసంలో ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. జిల్లాలో తాజా రాజకీయ పరిస్థితులు అభివృద్ధి పనులు తదితర అంశాలపై

చర్చించారు. ఇటీవల వివిద కారణాలతో మృతి చెందిన జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. వరుస మరణాలు బాధాకర మన్నారు. అర్వింద్ ధర్మపురి ఫౌండేషన్ ద్వారా ఆపద సమయంలో బీజేపీ నాయకులకు ఆదుకుంటున్నానని ఫౌండేషన్ సేవలకు జర్నలిస్టులకు వర్తింపజేసే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. జర్నలిస్టు వెల్ఫేర్ సొసైటీ కార్యకలాపాలను ఎంపీ అడిగి తెలుసుకున్నారు. ఎంపీ ని కలిసిన వారిలో ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు రామకృష్ణ, శేఖర్, ఆర్గనైజింగ్ కార్యదర్శి మోహన్ సీనియర్ జర్నలిస్టులు ప్రమోద్, ప్రసాద్ శ్రీనివాస్, దేవీదాస్, సుదర్శన్ ఆంజనేయులు, అహ్మద్, భూపతి తదితరులు పాల్గొన్నారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest