UPDATES  

NEWS

హ్యాండ్ బోర్ మరమ్మతు – ప్రజల సమస్యకు తక్షణ పరిష్కారం:కార్పొరేటర్ కళావతిధనరాజ్ కాంగ్రెస్ నాయకులకు కాకులమర్రి లక్ష్మణ్ బాబు భయం పట్టుకుంది అంగన్‌వాడీల్లో ఒంటిపూట బడి అమలు పట్ల హర్షం వ్యక్తం చేసిన విద్యా పరిరక్షణ కమిటీ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు హరిలాల్ నాయక్  సృజన టెక్ ఫెస్ట్ 2025–26 విజేతలకు ఘన సన్మానం:ప్రిన్సిపాల్ బండి శ్రీనివాస్, ఖబడ్దార్ బిఆర్ఎస్ నాయకుల్లారా రామ భక్త శ్రీ శ్రీ శ్రీ లాలు దాస్ అందరికి ఆదర్శం రక్తదానానికి యువత ముందుకు రావాలి: డీఎస్పీ ఆదినారాయణ ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులు డాక్టర్ వరుణ్ కుమార్‌ కు మొక్కలు అందజేసిన వైభవంగా సర్వారం ఒడ్డుగూడెం తండాలో కోదండ రామాలయం విగ్రహ ప్రతిష్ట టీఎస్ యుటిఎఫ్ భద్రాచలం మండల కమిటీ నుంచి ఎంఈఓకు ప్రాతినిధ్యం

 ‘యూట్యూబ్ ఛానళ్లు బాధ్యతగా ఉండాల్సిందిపోయి ఆధారాలు లేకుండా అడ్డగోలుగా, అసత్యాలను పదేపదే ప్రసారం

వ్యక్తిగతంగా తనను, తమ పార్టీని దెబ్బతీయాలనే కుట్రతో కొన్ని యూట్యూబ్ ఛానళ్ల వ్యవహరిస్తున్నాయని మాజీ మంత్రి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తెలిపారు. అసత్యాలను ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానళ్లపై అధికారికంగా గూగుల్‌కి ఫిర్యాదు చేసినట్లు వివరించారు. ఇలాంటి ఛానళ్ల ప్రచారంపై జాగ్రత్త ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అలాంటి ఛానళ్లను ఇక ఉపేక్షించేది లేదని న్యాయ పోరాటం చేస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా కీలక ప్రకటన విడుదల చేశారు.

‘యూట్యూబ్ ఛానళ్లు బాధ్యతగా ఉండాల్సిందిపోయి ఆధారాలు లేకుండా అడ్డగోలుగా, అసత్యాలను పదేపదే ప్రసారం చేస్తున్నాయి. అలాంటి యూట్యూబ్ ఛానళ్లపైన కఠిన న్యాయపరమైన చర్యలు తీసుకుంటాం. ఈ ఛానళ్లపై పరువు నష్టం ధావాతోపాటు, కుట్రపూరితంగా వ్యవహరిస్తుండడంతో క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తాం’ అని తెలిపారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా తంబ్‌నెయిల్స్ పెడుతూ, వార్తల పేరుతో శుద్ద అబద్ధాలను చూపిస్తున్నాయని మండిపడ్డారు. అధికార పార్టీ ఇచ్చే డబ్బులకు ఆశపడి ఇలాంటి నేరపూరిత, చట్టవిరుద్ధ వీడియోలను, అసత్య వార్తలను ప్రచారం చేస్తున్నాయని వివరించారు. ‘ఇది వ్యక్తిగతంగా నాతోపాటు, మా పార్టీని దెబ్బతీయాలనే కుట్రలో భాగంగానే జరుగుతున్నదని భావిస్నన్నా. ప్రజలను అయోమయానికి గురి చేసి, తప్పుదోవ పట్టించేందుకు చేస్తున్న చర్యగా భావిస్తున్నాం’ అని కేటీఆర్‌ తెలిపారు

గతంలో తమపై అసత్య ప్రచారం, అవాస్తవాలను ప్రసారం చేసిన, ప్రచురించిన మీడియా సంస్థలపైన కూడా న్యాయపరమైన చర్యలు ప్రారంభించినట్లు గుర్తు చేశారు. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ చేస్తున్న దుర్మార్గపూరిత, కుట్రపూరిత చర్యలను చట్టబద్ధంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. అసత్యాలను అదేపనిగా ప్రచారం చేసి, అడ్డమైన తంబునెల్స్‌తో వార్తల పేరిట ప్రచారానికి పాల్పడుతున్నాయని విమర్శించారు. ఆయా ఛానళ్లను నిషేధించాలని యూట్యూట్‌కి అధికారికంగా ఫిర్యాదు కూడా చేస్తామని తెలిపారు.

ఇప్పటికైనా తమ తీరు మార్చుకోవాలని యూట్యూబ్‌ ఛానళ్లకు కేటీఆర్‌ హెచ్చరించారు. కుట్రపూరితంగా వ్యవహారించే యూట్యూబ్ ఛానళ్లు చట్ట ప్రకారం శిక్షకు సిద్దంగా ఉండాలని చెప్పారు. కుట్రపూరిత, అసత్య ప్రచారాలు చేసే యూట్యూబ్‌ ఛానళ్లపై జాగ్రత్తగా వ్యవహరించాలని ప్రజలకు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. అధికారంలో ఉన్న సమయంలో, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా యూట్యూబ్‌ ఛానళ్లు కేటీఆర్‌, బీఆర్‌ఎస్‌ పార్టీని లక్ష్యంగా చేసుకుని అసత్య ప్రచారాలకు పాల్పడుతున్నాయి. గతంలో చూసీచూడకుండా వ్యవహరించిన గులాబీ పార్టీ ఇప్పుడు వాటిపై యుద్ధానికి దిగింది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest