UPDATES  

అర్బన్ ఎమ్మెల్యేతో కలిసి సీఎం కప్ టార్చ్ రిలే ర్యాలీని ప్రారంభించిన కలెక్టర్

క్రీడా రంగంలో నిజామాబాద్ ఖ్యాతిని ఇనుమడింపజేయాలి  కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపు నిజామాబాద్ జనవరి 09 : (తెలంగాణ వాణి ప్రతినిధి) క్రీడా రంగంలో నిజామాబాద్ జిల్లా ఖ్యాతిని మరింతగా ఇనుమడింపజేయాలని జిల్లా పాలనాధికారి ఇలా త్రిపాఠి పిలుపునిచ్చారు. గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సహించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సీ.ఎం కప్-2026 సెకండ్ ఎడిషన్ క్రీడా పోటీలను పురస్కరించుకుని శుక్రవారం నిజామాబాద్ నగరంలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణతో కలిసి […]

ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ లో సీపీ టీం ఘన విజయం

నిజామాబాద్ జనవరి 09: (తెలంగాణ వాణి ప్రతినిధి)  సిపి టీం వర్సెస్ ప్రెస్ క్లబ్ ఎలెవన్ జట్ల మధ్య జరిగిన ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ లో పోలీస్ కమిషనర్ ఎ లేవన్ టీం ఘనవిజయం సాధించింది.నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో శుక్రవారం పోలీస్ టీం ప్రెస్ క్లబ్ టీం ల మధ్య పెండ్లి క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు. మొదట టాస్ గెలిచి పోలీస్ టీం బ్యాటింగ్ ను ఎంచుకున్నారు. నిర్ణీత 12 ఓవర్ ల లో పోలీస్ […]

తల్లిదండ్రుల పిర్యాదు మేరకు కస్తూర్బా పాఠశాలను తనిఖీ చేసిన మాజీ ఎమ్మెల్యే

ఎల్లారెడ్డి జనవరి 09 తెలంగాణ వాణి ప్రతినిధి  కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్ధినులకు సరైన వసతులు లేక అవస్థలు పడుతున్నారని వారి తల్లిదండ్రులు మాజీ శాసనసభ్యులు జాజాల సురేందర్ కి ఫోన్ చేసి సమస్యలను వివరించగా వెంటనే అక్కడికి చేరుకున్నారు. విద్యాలయంలోని వంట గది మరియు విద్యార్థులు త్రాగే నీరు, తినే ఆహారాన్ని పరిశీలించారు. విద్యాలయంలో ప్రస్తుత దుర్బర పరిస్థితిని మరియు విద్యార్థినిలు తినే ఆహారం వారు వారి […]

కాంగ్రెస్ జిల్లా అధ్యక్షునికి ఘన సత్కారం  ఎల్లారెడ్డి జనవరి 09 తెలంగాణ వాణి ప్రతినిధి నిజాంసాగర్ మండలం నందు కాంగ్రెస్ పార్టీ డిసిసి కామారెడ్డి జిల్లా అధ్యక్షులు ని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ జిల్లా ప్రెసిడెంట్గా బాధ్యతలు నిర్వహిస్తున్న వారిని శాలువాతో ఘనంగా సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ నెంబర్ లింగమయ్య మాజీ ఉపసర్పంచ్ యాదగిరి గౌడ్ గ్రామస్తులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

రైతుల పట్ల నిబద్ధతను మరోసారి చాటిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్

ఎల్లారెడ్డి నియోజకవర్గం నాగిరెడ్డిపేట మండల నిజాంసాగర్ ప్రాజెక్టు ఫోర్‌షోర్ ప్రాంతంలో జంగిల్ క్లియరెన్స్, ప్రవాహ మార్గంలో అడ్డంకుల తొలగింపు పనులకు రూ. 2.08 కోట్ల వ్యయంతో తెలంగాణ ప్రభుత్వం జీఓ జారీ ఎల్లారెడ్డి జనవరి 09 తెలంగాణ వాణి ప్రతినిధి ఎల్లారెడ్డి నియోజకవర్గ రైతుల దీర్ఘకాలిక సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు కీలక విజయం సాధించారు.నాగిరెడ్డిపేట మండల పరిధిలోని నిజాంసాగర్ ప్రాజెక్టు ఫోర్‌షోర్ ప్రాంతంలో జంగిల్ క్లియరెన్స్, ప్రవాహ మార్గంలో అడ్డంకుల […]

లక్ష్మీదేవిపల్లి లో సమీక్ష సమావేశం…పనులను వేగవంతంగా పూర్తి చేయాలి: ఎంపీడీవో సుస్మితా

లక్ష్మీదేవిపల్లి మండలంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారిణి సుస్మితా అధ్యక్షతన గ్రామ పంచాయతీ కార్యదర్శులు మరియు ఉపాధి హామీ పథకం సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో గ్రామాల్లో కొత్త నర్సరీల ఏర్పాటు,పారిశుద్ధ్య పనుల అమలు,మంచినీటి,పన్నుల వసూలు వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు.సంబంధిత పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీఓ శ్రీనివాస్,వీరన్న,ఈ సి సత్యనారాణ,సెక్రెటరీ సాంబయ్య,వివిధ పంచాయతీ సెక్రటరీలు ఉపాధి హామీ పథకం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సర్పంచ్ చొరవతో పంచాయతీలో వెలిగిన దీపాలు..

పాల్వంచ : వీధులు చీకటిమయంగా లేకుండా, పిల్లలు,పెద్దలు, మహిళలు బయటకు వెళ్లాలంటే రాత్రి వేళ ఇబ్బంది లేకుండా ఉండుటకు పాల్వంచ మండలం కోడిపుంజుల వాగు గ్రామ పంచాయతీ సర్పంచ్ అజ్మీరా మహేశ్వరి శ్రీనివాస్ విధి దీపాలను ఏర్పాటు చేశామని తెలిపారు. అన్ని విధి దీపాలను ఏర్పాటు చేయడంతో స్థానిక ప్రజలు సర్వత్ర హర్షం వ్యక్తం చేస్తున్నారు.

వెల్లివిరిసిన యువ చైతన్యం పరిమళించిన మానవత్వం

ధర్మారం (తెలంగాణ వాణి) మండలంలోని కొత్తూరు గ్రామానికి చెందిన కుడుదల కిష్టయ్య జీవనోపాధి కోసం రోజు కూలి పనులకు వెళ్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. పని చేస్తున్న సమయంలో అనుకోకుండా జరిగిన ప్రమాదం అతని జీవితాన్నే అస్తవ్యస్తం చేసింది. కూలి పనిలో భాగంగా ఒకటో అంతస్తు నుండి అదుపుతప్పి కింద పడి కిష్టయ్య తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో అతని ఎడమ తొడ ఎముక పూర్తిగా విరిగిపోయి, నడవలేని స్థితికి చేరుకున్నాడు. ప్రమాదం జరిగిన వెంటనే సరైన […]

తెలంగాణలో మరో ఉపఎన్నిక

తెలంగాణలో మరో ఉపఎన్నిక కవిత రాజీనామాకు ఆమోదం   హైదరాబాద్ (తెలంగాణ వాణి) జాగృతి అధ్యక్షురాలు కవిత రాజీనామాకు ఆమోద ముద్ర పడింది. కవిత రాజీనామాను మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆమోదించారు. గతేడాది సెప్టెంబర్ 2న బీఆర్ఎస్ పార్టీ కవితను సస్పెండ్ చేసింది. ఆ వెంటనే 3వ తేదీన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు కవిత ప్రకటించారు.   2022 జనవరిలో నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన కవితకు 2028 వరకు […]

గిరిజన మహిళ ప్రమాదానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలి

అనుమతులు లేకుండా ఇసుక తవ్వకాలు చేపట్టిన వారిపై చర్యలేవి చాతకొండ ఇసుక అక్రమ రవాణా బాధితురాలికి న్యాయం చేయండి జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్  కొత్తగూడెం (తెలంగాణ వాణి) లక్ష్మీదేవిపల్లి మండలంలోని చాతకొండ బిసి కాలనీలో ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుక తవ్వకాలు చేపట్టడమే కాకుండా గిరిజన మహిళ ప్రమాదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జైభీమ్ రావ్ భారత్ పార్టీ (జేబీపీ) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ డిమాండ్ చేశారు. […]