UPDATES  

NEWS

ఇందిరమ్మ మోడల్ కాలనీలో విక్రయాలపై చర్యలు తీసుకోవాలని వినతిపత్రం చిరుత చర్మం.. 17 గోర్లు స్వాధీనం వివరాలు వెల్లడించిన ఎస్పీ రోహిత్ రాజ్ జర్నలిస్టు కాలనీకి మౌలిక సదుపాయాలు త్వరలో కల్పిస్తాం.. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా డాక్టర్ గడల శ్రీనివాసరావు ఒకే వేదికపై రాష్ట్రస్థాయి అవార్డులు అందుకున్న తండ్రీ కన్నా కూతురు పారుల్ అత్యాధునిక ఎక్మో చికిత్సతో 23 ఏళ్ల యువతికి పునర్జన్మ వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డితో కలిసి మొక్క నాటిన విశ్వామిత్ర చౌహాన్ ఖానంపల్లి ఎఫ్ఎన్ టి, భూ సేకరణకు 5.40 కోట్ల నిధులు విడుదల ఘనంగా సర్ధార్ సర్వాయి పాపన్న జయంతి రామయ్యపల్లిలో పంట కుంట పనులు ప్రారంభించిన సర్పంచ్

 ఘనంగా టీజిపిఏ ఆవిర్భావ దినోత్సవం

పెద్దపల్లి (తెలంగాణ వాణి విలేకరి) బుధవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడలిలో తెలంగాణ గురుకులాల పేరెంట్స్ అసోసియేషన్ (టీజిపిఏ) వ్యవస్థాపక అధ్యక్షులు మోత్కూరి యాదయ్య ఆదేశాల మేరకు టీజీపీఏ పెద్దపల్లి జిల్లా ఇన్చార్జి సీలుముల సంజీవ్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కూడలి వద్ద టీజీపీఏ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం సంజీవ్ మాట్లాడుతూ.. తెలంగాణ గురుకుల పేరెంట్స్ అసోసియేషన్ (టీజీపిఏ) 2016లో ఆవిర్భవించి రాష్ట్రవ్యాప్తంగా గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులకు అండగా నిలుస్తూ వారికి అనేక మౌలిక సదుపాయాలు కల్పించడంలో ముందడుగు వేస్తుందని తెలిపారు. పాఠశాలలో విద్యార్థుల సౌకర్యార్థం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న ఏకైక సంఘంగా ముందడుగు వేస్తుందని విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేస్తుందని ఈ సందర్భంగా తెలిపారు. త్వరలో జిల్లాలోని అన్ని సాంఘిక సంక్షేమ పాఠశాలలను సందర్శించి ఆయా పాఠశాల కళాశాలలలో పేరెంట్స్ కమిటీలు వేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో టిజిపిఏ జిల్లా నాయకులు సుంచు మల్లేశం, గుమ్మడి కొమురయ్య ,పులిపాక రవీందర్, లంక దాసరి భాస్కర్, గుండేటి శ్రీనివాస్, రామిండ్ల బాబు, కుమ్మరి తిరుమల్, పరమేశ్వర్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.

Date of Publish : 8 October 2025, 4:15 pm Posted by : TELANGANA VANI

ఘనంగా టీజిపిఏ ఆవిర్భావ దినోత్సవం

పెద్దపల్లి (తెలంగాణ వాణి విలేకరి) బుధవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడలిలో తెలంగాణ గురుకులాల పేరెంట్స్ అసోసియేషన్ (టీజిపిఏ) వ్యవస్థాపక అధ్యక్షులు మోత్కూరి యాదయ్య ఆదేశాల మేరకు టీజీపీఏ పెద్దపల్లి జిల్లా ఇన్చార్జి సీలుముల సంజీవ్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కూడలి వద్ద టీజీపీఏ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం సంజీవ్ మాట్లాడుతూ.. తెలంగాణ గురుకుల పేరెంట్స్ అసోసియేషన్ (టీజీపిఏ) 2016లో ఆవిర్భవించి రాష్ట్రవ్యాప్తంగా గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులకు అండగా నిలుస్తూ వారికి అనేక మౌలిక సదుపాయాలు కల్పించడంలో ముందడుగు వేస్తుందని తెలిపారు. పాఠశాలలో విద్యార్థుల సౌకర్యార్థం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న ఏకైక సంఘంగా ముందడుగు వేస్తుందని విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేస్తుందని ఈ సందర్భంగా తెలిపారు. త్వరలో జిల్లాలోని అన్ని సాంఘిక సంక్షేమ పాఠశాలలను సందర్శించి ఆయా పాఠశాల కళాశాలలలో పేరెంట్స్ కమిటీలు వేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో టిజిపిఏ జిల్లా నాయకులు సుంచు మల్లేశం, గుమ్మడి కొమురయ్య ,పులిపాక రవీందర్, లంక దాసరి భాస్కర్, గుండేటి శ్రీనివాస్, రామిండ్ల బాబు, కుమ్మరి తిరుమల్, పరమేశ్వర్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.

Generating image…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest