UPDATES  

NEWS

వికాస తరంగిణి కొత్తగూడెం శాఖ ఆధ్వర్యంలో రేగళ్లలో జూలై 4న ఉచిత క్యాన్సర్ క్యాంప్ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా వైద్య సిబ్బంది సేవలు భేష్ కేంద్ర హోంశాఖ మంత్రి పర్యటన సక్సెస్ కు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు సామాన్యులకు అందుబాటులో కార్పొరేట్ వైద్యం కొత్తగూడెం హెడ్ పోస్ట్ ఆఫీస్ నందు ఆధార్ సేవా కేంద్రం ప్రారంభం చుంచుపల్లి మండల అధ్యక్షుడు బలగం శ్రీధర్ అధ్యక్షతన యోగ దినోత్సవం బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్…. శంషాబాద్ అదుపులోకి తీసుకున్న పోలీసులు…. వేములవాడ పట్టణంలో సెక్షన్ 144 అమలు వారాహి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆది దంపతులు

 సెల్ టవర్ ఎక్కి ఆత్మ హత్యయత్నం

సైదాపూర్ (తెలంగాణ వాణి)

మండలంలోని ఎక్లాస్పూర్ గ్రామానికి చెందిన దుర్గం కనుకయ్య కుటుంబ కలహాలతో శంకరపట్నం మండలంలో సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించగా స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీస్ లు వచ్చి సముదాయించగా సెల్ టవర్ నుండి దిగాడు. దీనికి సంబందించిన వివరాల్లోకి వెళ్తే దుర్గం కనుకయ్య కు అతని చిన్న సోదరుడు తిరుపతికి కనుకయ్యకు మధ్య గత కొంత కాలంగా భూవివాదం ఉంది. ఇల్లు కూలగొట్టి తన భార్యను కొట్టడంతో ఆమె పురుగుల మందు తాగి ఆత్మ హత్యాయత్నం చేయగా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స చేయించుకొని తిరిగి ఇంటికి వచ్చింది. ఈ వివాదం పరిష్కారం చేయాలని పోలీస్ కమీషనర్ కరీంనగర్, సైదాపూర్ ఎస్సై లకు ఫిర్యాదు చేసినప్పటికి ఎవరు పట్టించు కోవడం లేదని ఆత్మహత్యా యత్నానికి పాల్పడినట్టు భాధితుడు తెలిపాడు. ఇప్పటికైనా అధికారులు సమస్యను పరిష్క్కరించాలని, లేకపోతే చావే మార్గమంటూ వాపోయాడు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest