UPDATES  

NEWS

రంగులమయమైన ఇండోర్ స్టేడియం: తైక్వాండో విద్యార్థుల హోలీ హంగామా ! నూతన జిల్లా కలెక్టర్ అంకిత్ ఐఏఎస్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన టిఎస్ యు.టి.ఎఫ్ భద్రాది జిల్లా కమిటి  సేవాలాల్ సద్గురు చూపిన మార్గం ఆదర్శనీయం: వైరా ఎమ్మెల్యే మాళోత్ రాందాస్ నాయక్ పిడి బుగ్గ వెంకటేశ్వర్లు పదవీ విరమణ సందర్భంగా సన్మానించిన పి ఆర్ టి యు టి ఎస్ భద్రాద్రి జిల్లా కమిటీ హర్ష టౌన్షిప్‌లో టీఎస్ టిటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బానోత్ రాములు నాయక్ ఆధ్వర్యంలో మేయర్, కార్పొరేటర్‌ లకు ఘన సన్మానం లక్ష్మీదేవిపల్లిలో వీధి దీపాల ఏర్పాట్లు వేగవంతం: సర్పంచ్ తాటి అనిత 56వ డివిజన్‌లో మెగా మెడికల్ క్యాంపు..ఉచిత మందుల పంపిణీ హమాలికాలనీ గ్రామంలో కొత్త కరెంటు పోల్స్‌పై వీధి దీపాల ఏర్పాటు లక్ష్మీదేవిపల్లి బాలమేళాలో రాజాపురం పాఠశాల విద్యార్థుల ప్రతిభ

 భూసమస్య పరిష్కారానికి హామీ ఇచ్చిన వారికే ఓటు

డబ్బులు వద్దు.. అభివృద్ధికే మా ఓటు

లక్ష్మిదేవిపల్లి (తెలంగాణ వాణి) మూడో విడత స్థానిక ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతుంది. ఈ క్రమంలోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, లక్ష్మిదేవిపల్లి మండలంలోని మైలారం గ్రామ ప్రజలు తమకు డబ్బు వద్దని అభివృద్ధి కావాలని డిమాండ్ చేస్తున్నారు. తమకు డబ్బులు, మద్యం వద్దని ఎన్నో ఏళ్లుగా తమ భూ సమస్యకు పరిష్కారం దొరకడంలేదని, తమ పంట పొలాలను ముంపు ప్రాంత భూములుగా పరిగణించి రెవిన్యూ రికార్డుల్లోకి ఎక్కించారని కానీ తమ భూములు కిన్నెరసాని ప్రాజెక్టు చాలా దూరంలో ఉన్నాయన్నారు. తమ ఈ సమస్యకు పరిష్కారం చేస్తామని బాండ్ పేపర్ రాసిచ్చిన వారికే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటేస్తామని గ్రామ యువత ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. మా గ్రామ అభివృద్ధి చేసే వారికి, తమ భూ సమస్య పరిష్కారం చేస్తామని బాండ్ పేపర్ రాసిన వారికే వార్డు మెంబర్, సర్పంచ్ ఓట్లను వేస్తాం అంటూ ప్లకార్డు ల ద్వారా ప్రచారం చేస్తూ గ్రామంలో అందరికి ఆదర్శంగా నిలిచారు.

 

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest