వారాహి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆది దంపతులు…
- ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత…
- ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
వేములవాడ,జూన్ 15 (తెలంగాణ వాణి ఆర్ సి ఇంచార్జ్) :
ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత ఉంటుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.ఆదివారం రోజున వేములవాడ పట్టణంలోని ఆయన నివాసంలో వారాహి పూజ,హోమం నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత ఉంటుందని,వారాహి అమ్మవార్ల దీవెన్లతో అందరు సుఖసంతోషాలతో ఉండాలని అన్నారు.సకాలంలో వర్షాలు పడి ప్రజలంతా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని వేడుకున్నారు.ఈ కార్యక్రమంలో ఆయన కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Post Views: 19