కొత్తగూడెం సింగరేణి (తెలంగాణ వాణి) ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరంలొ మొత్తం రూ. 6394 కోట్ల లాభాలు గడిస్తే, కేవలం 2360 కోట్లలో 34శాతం ఇవ్వడం ఏమిటని తెలంగాణ బొగ్గు గాని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) ముఖ్య ప్రధాన కార్యదర్శి కాపు కృష్ణ ప్రశ్నించారు. సోమవారం టీబీజీకేఎస్ కార్యాలయంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. దసరా పండుగ పూట కార్మికులకు సీఎం రేవంత్ రెడ్డి చేదు కబురు చెప్పారని వ్యాఖ్యానించారు. సమైక్య రాష్ట్రంలో అయినా, ఇప్పుడైనా సింగరేణి కార్మికులకు కాంగ్రెస్ పార్టీ ద్రోహమే చేసిందిని ఆరోపించారు. నమ్మి ఓటేసినందుకు సింగరేణి కార్మికులను నయ వంచన చేసిందని ఆయన మండిపడ్డారు. బిఆర్ఎస్ పాలనలో సింగరేణి కార్మికుల సంక్షేమం బాట పడితే కాంగ్రెస్ పాలనలో ఘోరమైన సంక్షోభానికి గురిచేసారని ఆరోపించారు. నికర లాభాల్లో కోట్లలో 34శాతం ను కార్మికులకు బోనస్ గా ప్రకటించాలని తెలంగాణ బొగ్గు గాని కార్మిక సంఘం పక్షాన కాపుకృష్ణ డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటితే చేతలు గడప దాటవనే విషయం సింగరేణి కార్మికుల విషయంలో మరోసారి రుజువైందని వ్యాఖ్యానించారు. దసరా సందర్భంగా సింగరేణి కార్మికులకు తీపి కబురు బదులు చేదు కబురు చెప్పి కార్మికుల కడుపు మీద కొట్టారని తీవ్ర నిరాశకు గురిచేసారని విమర్శించారు.
మొత్తం లాభం 6394 కోట్ల నుండి కాకుండా, 2360 కోట్ల నుండి బోనస్ చెల్లించడం దారుణని పేర్కొన్నారు. పంచాల్సిన వాటాను తగ్గించి, శాతాలు పెంచి సింగరేణి కార్మికులను దారుణంగా మోసం చేశారని విమర్శించారు. గతడాది కూడా ఇదేవిధంగా మోసం చేసి, బోనస్ లో సుమారు 50శాతం వాటా కోత విధించారని ఆరోపించారు .
మొత్తంగా సంస్థ గడించిన లాభాల ఆధారంగా ప్రతి ఏడాది కార్మికులకు ఇచ్చే బోనస్ ను కూడా బోగస్ చేసారని విమర్శించారు. లాభాల వాటలో నికర లాభం నుండి సుమారు 75శాతం కోత విధిస్తూ కార్మికులకు చేసిన అన్యాయాన్ని తెలంగాణ బొగ్గు గాని కార్మిక సంఘం పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామన్నరు. ఎంతో శ్రమించి సంస్థకు మంచి ప్రాఫిట్ చూపించినందుకు డబుల్ వాటా సుమారు 5 లక్షలు వస్తుందన్న కార్మికుల ఆశలను కాంగ్రెస్ ప్రభుత్వం అడియాశలు చేసిందని విమర్శించారు. గతంలో కేసీఆర్ సర్కారు ఎప్పుడైనా నికర లాభంలో కార్మికులకు వాటా ఇచ్చారని పేర్కొన్నారు. కాంగ్రెస్ మాత్రం వచ్చిన లాభాన్ని మూడో వంతు పక్కన పెట్టి మిగిలిన ఒక వంతులో వాటా ఇవ్వడం అక్వినా దుర్మార్గమని ఆరోపించారు. గతేడాది సింగరేణి భవిష్యత్ ప్రణాళిక కోసమని పక్కన రూ.2,289 కోట్లు ఏమయ్యాయో తెలియని పరిస్థితి నెలకొందని విమర్శించారు. ఇప్పుడు 4034 కోట్ల సింగరేణి సొమ్ముకు ఎసరు పెట్టారని, గత సంవత్సరం 33శాతం ఇవ్వగా మిగిలిన 67శాతం ఈ సంవత్సరం ఇస్తానన్న 34 శాతం మిగిలిన 66శాతం తో ఏ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారో కార్మిక వర్గానికి వివరించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన ఒకే సంవత్సరంలో సింగరేణి సంస్థ అభివృద్ధికి అని రెండుసార్లు అమౌంట్ ని ఉంచారన్నారు .
కార్మికులకు హక్కుగా రావాల్సిన వాటా ఎవరి జేబులకు మళ్లిస్తున్నట్లు? అని ప్రశ్నించారు. కార్మికులు చేసిన కష్టానికి, ఫలితం ఇవ్వకపోవడం దారుణమని ఆరోపించారు. కెసిఆర్ మార్గనిర్దేశనంలో తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి సింగరేణి సంస్థ లాభాల్లో దూసుకు పోయిందని పేర్కొన్నారు. కార్మికుల కష్టానికి గుర్తింపుగా ఆర్జించిన నికర లాభాల నుంచి కార్మికులకు ప్రతి ఏడాది వాటాను పెంచుతూ వచ్చారని తెలిపారు. సమైక్య రాష్ట్రంలో 1998-99 నుంచి 2010-11 వరకు సింగరేణి లాభాల్లో కార్మికులకు ఇచ్చిన వాటా కేవలం 11నుండి 16 శాతమే. అప్పుడున్న ప్రభుత్వాలు యూనియన్లు 12 సంవత్సరాల లో 6శాతం మాత్రమే పెంచడం జరిగింది. కానీ టీబీజీకేఎస్ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ఏర్పడ్డ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ 16 నుండి 32 శాతం వరకు పెంచడం జరిగిందని 10 సంవత్సరాలలో 16శాతం పెంచడం జరిగిందని వివరించారు. కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం నికర లాభం నుండి సింగరేణి సంస్థ అభివృద్ధి గాని దాదాపు నాలుగు వేల కోట్లు పక్కన పెట్టడం జరిగిందని, మరి కార్మికులకు ఇస్తున్న 34శాతం ఇవ్వగా మిగిలిన 66శాతం సింగరేణి సంస్థ అభివృద్ధికే కదా అని ప్రశ్నించారు.
స్వరాష్ట్ర సాధన కోసం ఉద్యమం వెంట నడిచిన సింగరేణి కార్మికుల కష్టాలను దృష్టిలో పెట్టుకుని సీఎం కేసీఆర్ ఎంతో ఉదారతతో వ్యవహరించి ఏ రాష్ట్రం ఏర్పడినప్పుడు లేని ఇంక్రిమెంట్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే సింగరేణి కార్మికులకు తెలంగాణ ఇంక్రిమెంట్ ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. సకల జనుల సమ్మె చేసి నష్టపోయిన జీతం సింగరేణి కార్మికులకు మరల ఇవ్వడం జరిగిందని తెలిపారు. 2022-23లో కార్మికులకు సంస్థ లాభాల్లో ఏకంగా 32 శాతం వాటాను ప్రకటించి కార్మికుల కష్టానికి గుర్తింపు, గౌరవం ఇచ్చారన్నారు. లాభాల వాటాను 16 శాతం ఉన్నదానిని 32 శాతం వరకు పెంచిన ఘనత తెలంగాణ కేసీఆర్ కే దక్కుతుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అందరికీ వెలుగు అందించే సింగరేణి కార్మికుల జీవితాల్లో చీకటి నింపే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. సమైక్య రాష్ట్రంలో కార్మికులకు జరిగిన అన్యాయం కంటే తీవ్ర అన్యాయం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి ఏటా కార్మికులకు చెల్లించినట్లుగానే లాభాల్లో వాటా చెల్లించాలని, నికర లాభం లో 34శాతం బోనస్ గా ప్రకటించాలని డిమాండ్ చేశారు. అంతేగాక వచ్చిన నికర లాభం నుండి 34శాతం ఇస్తే సుమారుగా ప్రతి ఒక్క కార్మికునికి ఐదు లక్షల వరకు వస్తాయన్నారు. తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ రాష్ట్ర ప్రగతిలో ఎంతో కీలకంగా ఉన్న సింగరేణి కార్మికులకు అన్యాయం జరిగితే టీబీజీకేఎస్, బిఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదన్నారు. కార్మికుల పక్షాన పోరాటం చేస్తుందని తెలిపారు. దీనిలో భాగంగా ఈనెల 23వ తేదీన అన్ని మైన్స్ ల మీద అన్ని డిపార్ట్మెంటులలో అన్ని ఆఫీసులలో నల్ల బ్యాడ్జీలు పెట్టుకొని నిరసన తెలియజేయాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ కూసాన వీరభద్రం, కొత్తగూడెం ఏరియా వైస్ గడప రాజయ్య, కార్పొరేట్ ఏరియా వైస్ ప్రెసిడెంట్ తుమ్మ శ్రీనివాస్ పాల్గొన్నారు.



