UPDATES  

NEWS

 జనంసాక్షి పత్రిక సంపాదకుడు రెహమాన్ పై పెట్టిన అక్రమ కేసును వెంటనే ఎత్తివేయాలి

కాలుష్యాన్ని వెదజల్లుతున్న ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో చెలరేగిన హింసకు బాధ్యుడిగా జనంసాక్షి పత్రిక సంపాదకుడు రెహమాన్ పై కేసు పెట్టడాన్ని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు సంఘం తీవ్రంగా ఖండించింది. అక్కడ జరుగుతున్న రైతు ఉద్యమంలో జర్నలిస్ట్ మిత్రుడు రెహమాన్ ప్రత్యక్షంగా లేనప్పటికి అతన్ని A2 గా చేరుస్తూ ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ఏమాత్రం సరికాదని సంఘం అధ్యక్షులు అల్లం నారాయణ, కార్యదర్షి ఆస్కాని మారుతి సాగర్ లు ఖండించారు. ఈ విషయమై ఇప్పటికే గద్వాల ఎస్పీ తో ఫోన్ లో మాట్లాడటం జరిగిందన్నారు. కేసును ఎత్తేసే విషయంలో ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకోవాలని వారు కోరారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest