UPDATES  

NEWS

కొత్తగూడెం మేయర్ బరిలోకి ప్రముఖ విద్యావేత్త డా. యం.వీరనాయక్ తెలంగాణ వాణి దిన పత్రిక క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఖేడ్ డిఎస్పి వెంకట్ రెడ్డి ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలి: టి పి టి ఎఫ్ మండల అధ్యక్షుడు బి.సుక్య సర్పంచ్ కె.రవి ను సన్మానం చేసిన సొసైటీ వైస్ చైర్మన్ కాంపల్లి కనకేష్‌ కిన్నెరసాని గ్రామపంచాయతీ సర్పంచ్ వజ్జ రామకృష్ణ, ఉపసర్పంచ్ వజ్జా ఇంద్రజ ఆధ్వర్యంలో ముగిసిన క్రికెట్ టోర్నమెంట్ మహిళల కళలకు వేదికగా ముగ్గుల పోటీలు దేశ అభివృద్ధి మోదీ లక్ష్యం- రఘునాధ్ కాజీపేటలో అట్టహాసంగా ముగిసిన 58వ జాతీయ సీనియర్ ఖోఖో ఛాంపియన్‌షిప్ క్రీకెట్ టోర్నమెంట్ పోస్టర్ ను ఆవిష్కరించిన లక్ష్మీదేవి పల్లి ఎస్ ఐ రమణ రెడ్డి

కొత్తగూడెం మేయర్ బరిలోకి ప్రముఖ విద్యావేత్త డా. యం.వీరనాయక్

కొత్తగూడెం మేయర్ బరిలోకి ప్రముఖ విద్యావేత్త డా. యం.వీరనాయక్. దేశంలోనే ఏకైక ఏజెన్సీ B.Ed కళాశాల భద్రాచలం ప్రిన్సిపాల్ గా సేవలందిస్తున్నారు.. ప్రజా సమస్యలపై నిరంతరం పనిచేసేందుకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి అరగేంట్రం… విశ్వసనీయ వర్గాల సమాచారం -5 వ డివిజన్ లో ఓటు హక్కు

తెలంగాణ వాణి దిన పత్రిక క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఖేడ్ డిఎస్పి వెంకట్ రెడ్డి

సంగారెడ్డి జనవరి 21, (తెలంగాణ వాణి ప్రతినిధి) సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని స్థానిక డిఎస్పి కార్యాలయంలో బుధవారం తెలంగాణవాణి దినపత్రిక క్యాలెండర్ ను నారాయణఖేడ్ డిఎస్పి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించి మీడియా సంస్థల సేవలను ప్రశంసించారు. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా నిలువాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వాణి స్టాఫ్ రిపోర్టర్ డాక్టర్ ఆంజనేయులు, పాటిల్ ఉదయ్ కుమార్, షేక్ ఫయాజ్, ఇబ్రహీం ఖాన్ […]

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఐక్య తల్లిదండ్రుల సంఘం (UPA) ఆధ్వర్యంలో రూపొందించిన క్యాలెండర్‌ను ఘనంగా ఆవిష్కరించారు.ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు మారుతి రత్నాకర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల బిక్షపతి, ATEC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జె.సోమయ్య, తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు పామర్తి అంకినీడు ప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జిల్లా అధ్యక్షులు లోగాని శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి రుద్రోజ్ మోహన్‌లు క్యాలెండర్‌ను ఆవిష్కరించగా, అనంతరం వాటిని జిల్లా కమిటీ […]

ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలి: టి పి టి ఎఫ్ మండల అధ్యక్షుడు బి.సుక్య

పాల్వంచ మండలం మోడల్ స్పోర్ట్స్ స్కూల్ కిన్నెరసాని లో టిపిటిఎఫ్ పాల్వంచ మండల అధ్యక్షుడు బర్మావత్ సుక్య ఆధ్వర్యంలో తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ నూతన సంవత్సర క్యాలెండర్, డైరీని ఆవిష్కరించిన పాఠశాల హెచ్ఎం యన్.చందు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ..సిపిఎస్‌ను రద్దు చేసి ఓపిఎస్‌ను పునరుద్ధరించాలని, పండిట్, పిఈటి పోస్టులను అప్‌గ్రేడేషన్ చేసి పదోన్నతి ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో స్టాఫ్ సెక్రటరీ ఎస్.బాలు,ఎల్ ఎఫ్ ఎల్ హెచ్ ఎం పి.వెంకటేశ్వర్లు,బి.శంకర్,పి.స్వరూప రాణి,ఎస్.బాలు ఇ.పద్మావతమ్మ, ఇంగ్లీష్ బాలు,డి.సతీష్ […]

సర్పంచ్ కె.రవి ను సన్మానం చేసిన సొసైటీ వైస్ చైర్మన్ కాంపల్లి కనకేష్‌

ములకలపల్లి మండలం సీతారాంపురం గ్రామపంచాయతీ ఇండిపెండెంట్ సర్పంచ్ అభ్యర్థి కుంజ రవి ను బి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు సొసైటీ వైస్ చైర్మన్ కాంపల్లి కనకేష్ నివాసానికి ఆహ్వానించి, ఆయన బృంద సభ్యులతో కలిసి శాలువాతో ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా పరస్పర అభిప్రాయాలు పంచుకుంటూ గ్రామాభివృద్ధిపై చర్చించారు.

కిన్నెరసాని గ్రామపంచాయతీ సర్పంచ్ వజ్జ రామకృష్ణ, ఉపసర్పంచ్ వజ్జా ఇంద్రజ ఆధ్వర్యంలో ముగిసిన క్రికెట్ టోర్నమెంట్

కిన్నెరసాని గ్రామపంచాయతీ పరిధిలో కొమరం భీమ్ క్రికెట్ టోర్నమెంట్ – సీజన్ 3 ను దివంగత వజ్జ విద్యాసాగర్ జ్ఞాపకార్థం ఘనంగా నిర్వహించారు. ఈ టోర్నమెంట్‌ను కిన్నెరసాని గ్రామపంచాయతీ సర్పంచ్ వజ్జ రామకృష్ణ, ఉపసర్పంచ్ వజ్జా ఇంద్రజ ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించారు. ఈ టోర్నమెంట్ లో కిన్నెరసాని క్రికెట్ టీం మెంబెర్స్ ఉత్సాహంగా ఆడి అలరించారు.ఈ కార్యక్రమంలో బొర్ర ఉదయ్,షేక్ ఆరిఫ్,వజ్రా వినయ్,పడిగా లోకేష్ తదితరులు పాల్గొని టోర్నమెంట్‌కు విశేష సహకారం అందించారు. గ్రామ యువత క్రీడల […]

మహిళల కళలకు వేదికగా ముగ్గుల పోటీలు

కిన్నెరసాని గ్రామ పంచాయతీలో మహిళలలో దాగి ఉన్న కళాత్మక ప్రతిభను వెలికి తీసేందుకు ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు.సర్పంచ్ వజ్జ రామకృష్ణ,ఉపసర్పంచ్ వజ్జ ఇంద్రజా ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల్లో యువతులు, మహిళలు ఉత్సాహంగా పాల్గొని రంగురంగుల ముగ్గులతో ఆకట్టుకున్నారు. సంక్రాంతి సంప్రదాయాలను ప్రోత్సహిస్తూ మహిళల సృజనాత్మకతను వెలుగులోకి తేవడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.మొదటి బహుమతి తాటి రామ, ద్వితీయ బహుమతి బోనగిరి శ్రీలత, తృతీయ బహుమతి బుడగం హేమలతలకు దక్కాయి. బహుమతులను […]

దేశ అభివృద్ధి మోదీ లక్ష్యం- రఘునాధ్

ధర్మారం (తెలంగాణ వాణి) భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వెర్రబెల్లి రఘునాథ్ శుక్రవారం ధర్మపురి మండలం లో పర్యటించారు. ఈ సందర్భంగా బీజేపీ ధర్మపురి నియోజకవర్గ ఇన్చార్జి కన్నం అంజయ్య అంజయ్య, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కొమ్ము రాంబాబు నేతృత్వంలో ధర్మారం మండల భాజాప శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికి ఆయనను శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం రఘునాథ్ మాట్లాడుతూ బూత్ స్థాయి నుండి కార్యకర్తలను బలోపేతం చేయాలని దేశ ప్రధాని నరేంద్ర మోడీ […]

కాజీపేటలో అట్టహాసంగా ముగిసిన 58వ జాతీయ సీనియర్ ఖోఖో ఛాంపియన్‌షిప్

  ● అధ్యక్షులు జంగా రాఘవరెడ్డి సారథ్యంలో క్రీడాకారులకు అంతర్జాతీయ స్థాయి వసతులు. కాజీపేట్:జనవరి15 (తెలంగాణ వాణి టౌన్) ​తెలంగాణ ఖోఖో అసోసియేషన్ అధ్యక్షులు జంగా రాఘవరెడ్డి సారథ్యంలో కాజీపేట వేదికగా ఐదు రోజుల పాటు సాగిన 58వ జాతీయ స్థాయి సీనియర్స్ ఖోఖో పోటీలు గురువారం సాయంత్రం అత్యంత వైభవంగా ముగిశాయి. దేశంలో మునుపెన్నడూ లేని విధంగా అత్యాధునిక హంగులు మరియు సకల సౌకర్యాలతో ఈ ఛాంపియన్‌షిప్‌ను నిర్వహించడం విశేషం. క్రీడాకారులకు అవసరమైన భోజనం, వసతితో […]

క్రీకెట్ టోర్నమెంట్ పోస్టర్ ను ఆవిష్కరించిన లక్ష్మీదేవి పల్లి ఎస్ ఐ రమణ రెడ్డి

లక్ష్మీదేవిపల్లి మండలం బావోజితండా గ్రౌండ్‌ లో ఈ నెల 12 నుంచి ప్రారంభం కానున్న ఉమ్మడి రేగళ్ల,మైలారం,బంగారుచేలక పంచాయితీల క్రీకెట్ టోర్నమెంట్ పోస్టర్‌ను లక్ష్మీదేవిపల్లి ఎస్‌ఐ రమణారెడ్డి ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో పెద్ద తండా సర్పంచ్ లావుడ్య పూర్ణ, గట్టు మల్ల సర్పంచ్ బట్టు కనకరాజు,క్రికెట్ నిర్వాహకులు హనుమాన్,తారాచంద్,రాజ్‌కుమార్‌ తో పాటు యువకులు పాల్గొన్నారు.