UPDATES  

 కరీంనగర్ కార్పొరేషన్ కైవసం చేసుకున్న బిజెపి

కరీంనగర్ (తెలంగాణ వాణి) తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాక రాజకీయాలు మరింత హీట్ ఎక్కాయి. ముఖ్యంగా కరీంనగర్ కార్పోరేషన్ లో హంగ్ ఏర్పడటం, ఏ పార్టీకి పూర్తిగా మెజారిటీ రాకపోవడంతో అన్ని పార్టీలు క్యాంపు రాజకీయాలకు తెరతీశాయి. ఏడు కార్పోరేషన్ లలో కరీంనగర్ పీఠంను దక్కించుకునేందుకు అన్నిపార్టీలు తమదైన వ్యూహలతో ముందుకు వెళ్లిన చివరకు కాషాయ పార్టీ కరీంనగర్ కార్పొరేషన్ ను బీజేపీ సొంతం చేసుకుంది. కరీంనగర్ లో 66 స్థానాలకు గాను బీజేపీ 30, కాంగ్రెస్ 14, బీఆర్ఎస్ 9, మజ్లిస్ 3, ఇతరులు 10 మంది కార్పొరేటర్లుగా గెలిచారు. కార్పొరేషన్‌లో ఎక్స్‌అఫీషియోతో కలిపి సభ్యుల సంఖ్య 69కి చేరగా, మేయర్ పదవికి 35 మంది మద్దతు అవసరం. ఎన్నికల అనంతరం బీజేపీలో కొందరు కార్పొరేటర్లు చేరడంతో, బీజేపీ బలం 34 వరకు చేరుకుంది. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఎక్స్ అఫీషియో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ముఖ్యంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యూహత్మకంగా ముందుకు వెళ్లడంతో కరీంనగర్ కార్పొరేషన్ బీజేపీ సొంతమయ్యింది. కరీంనగర్ మేయర్ గా కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ గా సునీల్ రావు ఎన్నికయ్యారు. మొత్తంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ తన వ్యూహలతో ఎలాగైన కరీంగనగర్ కార్పొరేషన్ పై బీజేపీ జెండా ఎగురవేయాలని ఆయన తన పంతంను నెగ్గించుకున్నట్లైంది. మొత్తంగా బీజేపీ క్యాడర్ కూడా దీనిపై ఫుల్ జోష్ గా ఉన్నారు. మరోవైపు కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికలకు బీఆర్ఎస్ దూరంగా ఉంటున్నామని ముందే ప్రకటించింది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest