దీక్షిత ధరణి అసోసియేషన్ మేనేజర్ ప్రకృతి ప్రేమికుడు శ్రీనివాస్ ను అభినందించిన భద్రాద్రి జిల్లా ప్రకృతి ప్రేమికుడు బాలు నాయక్.
మొక్కలే మానవాళికి జీవనాధారం అంటూ…. పిల్లలకు ఆస్తులతో పాటు మంచి వాతావరణం ఇవ్వాలంటే మొక్కలు నాటాలని మంచి ఆలోచనతో ఇంట్లో అందమైన మొక్కలు ఆక్సిజన్ మొక్కల పెంపకం పట్ల దీక్షిత ధరణి అసోసియేషన్ మేనేజర్ శ్రీనివాస్ ను అభినందించిన భద్రాద్రి జిల్లా ప్రకృతి ప్రేమికుడు బాలు నాయక్.గతంలో మొక్కలను కూడా వితరణ చేసినట్లు అయన పేర్కొన్నారు.పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరు ఇంటి ఆవరణలో మొక్కలు నాటాలని అన్నారు.
వివేకానంద యూత్ ఆధ్వర్యంలో బద్ది పోచమ్మ అమ్మవారికి బోనాలు
వివేకానంద యూత్ ఆధ్వర్యంలో బద్ది పోచమ్మ అమ్మవారికి బోనాలు వేములవాడ,జూలై 16 (తెలంగాణ వాణి) : వేములవాడ పట్టణంలోని వివేకానంద యూత్ (మార్కండేయ నగర్ కాలనీ) వారి ఆధ్వర్యంలో బుధవారం రోజున పట్టణంలోని బద్ది పోచమ్మ అమ్మవారికి ఘనంగా బోనాలు సమర్పించారు.తమ కాలనీ నుండి తలపై బోనాలతో,డప్పు చప్పులు,నృత్యాలు ఆట పాటలతో అమ్మవారి ఆలయం వరకు వెళ్లి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.నృత్యాలతో ఊరేగింపుగా సాగిన ఈ బోనాల ఊరేగింపు ప్రజల దృష్టిని ఆకర్షించింది.ఈ సందర్భంగా […]
కాంపెల్లి కనకేష్ అద్వర్యంలో ఎమ్మెల్సి కవిత ను మర్యాద పూర్వకంగా కలిసిన యువజన నాయకులు
కొత్తగూడెం విచ్చేసిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కు ఘన స్వాగతం పలికిన మర్యాదపూర్వకంగా కలిసిన ప్రముఖ నాయకులు కాంపెల్లి కనకేష్.ఇదే సందర్భంలో కనకేష్ అద్వర్యంలో ఎమ్మెల్సి కవిత కు యువజన నాయకులు కుసుమ నవీన్ మరియు మిత్ర బృందం ఈర్ల శ్యామ్,అబ్దుల్ రెహమాన్ అలియాస్ జుబ్బు,బాల శేఖర్,ధనరాజ్, వినయ్, సాయి కలిసి బోకేలు అందించారు.రాబోవు రోజులు మనవే అని… అందరూ ఐక్యంగా ఉండి ప్రజలలో మమేకమై సమస్యల సాధన కు కృషి చేయాలని సూచించారు.
బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు,పాల్వంచ కో-ఆపరేటివ్ సొసైటీ ఉపాధ్యక్షులు కాంపెల్లి కనకేష్ పటేల్ నివాసానికి విచ్చేసిన బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈరోజు కొత్తగూడెం పర్యటన సందర్భంగా కొత్తగూడెంలో జాగృతి మీటింగ్ అనంతరం పాల్వంచలోని బిఆర్ఎస్ పార్టీ నాయకులు, పాల్వంచ కో- ఆపరేటివ్ సొసైటీ ఉపాధ్యక్షులు కాంపెల్లి కనకేష్ పటేల్ నివాసానికి బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విచ్చేశారు.కాంపెల్లి కనకేష్ పటేల్ నూతన గృహ నిర్మాణం చేసుకొని గృహప్రవేశం చేసిన సందర్భముగా అప్పుడు వేరే కార్యక్రమాలు ఉండటం వలన హాజరు కాలేకపోయినందున నేడు వారి నివాసానికి విచ్చేసి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు […]
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు గజమాలతో ఘన స్వాగతం పలికిన బీఆర్ఎస్ శ్రేణులు

మల్లాపూర్ (తెలంగాణ వాణి) మండల కేంద్రంలో భారత రాష్ట్ర సమితి కార్యాలయాన్ని ప్రారంభించేందుకు ముఖ్య అతిథిగా వచ్చిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు మండలంలోని ముత్యంపేటలో భారత రాష్ట్ర సమితి నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ముత్యంపేటలోని జ్యోతిరావు పూలే విగ్రహానికి ఆర్ఎస్ ప్రవీణ్, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కుమార్ పూలమాలలు వేశారు. అనంతరం మల్లాపూర్ వైస్ ఎంపీపీ గౌరు నాగేష్ ఆధ్వర్యంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఎమ్మెల్సీ ఎల్ […]
ప్రజలు యువతి యువకులు సీత్లా పండగను ఘనంగా జరుపుకున్నారు
ప్రకృతి దేవతలను ఆరాధిస్తూ పశుసంపద వర్ధిల్లాలని కోరుతూ ప్రజలు యువతి యువకులు సీత్లా పండగ ఘనంగా జరుపుకున్నారు. పంటలు సమృద్ధిగా..పండాలని పశుసంపద మంచిగా ఉండాలని ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని భవాని అమ్మవారిని కోరుకున్నారు.అతి పురాతనమైన ఈ పండుగను తమ..తొలి పండుగగా నేటికీ మారుమూల తండాల్లో బంజారాలు అత్యంత .. వైభవంగ జరుపుకోవడం విశేషం.ఈ కార్యక్రమంలో గోప తండా గ్రామ పెద్దలు ఉద్యోగస్తులు,రైతులు స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు
ఘనంగా బంజారాల సీత్లా పండగ
ప్రకృతి దేవతలను ఆరాధిస్తూ పశుసంపద వర్ధిల్లాలని కోరుతూ ప్రజలు యువతి యువకులు సీత్లా పండగ ఘనంగా జరుపుకున్నారు. పంటలు సమృద్ధిగా..పండాలని పశుసంపద మంచిగా ఉండాలని ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని భవాని అమ్మవారిని కోరుకున్నారు.అతి పురాతనమైన ఈ పండుగను తమ..తొలి పండుగగా నేటికీ మారుమూల తండాల్లో బంజారాలు అత్యంత .. వైభవంగ జరుపుకోవడం విశేషం.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు ఉద్యోగస్తులు, వ్యాపారవేత్తలు,రైతులు స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు
వికాస తరంగిణి కొత్తగూడెం శాఖ ఆధ్వర్యంలో రేగళ్లలో జూలై 4న ఉచిత క్యాన్సర్ క్యాంప్
వికాస తరంగిణి కొత్తగూడెం శాఖ ఆధ్వర్యంలో మహిళా ఆరోగ్య వికాస్ కార్యక్రమం జూలై 4వ తేదీ శుక్రవారం రేగళ్ల గ్రామంలో ఉచిత క్యాన్సర్ క్యాంప్ నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు గారు హాజరవుతున్నారనీ క్యాంప్ నిర్వాహకులు తెలిపారు.ఈ క్యాంప్ ను మహిళలందరూ వినియోగించుకోవాలని వికాస తరంగిణి సభ్యులు రమాదేవి,రాజ్యలక్ష్మి,పూర్ణ లయన్స్ క్లబ్ ఆఫ్ కొత్తగూడెం అధ్యక్షులు లగడపాటి రమేష్ చంద్ తెలిపారు.
వర్షాన్ని సైతం లెక్కచేయకుండా వైద్య సిబ్బంది సేవలు భేష్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం పాండురంగా పురం సబ్ సెంటర్ పరిధిలోని హ్యాబిటేషన్ రాజీవ్ నగర్ కాలనీలో డాక్టర్ తేజస్విని మరియు డాక్టర్ దేవేందర్ సబ్ యూనిట్ అధికారి జితు రామ్ ఆధ్వర్యంలో ఇంటింటి సర్వే మరియు యాంటి లార్వా మరియు పైరిత్రం స్ప్రేయింగ్ మరియు ఆరోగ్య శిబిరం నిర్వహించారు.ఈ సందర్భంగా వర్షాన్ని సైతం లెక్కచేయకుండా వైద్య సిబ్బంది చేస్తున్నా కృషి అభినందనీయం ప్రజలు అంటున్నారు.ఈ కార్యక్రమంలో రామ్ రెడ్డి,శంకర్,ఉమారాణి మరియు పాండురంగాపురం సబ్ సెంటర్ […]
కేంద్ర హోంశాఖ మంత్రి పర్యటన సక్సెస్ కు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు

నిజామాబాద్(తెలంగాణ వాణి ప్రతినిధి) నిజామాబాదు పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కార్యక్రమాన్ని సక్సెస్ చేసేందుకు సీనియర్ ఐఏఎస్ అధికారులు, భద్రతా విభాగం ఉన్నతాధికారులు, జిల్లా పాలన అధికారి (కలెక్టర్), అన్ని శాఖల అధికారులు, వారి సిబ్బంది, రైతులు, అన్ని వర్గాల ప్రజలు, ప్రజా ప్రతినిధులు, బందోబస్తు విధులకు వివిధ జిల్లాల నుంచి వచ్చి సమర్థవంతంగా విధులు నిర్వహించిన సిబ్బంది, ట్రాఫిక్ సిబ్బందితో ప్రజలతో పాటుగా అనుక్షణం సహకరించిన ప్రింట్ మీడియా […]