మహిళలకు మెరుగైన ఆదాయం అందిస్తోన్న రొయ్యలు,సీ ఫుడ్ ప్రాసెసింగ్

ఆంధ్రప్రదేశ్ లో పెరుగుతున్న రొయ్యల పెంపకం,సీ ఫుడ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలతో (Shrimp and seafood processing)మహిళలకు ఉపాధి అవకాశాలు బాగా పెరిగాయి. ఏపీలో రొయ్యల ప్రాసెసింగ్.. మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యం అందించడం ద్వారా వారి సాధికారతకు ఉత్ప్రేరకంగా పనిచేసింది. గడిచిన 10 సంవత్సరాలలో..ఆంధ్రప్రదేశ్లో రొయ్యల ప్రాసెసింగ్ ఫెసిలిటీస్ లేదా ఫ్యాక్టరీలు 20 నుండి 90కి పైగా పెరిగాయి. ప్రతి ప్రాసెసింగ్ ఫెసిలిటీలో పెట్టుబడి సగటున 5 మిలియన్ డాలర్ల గా ఉండగా.. ప్రాసెసింగ్ రంగంలో మొత్తం పెట్టుబడి […]
ఇద్దరిని చంపేసిన ఎలుగుబంటి.. ఆ ఊరిలో భయం భయం..!

శ్రీకాకుళం జిల్లాలో విషాదం నెలకొంది. వజ్రపుకొత్తూరు మండలం అనకాపల్లి గ్రామంలో ఎలుగుబంటి దాడిలో ఇద్దరు చనిపోయారు. అనకాపల్లి గ్రామ సమీపంలో ముగ్గురు వ్యక్తులపై ఎలుగుబంటి దాడి చేసింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వ్యక్తిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్లి..పరిశీలించారు. ఎలుగుబంటి దాడి గురించి సమాచారం అందుకున్న […]
AP Govt: హైదరాబాద్లో ఆఫీసులకు ఏపీ సర్కార్ అద్దె చెల్లించాలా?

ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంది. మే 13న అసెంబ్లీ లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. ఆ తర్వాత నెల జూన్ 4వ తేదీన అక్కడ జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతాయి. దీంతో ఏపీలో ఎవరు గెలుస్తారు? ఏ పార్టీ అధికారం చేపడుతుంది? మరోసారి జగన్ వస్తారా? లేదంటే ఈ సారి చంద్రబాబుకు జనం అవకాశం ఇస్తారా? ఇలా ఏపీలో ఏం జరుగబోతుందో అనే అంశం ఆసక్తిగా మారింది. అయితే రాష్ట్ర విభజన తర్వాత… తెలంగాణలో ఉన్న […]
బాలకృష్ణకు ఆ స్వామిజీ ఎఫెక్ట్.. హిందూపురం నుంచి ఇండిపెండెంట్ గా పోటీ

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాజకీయాలు రోజు రోజుకు హాట్ హాట్గా మారిపోతున్నాయి. టీడీపీ(TDP), బీజేపీ(BJP), జనసేన (Janasena)మూడు ఒకవైపు.. అధికార వైసీపీ(YCP) ఒక్కటే ఒకవైపు పోటీ చేస్తూ ఈసారి ఎన్నికల్లో తమ బలాబలాలు నిరూపించుకోవాలని ప్రయత్నిస్తున్నాయి అన్నీ పార్టీలు. అయితే కూటమి పార్టీల్లో సీట్ల కేటాయింపు మూడు పార్టీల నేతలకు తల నొప్పిగా మారింది. చివరకు టీడీపీ కీలక నేత, సినీ నటుడు హిందూపురం సిట్టింగ్ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై కూడా ఈ ఎఫెక్ట్ పడింది. సీట్ల కేటాయింపులో భాగంగా […]
అత్యంత ఖరీదైన ఆవు ఇదే..!ఈ నెల్లూరు జాతి ఆవు ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!

ఆవులు, గుర్రాలు తదితర జంతువులకు సంబంధించి తరచుగా వేలం పాటలు జరుగుతుంటాయి. వీటిలో కొన్ని జంతువులు కోట్ల రూపాయలకు అమ్ముడు అవుతూ రికార్డు సృష్టిస్తుంటాయి. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జాతికి చెందిన ఒక ఆవు కనీవినీ ఎరుగని రీతిలో కళ్లు చెదిరే ధర పలికింది. బ్రెజిల్ (Brazil)లో జరిగిన ఒక వేలంలో ఏకంగా 40 కోట్ల రూపాయలకు అమ్ముడైంది. ఈ ఆవు పేరు వయాటినా-19 ఎఫ్ఐవీ మారా ఇమోవీస్. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఆవుగా […]
టీడీపీలో చేరిన టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ – కండువా కప్పి ఆహ్వానించిన నారా లోకేశ్

టాలీవుడ్ ప్రముఖ నటుడు నిఖిల్ సిద్దార్ధ్ (Nikhil Siddarth) శుక్రవారం టీడీపీలో చేరారు. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆయనకు తెలుగుదేశం కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కాగా, టీడీపీ చీరాల అభ్యర్థి కొండయ్య యాదవ్ అల్లుడు నిఖిల్. ఈ ఎన్నికల్లో పార్టీ తరఫున నిఖిల్ ప్రచారం నిర్వహించనున్నారు. కాగా, నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే హీరో నిఖిల్.. తరచూ సామాజిక బాధ్యతతో కొన్ని పోస్టులు పెడుతుంటారు. ఆయన […]
గన్నవరంలో TDP గెలిచే సంప్రదాయం కొనసాగేనా? జనం జగన్కు జై కొడతారా?

: కృష్ణాజిల్లాలోని మచిలీపట్నం(Machilipatnam) లోక్సభ పరిధిలో ఉన్న గన్నవరం(Gannavaram) అసెంబ్లీ నియోజకవర్గం ఒకప్పుడు వామపక్షాలకు కంచుకోట. సీపీఎం వ్యవస్థాపకుల్లో ఒకరైన కామ్రెడ్ పుచ్చలపల్లి సుందరయ్య ఇక్కడ నుంచి మూడుసార్లు విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత కాంగ్రెస్ కొంత ప్రాభల్యం చూపినా…ప్రస్తుతం ఈ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి అడ్డగా మారింది. ఆ పార్టీ నుంచి గెలుపొందిన వల్లభనేని వంశీ(Vallabaneni Vamsi) ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉండగా…ఆయన వైసీపీలో చేరారు.. కామ్రెడ్ల కంచుకోట తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు అందరూ […]
ధరణి పోర్టల్పై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు.. రద్దు చేయనున్నారా లేక?

భూ రికార్డులకు సంబంధించిన ధరణి పోర్టల్పై ముఖ్యమంత్రి సమీక్ష చేశారు. ఈ సందర్భంగా ధరణి పెండింగ్ దరఖాస్తులకు వెంటనే పరిష్కారం చూపాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మార్చి మొదటి వారంలోనే ఏర్పాట్లు చేయాలని, మెరుగైన రెవిన్యూ రికార్డుల నిర్వహణకు చట్ట సవరణ చేయాలని పేర్కొన్నారు. ధరణి పోర్టల్ ఏజెన్సీపై సమగ్ర విచారణకు ఆదేశించారు. అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో ధరణి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని రెవెన్యూ అధికారులకు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న 2.45 […]
త్వరలో రాష్ట్రంలో రైతు కమిషన్, విద్యా కమిషన్: సీఎం రేవంత్ రెడ్డి

త్వరలోనే రాష్ట్రంలో రైతు కమిషన్, ఎడ్యుకేషన్ కమిషన్ ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. మన విద్యా విధానం ఎలా ఉండాలో ఎడ్యుకేషన్ కమిషన్ నిర్ణయిస్తుందని అన్నారు. రైతులు, కౌలు రైతుల సాధక బాధకాలు, వాళ్ల సంక్షేమం, వ్యవసాయ రంగంలో సంస్కరణలకు సంబంధించి రైతు కమిషన్ తగిన సలహాలు సూచనలు అందిస్తుందని అన్నారు. శుక్రవారం సచివాలయంలో వివిధ సామాజిక సంస్థలు, పౌర సమాజ ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇష్టాగోష్టి ముచ్చటించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి […]
తెలంగాణలో అత్యధికంగా కల్లు విక్రయాలు

తెలంగాణలో అత్యధికంగా కల్లు విక్రయాలు జరుగుతాయి. కల్లు అనేది పండుగల్లో సాకగా పరిగణిస్తారు. అమ్మవారి పూజల్లో ప్రధానంగా ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో ఇంటిల్లిపాది కల్లు తాగే అలవాటు ఉంటుంది. అయితే అది చెట్టు కల్లు మాత్రమే. అలాంటి కల్లుకు మరింత ప్రాధాన్యమిచ్చేలా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. కల్లు వృత్తికి గౌరవం తీసుకొస్తూ కొత్తగా ‘కల్లు బార్లు’ ఏర్పాటుచేయాలని ఆలోచిస్తున్నట్లు వెల్లడించారు. మహబూబ్నగర్లో ఆదివారంలో ఏర్పాటుచేసిన గౌడ సంఘం […]