UPDATES  

NEWS

రోడ్డెక్కిన అన్నదాతలు వైన్స్ సిట్టింగ్ రూమ్ లో వ్యక్తి మృతి రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం… సరైన రోడ్డు సౌకర్యం లేకా వర్ష కాలం వస్తే రైతులకు కష్టాలే… ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి: గిరిజన సంక్షేమ సంఘం నాయకులు రాంబాబు,ఎంపీ నాయక్ ఉపాధి హామీ కూలీల ప్రాణం తీసుకున్న అతివేగం లక్ష్మీదేవి పల్లి మండలంలో వడదెబ్బకు వ్యవసాయ కూలీ మహిళా మృతి మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు పసునూరి నరహరి లొంగుబాటు గిరిజనాభివృద్ధి పనులు నాణ్యతతో సకాలంలో పూర్తి చేస్తాం : ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మధుకర్ 10 లక్షలు లంచం డిమాండ్ చేసిన అటవీశాఖ అధికారులు

 ప్రభుత్వ భూముల్లో ఆక్రమణల కూల్చివేత

ఆక్రమణదారులు ఎంతటి వారైనా చర్యలు : తహశీల్దార్ శ్రీనివాస్

 

ధర్మారం: జనవరి10 (తెలంగాణ వాణి విలేఖకరి)

ధర్మారం మండల కేంద్రంలోని ఎస్సారెస్పీ కి చెందిన భూమిలో అక్రమంగా రైస్ మిల్ నిర్మించిన కట్టడాన్ని శనివారం ధర్మారం తహశీల్దార్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కూల్చివేసారు. మండల కేంద్రంలో పెద్దపల్లి హైవేను ఆనుకుని ఉన్న ప్రభుత్వ సర్వేనెంబర్ 297లో మండల కేంద్రానికి చెందిన ఓ వ్యాపారి దాదాపు 3గుంటల మేర భూమిని ఆక్రమించి అందులో రైస్ మిల్ నిర్మించినట్లు తహశీల్దార్ తెలిపారు. 298 సర్వే నెంబర్లో పట్టా ఉండి సర్వే నెంబర్ 297లో ప్రభుత్వ భూమిని ఆక్రమించినందున కూల్చివేయడం జరిగిందని, ప్రభుత్వ భూముల్లో అక్రమ కట్టడాలు చేసిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని చట్టరీత్యా వారిపై చర్యలు తీసుకొని ప్రభుత్వ భూములను కాపాడుతామన్నారు. స్థానిక ఎస్సై ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహించారు. ఎస్సారెస్పీ డీఈ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పెద్దపల్లి ఏడి సర్వే నిర్వహించి ఆక్రమిత భూమిలో రైస్ మిల్ షెడ్ నిర్మించినట్లు తేలడంతో చర్యలు తీసుకున్నట్లు తహశీల్దార్ డి శ్రీనివాస్ తెలిపారు. ఈ కూల్చివేత లో ఆర్ ఐ నవీన్ రావు, మండల సర్వేయర్ శ్రీనివాస్, పంచాయతీ సెక్రటరీ కూడిక్యాల రవి లు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest