ప్రేమించిన అమ్మాయిని మర్చిపోలేక మనస్థాపానికి గురై ఆత్మహత్య

హైదరాబాద్ / పటాన్ చెరువు (తెలంగాణ వాణి ప్రతినిది) గుమ్మడిదల్ మండలంలో బీహార్ నుండి బతుకు తెరువు కోసం దోమడుగు గ్రామంలో రాజ్ కుమార్ భార్య గీతాదేవి ముగ్గురు కొడుకులుతో కలిసి ఓ ప్రయివేట్ కంపెనీలో పనిచేసుకుంటూ గత రెండు సంవత్సరాల జీవనం సాగిస్తున్నారు. అయితే పెద్ద కుమారుడు అంకిత్ కుమార్ వాళ్ల సొంత గ్రామానికి చెందిన అమ్మాయిని ప్రేమించడంతో పెద్దలు నిరాకరించారు. విషయం తెలుసుకున్న అంకిత్ బీహార్ కు వెళ్లి తరచూ అమ్మాయిని కలుస్తుండడంతో , […]
మట్టి వినాయకుడిని పూజిద్దాం

ధర్మారం (తెలంగాణ వాణి ప్రతినిధి) గణేష్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని మట్టి వినాయక ప్రతిమలను పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుదామని లయన్స్ క్లబ్ ధర్మారం అధ్యక్షుడు తలమక్కి రవీందర్ శెట్టి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ధర్మారం మండల కేంద్రంలో మట్టి వినాయకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు ఎల్లారెడ్డి, ఎండి ముజాహిద్, కళ్లెం స్వామి రెడ్డి, ఎలగందుల అశోక్, సిహెచ్ నర్సింగం, సిహెచ్ శేఖర్, దయానంద్, సతీష్, తదితరులు పాల్గొన్నారు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్.. ఎందుకో తెలుసా.?

భారతీయ రైల్వే ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్వర్క్స్లో ఒకటి. ప్రతీరోజూ కోట్లాది మంది ప్రజలను తమ గమ్యస్థానాలకు చేరవేస్తుంది ఇండియన్ రైల్వే. లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పిస్తూ దేశంలో ఎక్కువ అందిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థగా కూడా ఇండియన్ రైల్వేకు పేరుంది. అయితే ఇన్ని విశేషాలు ఉన్న భారతీయ రైల్వే ఎన్నో వింతలకు కూడా నెలవుగా ఉంటుంది. తాజాగా ఇలాంటి ఓ అరుదైన ఘటన వెలుగులోకి వచ్చింది. హోలీ పర్వదినానికి ముందు రోజు జరిగిన ఈ సంఘటన […]
కేరళ సీఎం కుమార్తె వీణా విజయన్తోపాటు ఆమె ఐటీ కంపెనీపై ఈడీ మనీలాండరింగ్ కేసు

కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) కేరళలో భారీ చర్యలు చేపట్టింది. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె వీణతో పాటు ఆమెకు చెందిన ఐటీ కంపెనీతో పాటు ఇతరులపై ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. వీణాపై ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు కావడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. వీణా విజయన్ ఐటీ కంపెనీకి ఓ ప్రైవేట్ సంస్థ నుంచి అక్రమ చెల్లింపులు చేసిందన్న ఆరోపణలతో ఈడీ దర్యాప్తు చేపట్టింది. కేరళ సీఎం పినరయి […]
‘రాజకీయ ఒత్తిడి నుంచి న్యాయవ్యవస్థ ముప్పు’.. సీజేఐకి 600 మంది న్యాయవాదులు లేఖ

దేశవ్యాప్తంగా ప్రముఖ న్యాయవాదులు ఆందోళన బాట పట్టారు. న్యాయవ్యవస్థ సమగ్రతను దెబ్బతీసే లక్ష్యంతో నిర్దిష్ట ఆసక్తి సమూహం చర్యలకు వ్యతిరేకంగా తీవ్రమైన ఆందోళనలను వ్యక్తం చేస్తూ లేఖ రాశారు. రాజకీయ, వృత్తిపరమైన ఒత్తిడిపై తీవ్రమైన ఆందోళనలను వ్యక్తం చేస్తూ భారత ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. ప్రమాదంలో ఉన్న న్యాయవ్యవస్థను కాపాడాలంటూ లేఖపై సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే, మనన్ కుమార్ మిశ్రా, ఆదిష్ అగర్వాల్, చేతన్ మిట్టల్, పింకీ ఆనంద్ మరియు స్వరూపమ చతుర్వేది సహా […]
బెంగళూరే కాదు.. హైదరాబాద్తో సహా ఆ 30 నగరాలకు పొంచి ఉన్న నీటి కష్టాలు!

వేసవి ప్రారంభంకాక ముందే బెంళూరులో నీటి కష్టాలు తారా స్థాయికి చేరుకుంది. ఇప్పటికే అక్కడి ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటున్నప్పటికీ బెంగళూరు నగర వాసుల జీవనం దినదినగండంగా మారింది. భారత సిలికాన్ వ్యాలీగా గుర్తింపు తెచ్చుకున్న ఈ నగరం ప్రజలు బకెట్ నీళ్ల కోసం పడిగాపులు కాస్తున్నారు. బెంగళూర్ నగరం పూర్తిగా భూగర్భ జలాలు, కావేరీ నది నీటీపై ఆధారపడింది. ఈ ఏడాది ఒక్కసారిగా భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో సమస్య మొదలైంది. దీంతో అక్కడి ప్రజలు […]
తొలిసారి వ్యాపార భాగస్వాములుగా మారిన అంబానీ-అదానీ.. పవర్ ప్రాజెక్టులో 26% వాటా కొనుగోలు చేసిన రిలయన్స్

ప్రముఖ పారిశ్రామిక దిగ్గజాలు, అపర కుబేరులు ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీ తొలిసారి వ్యాపార భాగస్వాములు అయ్యారు. గుజరాత్కు చెందిన వీరిద్దరి మధ్య కనిపించని పోటీ ఉంటుందనేది నిపుణుల అభిప్రాయం. సంపద పరంగా దేశంలో తొలి రెండు స్థానాల్లో ఉన్న వీరిద్దరూ ప్రస్తుతం వ్యాపార రంగంలో చేతులు కలిపారు. దీనిలో భాగంగా అదానీ పవర్ లిమిటెడ్కు పూర్తి అనుబంధ సంస్థ అయిన పవర్ ప్రాజెక్టులో 26 శాతం వాటాను ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ కొనుగోలు […]
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు సెలబ్రిటీ అయిన ప్రస్థానం

ఒకరు టెక్కీ రెవల్యూషన్కి మొదటి దిక్సూచి. మరొకరు ఆ టెక్నాలజీని సామాన్యుడి అరచేతిలోకి చేర్చిన దార్శనికుడు. ఒకరు వ్యాపారవేత్త, మరొకరు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి సారధి. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, భారత ప్రధాని మోదీ. వీళ్లిద్దరి మధ్య చాయ్ పే చర్చ జరిగితే ఎలా ఉంటుంది.. ఏయే అంశాలు ప్రస్తావనకొస్తాయి..? ఏయే ఎక్స్ట్రీమ్స్ని టచ్ చేస్తారు..? అసలు ఈసారి చాయ్పే చర్చతో మోదీ ఏం సాధించాలనుకున్నారు? క్రియేటివిటీని విచ్చలవిడిగా వాడెయ్యడంలో మోదీ తర్వాతే ఎవరైనా. 2014 […]
ఆ భయంతోనే బిజెపిలోకి గాలి జనార్దన్ రెడ్డి

సార్వత్రిక ఎన్నికల ముంగిట కీలక పరిణామం. బిజెపితో విభేదించి సొంత పార్టీ పెట్టుకున్న మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి మనసు మార్చుకున్నారు. తిరిగి బిజెపి గూటికి చేరారు. తనకు చెందిన కర్ణాటక రాజ్య ప్రగతి పక్ష పార్టీని బిజెపిలో విలీనం చేశారు. సోమవారం మాజీ సీఎం యడ్యూరప్ప, బిజెపి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బివై విజయేంద్ర సమక్షంలో పార్టీని విలీనం చేశారు. బిజెపి కండువా కప్పుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముంగిట బిజెపితో విభేదించిన గాలి […]
ఢిల్లీలో దొంగలు ఎంతకు తెగించారు.. ఏకంగా జేపీ నడ్డా సతీమణి కారు గాయబ్

ఆయన బిజెపి జాతీయ అధ్యక్షుడు. సెక్యూరిటీ దాదాపు క్యాబినెట్ మినిస్టర్ కు ఉన్నంత రేంజ్ లో ఉంటుంది. పైగా ఆయన చుట్టూ ఎప్పటికీ పోలీసులు ఉంటారు. చివరికి ఆయన కుటుంబ సభ్యుల చుట్టూ కూడా ఇలాంటి భద్రతే ఉంటుంది. కానీ అంతటి భద్రతను దాటుకొని దొంగలు వచ్చారు. పోలీసులు పహారా కాస్తున్న వారి కళ్ళు కప్పారు. ఏకంగా బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సతీమణి కారునే చోరీ చేశారు. దీంతో ఢిల్లీలో కలకలం నెలకొంది. బిజెపి […]