UPDATES  

NEWS

రంగులమయమైన ఇండోర్ స్టేడియం: తైక్వాండో విద్యార్థుల హోలీ హంగామా ! నూతన జిల్లా కలెక్టర్ అంకిత్ ఐఏఎస్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన టిఎస్ యు.టి.ఎఫ్ భద్రాది జిల్లా కమిటి  సేవాలాల్ సద్గురు చూపిన మార్గం ఆదర్శనీయం: వైరా ఎమ్మెల్యే మాళోత్ రాందాస్ నాయక్ పిడి బుగ్గ వెంకటేశ్వర్లు పదవీ విరమణ సందర్భంగా సన్మానించిన పి ఆర్ టి యు టి ఎస్ భద్రాద్రి జిల్లా కమిటీ హర్ష టౌన్షిప్‌లో టీఎస్ టిటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బానోత్ రాములు నాయక్ ఆధ్వర్యంలో మేయర్, కార్పొరేటర్‌ లకు ఘన సన్మానం లక్ష్మీదేవిపల్లిలో వీధి దీపాల ఏర్పాట్లు వేగవంతం: సర్పంచ్ తాటి అనిత 56వ డివిజన్‌లో మెగా మెడికల్ క్యాంపు..ఉచిత మందుల పంపిణీ హమాలికాలనీ గ్రామంలో కొత్త కరెంటు పోల్స్‌పై వీధి దీపాల ఏర్పాటు లక్ష్మీదేవిపల్లి బాలమేళాలో రాజాపురం పాఠశాల విద్యార్థుల ప్రతిభ

 ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు

ధర్మారం (తెలంగాణ వాణి విలేఖరి) పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని పద్మశాలి సంఘం అధ్యక్షుడు మాజీ ఉపసర్పంచ్ వోడ్నాల శంకరయ్య ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ 110వ జయంతి వేడుకలు మండల కేంద్రంలోని శ్రీ శివ భక్త మార్కండేయ దేవాలయ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ సమాజ సేవ ,విద్య వ్యాప్తి, సాంఘిక సంస్కరణలో చేసిన కృషిని ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ఆయన చేసిన సేవలను వారి ఆశయాలను ఈ తరం యువత ముందుకు తీసుకువెళ్లాలని శంకరయ్య కోరారు. ఈ కార్యక్రమంలో దాసి రవీందర్,వడ్నాల రవి, దేవసాని సత్యం ,ఎలిగేటి మహేందర్ ,విట్ట రవి, వాడ్నాల రాజ్ కుమార్, సాంబరి అంజి, వడ్నాల సతీష్, బొమ్మ వరం వేణుగోపాల్ రావు, ఆవుల ఐలయ్య బత్తిని మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest