కార్పొరేటర్ చింతలపూడి శ్రావణి – సాయి కుమార్ దంపతుల చేతుల మీదుగా నూతన పట్టు వస్త్రాలు బహుకరణ
కొత్తగూడెం మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని సుజాతనగర్ 21 వ డివిజన్ పరిధిలో గల గొల్లగూడెం గ్రామానికి చెందిన చైతన్య హమాలి ముఠా మెస్త్రి వీర్ల మల్లేశ్వర రావు,సరస్వతి ల ఏకైక కూమార్తె లక్ష్మీ ప్రసన్న వివాహ వేడుక సందర్భంగా కార్పొరేటర్ చింతలపూడి శ్రావణి – సాయి కుమార్ దంపతుల చేతుల మీదుగా నూతన పట్టు వస్త్రాలు బహుకరించి నూతన వధువుకు ఆశీర్వాదం అందజేసారు.ఈ కార్యక్రమంలో మాజీ సొసైటీ చైర్మన్ మండే వీర హనుమంతరావు,భద్రాద్రి జిల్లా సీపీఎం పార్టీ […]
హోలీ పండుగను ఘనంగా జరుపుకున్న లక్ష్మీదేవిపల్లి పంచాయతీ సిబ్బంది
లక్ష్మీదేవి పల్లి మండలం లక్ష్మీదేవి పల్లి పంచాయతీ సిబ్బంది హోలీ పండుగను సంబరంగా ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా (ఏ టి ఈ సి) అలయెన్స్ ఆఫ్ టీచర్స్ అండ్ ఎంప్లాయిస్ క్లబ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు బాలునాయక్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీదేవి పల్లి పంచాయతీ సిబ్బంది పారిశుధ్య పనులు పర్యవేక్షించే పుష్ప రాజ్, సీనియర్ పంచాయతీ డ్రైవర్ సింగ్,లింగయ్య,శివ,నాగరాజు, మహాలక్ష్మి,చక్రవర్తి జగ్గయ్య తదితరులు పాల్గొన్నారు
కేజీబీవీ,యుఆర్ఎస్,సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలపై మూడు దశల పోరాటం:టీఎస్యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి.రాజు.
కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలు మరియు పట్టణ గురుకులాల్లో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బంది మరియు సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్యుటిఎఫ్) రాష్ట్ర కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది.ఈ సమస్యల పరిష్కారం కోసం దశలవారీగా మూడు దశల పోరాటం చేపట్టాలని నిర్ణయించినట్లు టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి రాజు తెలిపారు.కేజీబీవీ, యుఆర్ఎస్,సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలు దీర్ఘకాలంగా పెండింగ్లో […]
రంగులమయమైన ఇండోర్ స్టేడియం: తైక్వాండో విద్యార్థుల హోలీ హంగామా !
హనుమకొండ:మార్చి03 (తెలంగాణ వాణి స్టేట్ కోఆర్డినేటర్) హనుమకొండలోని జిల్లా ఇండోర్ స్టేడియం రంగుల లోకమైంది. నిత్యం కఠినమైన శిక్షణతో, క్రమశిక్షణతో కూడిన మార్షల్ ఆర్ట్స్ సాధన చేసే తైక్వాండో విద్యార్థులు మంగళవారం హోలీ పండుగను పురస్కరించుకుని అంగరంగ వైభవంగా సంబరాలు జరుపుకున్నారు. ప్రతిరోజూ లాగే ఉదయం స్టేడియంలో తమ కోచ్,స్నేహ ఆధ్వర్యంలో కఠినమైన ప్రాక్టీస్ పూర్తి చేసిన విద్యార్థులు, అనంతరం ఒక్కసారిగా పండుగ వాతావరణంలోకి మారిపోయారు.సాధన సమయంలో ప్రదర్శించే గంభీరత్వాన్ని పక్కన పెట్టి,చిన్నా పెద్దా తేడా లేకుండా […]
నూతన జిల్లా కలెక్టర్ అంకిత్ ఐఏఎస్ను మర్యాదపూర్వకంగా కలిసిన టిఎస్ యు.టి.ఎఫ్ భద్రాది జిల్లా కమిటి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఐడిఓసి నందు తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ అంకిత్ ఐఏఎస్ను మర్యాదపూర్వకంగా కలిసి,పూల బోకేతో స్వాగతం పలికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా విద్యారంగ అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. అనంతరం నూతన సంవత్సర క్యాలెండర్ మరియు డైరీని అందజేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి బి.రాజు,జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.వెంకటేశ్వర్లు,జిల్లా కార్యదర్శి ఎస్కే పాషా,పాల్వంచ మండల […]
సేవాలాల్ సద్గురు చూపిన మార్గం ఆదర్శనీయం: వైరా ఎమ్మెల్యే మాళోత్ రాందాస్ నాయక్
గిరిజన లంబాడీ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ (GLS JAC) ఆధ్వర్యంలో సద్గురు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. GLS JAC చైర్మన్ ఇస్లావత్ లక్ష్మణ్ నాయక్ అధ్యక్షతన లక్ష్మీదేవి పల్లి మార్కెట్ యార్డ్ నుండి రైల్వే స్టేషన్ మీదుగా ఎదురుగడ్డ వరకు లంబాడీ సంస్కృతి, సంప్రదాయ నృత్యాల నడుమ భారీ శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం లక్ష్మీదేవి పల్లి మండలం ఎదురుగడ్డలో మహా భోగ్ భండారో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి […]
పిడి బుగ్గ వెంకటేశ్వర్లు పదవీ విరమణ సందర్భంగా సన్మానించిన పి ఆర్ టి యు టి ఎస్ భద్రాద్రి జిల్లా కమిటీ
టేకులపల్లి మండలం ఏహెచ్ఎస్ గంగారం పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయులుగా సేవలందించిన పిడి బుగ్గ వెంకటేశ్వర్లు పదవీ విరమణ సందర్భంగా ఆయన స్వగృహంలో సన్మానం చేసిన పిఆర్.టి.యు.టిఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు పి. నరసయ్య. జిల్లా మరియు మండల స్థాయి సంఘ నాయకులు కూడా పాల్గొని పి డి చేసిన విద్యా సేవలను కొనియాడారు. విద్యార్థుల అభ్యున్నతికి ఆయన చూపిన అంకితభావం, క్రమశిక్షణ, నిబద్ధత ఆదర్శప్రాయమని నాయకులు పేర్కొన్నారు..కార్యక్రమంలో జిల్లా,మండల సంఘ నాయకులు పాల్గొన్నారు.
హర్ష టౌన్షిప్లో టీఎస్ టిటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బానోత్ రాములు నాయక్ ఆధ్వర్యంలో మేయర్, కార్పొరేటర్ లకు ఘన సన్మానం
పాల్వంచ మండలం హర్ష టౌన్షిప్ లో టీఎస్ టిటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బానోత్ రాములు నాయక్ అధ్యక్షతన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్ చౌహన్ మరియు 31వ డివిజన్ కార్పొరేటర్ నునావత్ శ్యామల దినేష్లకు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమం బానోత్ రాములు నాయక్ స్వగృహంలో జరిగింది.ఈ సందర్భంగా టౌన్షిప్లో నెలకొన్న సమస్యలను మేయర్ దృష్టికి తీసుకెళ్లి వినతిపత్రాన్ని అందజేశారు. దీనిపై స్పందించిన మేయర్ సంబంధిత సహాయ ఇంజనీర్తో చరవాణి ద్వారా మాట్లాడుతూ.. సీసీ […]
సాంబమూర్తి దేవాలయ అభివృద్ధి కమిటీ ఏకగ్రీవం ధర్మారం (తెలంగాణ వాణి ) పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని రచ్చపల్లి గ్రామంలో ఉన్న సాంబమూర్తి దేవాలయ అభివృద్ధి కమిటీ ని ఆదివారం స్థానిక సర్పంచ్ సూర రజిత వెంకటేశం ఆధ్వర్యంలో ఆదివారం ప్రత్యేక సమావేశమై నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చైర్మన్ గా కోలా వెంకటేశం, వైస్ చైర్మన్ గా పెరిక మహేష్, ప్రధాన కార్యదర్శిగా బైరి మహేష్, కోశాధికారిగా మోర గణపతి, చింతల సూర్య ప్రకాష్, ప్రచార […]
లక్ష్మీదేవిపల్లిలో వీధి దీపాల ఏర్పాట్లు వేగవంతం: సర్పంచ్ తాటి అనిత
లక్ష్మీదేవి పల్లి మండలంలో నూతన పాలకవర్గం అభివృద్ధి పనుల్లో వడివడిగా ముందుకు సాగుతోంది.ఈ క్రమంలో లక్ష్మీదేవిపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ తాటి అనిత పర్యవేక్షణలో ప్రకృతి వనం సమీపంలోని చాతకొండ రోడ్డుపై నూతన వీధి దీపాల ఏర్పాటు పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి.పాదచారులు,వాహన దారులకు రాత్రివేళల్లో ఇబ్బందులు లేకుండా శాశ్వత విధి దీపాలను ఏర్పాటు చేయడంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తూ సర్పంచ్ను అభినందిస్తున్నారు.ఈ పనులకు సహకారం అందించిన సంజయ్ నగర్ సర్పంచ్ తాటి బాలకృష్ణకు ధన్యవాదాలు తెలిపారు.