కూలీలైన్ మసీదు యూత్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు
రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని కూలీలైన్ మసీదు యూత్ సభ్యుల ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఉపవాస దీక్షలు ముగించిన అనంతరం ప్రార్థనలు నిర్వహించి, సామూహికంగా ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం సోదరభావం,ఐక్యతను ప్రతిబింబిస్తూ ఆధ్యాత్మిక వాతావరణంలో సాగింది.కార్యక్రమంలో మోమిత్,జుబ్బు,అబ్బు, టాపిక్,మున్నా,షోయబ్, సైద్, యాసీన్ పాషా, సోను, అఖిల్, సమీర్,అలీమ్, సోహెబ్ తదితరులు పాల్గొన్నారు.
టి ఎస్ యు టి ఎఫ్ అద్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవం
పాల్వంచ, మార్చి 08: తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ పాల్వంచ మండల కమిటీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మండల ఉపాధ్యక్షులు పీ. సత్యశ్రీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు చావా దుర్గా భవాని ముఖ్య అతిథిగా పాల్గొని మహిళా సాధికారతపై ప్రసంగించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి రాజు, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బి. మురళీమోహన్, మల్లెంపాటి వెంకటేశ్వర్లు, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం ప్రధాన కార్యదర్శి పద్మలత, […]
మహిళా దినోత్సవం .. రోజు మొక్కతో శుభాకాంక్షలు తెలిపిన ప్రకృతి ప్రేమికుడు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డు హోల్డర్ విశ్వామిత్ర చౌహాన్
మహిళా దినోత్సవం పురస్కరించుకొని మొక్కతో శుభాకాంక్షలు తెలిపిన ప్రకృతి ప్రేమికుడు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డు హోల్డర్ విశ్వామిత్ర చౌహన్.కొత్తగూడెం కార్పొరేషన్ 19వ డివిజన్ కార్పొరేటర్, ప్రముఖ వైద్యురాలు స్వప్న కు మొక్క బహూకరించి శాలువాతో ఘనంగా సన్మానించారు. పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటడం అవసరమని సందేశం ఇస్తూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు ఇన్ని రంగాలలో రాణిస్తున్నారని, సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తూ ముందుకు సాగాలని ఆమె ఆకాంక్షించారు.
ఖమ్మంలో శ్రీ చైతన్య టెక్నో స్కూల్ విద్యార్థుల ఐఎన్టీఎస్ఓ ఒలింపియాడ్ పరీక్షలు విద్యార్థుల ప్రతిభ..
స్థానిక ఎన్టీఆర్ సర్కిల్లోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎన్టీఎస్ఓ ఒలింపియాడ్ పరీక్షలు నిర్వహించగా, విద్యార్థులు సైన్స్ ప్రాజెక్టులు మరియు నమూనాలను ప్రదర్శించి తమ సృజనాత్మకతను చాటుకున్నారు.శాస్త్ర విజ్ఞానం నిత్యజీవితంలో ఎంతో ఉపయోగపడుతుందని వక్తలు అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య, డీజీఎం చేతన్ మాధుర్, కోఆర్డినేటర్ కృష్ణారావు, ప్రిన్సిపాల్ నివేదిత, వైస్ ప్రిన్సిపాల్ యాచమనేని శశాంక్, డీన్ గంగరాజు, […]
సారపాకలో బి ప్రకాష్ రావు మాతృమూర్తి దశదిన కార్యక్రమంలో పాల్గొన్న టి ఎస్ యు టి ఎఫ్ భద్రాది జిల్లా నాయకులు
తెలంగాణ రాష్ట్ర యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లెంపాటి వెంకటేశ్వర్లు సారపాకలో జరిగిన బి ప్రకాష్ రావు మాతృమూర్తి దశదిన కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా చిత్రపటానికి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి యాకూబ్ పాషా, సామాజిక మాధ్యమ సభ్యుడు మంగీలాల్ నాయక్,పాల్వంచ మండల ప్రధాన కార్యదర్శి హరి సింగ్ తదితరులు పాల్గొన్నారు.
లక్ష్యం దిశగా దూసుకుపోవాలి: జె.ఎన్.ఎస్ స్టేడియంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు !
క్రీడాకారులకు పోరాట సూర్తిని నింపిన సెక్రటరీ వెంకటస్వామి కోచ్ స్నేహ హనుమకొండ:మార్చి08 (తెలంగాణ వాణి స్టేట్ కోఆర్డినేటర్) హనుమకొండలోని జవహర్ లాల్ నెహ్రూ (జె.ఎన్.ఎస్) ఇండోర్ స్టేడియం ఆదివారం మహిళా చైతన్యానికి వేదికైంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని, స్టేడియంలో ప్రతిరోజూ కఠిన సాధన చేసే క్రీడాకారిణులు,మరియు క్రీడాకారులు తమ ప్రాక్టీస్ అనంతరం ఉత్సాహంగా వేడుకలు నిర్వహించుకున్నారు. క్రీడా ప్రాంగణమంతా బాలికల కేరింతలు, ఒకరికొకరు చెప్పుకున్న శుభాకాంక్షలతో సందడిగా మారింది. ఈ వేడుకల్లో హనుమకొండ జిల్లా తైక్వాండో […]
ప్రభుదయాల్ పాత అనుబంధాలతో సింగరేణి సి.యం.డి
ఇటీవల సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ ఎండీగా నియమితులైన డా.బుద్ధ ప్రకాష్ జ్యోతి కొత్తగూడెం పర్యటనలో భాగంగా పాత అనుబంధాలను గుర్తుచేసుకున్నారు.2007లో భద్రాచలం ఐటిడిఏ పీఓ పనిచేసిన సమయంలో గిరిజన విద్యా కళాశాల ప్రిన్సిపాల్గా సేవలందించిన డా. ప్రభుదయాల్ నివాసాన్ని సందర్శించారు. దయాల్ బాగోగులు తెలుసుకుని,ఇటీవల వివాహం జరిగిన ఆయన కుమారుని వధూవరులను ఆశీర్వదించారు. తన హయాంలో కళాశాలకు జాతీయ ఉపాధ్యాయ మండలి గుర్తింపు,బీఈడీ 200 సీట్లు,నూతన భవనాలు, కంప్యూటర్ ల్యాబ్, గ్రంథాలయం,అలాగే ఇగ్నో (IGNOU) స్టడీ […]
ఇస్రో యువికా–26కు దరఖాస్తులు ఆహ్వానం: భద్రాది జిల్లా సైన్స్ అధికారి బి.సంపత్ కుమార్
విద్యార్థుల్లో అంతరిక్ష విజ్ఞానంపై ఆసక్తి పెంపొందించేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ‘యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రామ్’ (యువికా–26)కు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.ఈ కార్యక్రమం శాస్త్ర, సాంకేతిక,ఇంజనీరింగ్,గణిత రంగాలపై ఆసక్తి ఉన్న విద్యార్థులకు మంచి వేదికగా నిలుస్తోంది.ప్రభుత్వ,ప్రైవేటు పాఠశాలల్లో ప్రస్తుతం 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.ఎంపికలో 8వ తరగతి మార్కులకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు క్విజ్లు,విజ్ఞాన సదస్సులు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, గ్రామీణ విద్యార్థులకు వెయిటేజ్ మార్కులు కేటాయిస్తారు. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 31 […]
భద్రాచలం డివిజన్ లో పి ఆర్ టి యు టి ఎస్ సమావేశం
భద్రాచలం డివిజన్ లో పిఆర్టియు టి ఎస్ ప్రాంతీయ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు దశమ బాబు అధ్యక్షతన నిర్వహించారు.ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షుడు నర్సయ్య, ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ హాజరై మండల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో కలిసి జిల్లాలో సంఘ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.అలాగే జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబోయే అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమాలపై సమావేశంలో చర్చ జరిగింది.ఈ సందర్భంగా సీనియర్ నాయకులు దనికొండ శ్రీనివాసరావు,దశమ బాబు,మంగయ్య,నాగులు జిల్లా శాఖకు పలు సూచనలు, సలహాలు […]
మండల స్థాయి బాల మేళా 2.0 విజయవంతం : ఎంఇఓ కృష్ణయ్య
లక్ష్మీదేవి పల్లి మండలం మండల స్థాయి బాలమేళా పూర్తిస్థాయిలో విజయవంతమైందని ఎంఈఓ పి కృష్ణయ్య తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ స్థాయి బాల మేళాలో విద్యార్థులు తమ ప్రతిభను చాటుకున్నారు.వివిధ నైపుణ్యాల ను సృజనాత్మకతను ప్రదర్శించారు.అనంతరం విజేతలైన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎంఇఓ కృష్ణయ్య తో పాటు కాంప్లెక్స్ హెడ్మాస్టర్లు, కాంప్లెక్స్ సెక్రటరీలు మరియు మండలంలోని పలు పాఠశాలల ఉపాధ్యాయుని, ఉపాద్యాయులు,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు