UPDATES  

NEWS

వివేకానంద పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్ ఈనెల 18న తెలంగాణ రాష్ట్ర బంద్ ని విజయవంతం చేద్దాం కటికనపల్లి ట్రాక్టర్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షునిగా సాయిలు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ విద్యార్థిని పరామర్శించిన టిజిపిఏ రాష్ట్ర ఉపాధ్యక్షులు దార మధు టేకులపల్లి టీఎస్‌యుటిఎఫ్‌ మండల ప్రధాన కార్యదర్శి డి.హరి నాయనమ్మ దశదిన కార్యక్రమానికి హాజరై శ్రద్ధాంజలి ఘటించిన టిఎస్ యుటిఎఫ్ నాయకులు  పెద్దిరెడ్డి రియాన్ చక్రవర్తి ని ఆశీర్వదించిన రాకేష్ దత్త విషాదం నింపిన పోలియో చుక్కలు పెద్దచింతకుంట గ్రామంలో ఇంటింటికి సీఐటీయూ బైండ్ల కళాకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా బైండ్ల ప్రతాప్ తడ్కల్ లో పల్స్ పోలియో కార్యాలయం

 భారీ వర్షాల నేపథ్యంలో సిబ్బందికి సూచనలు…

 

నగరంలో పర్యటించిన మున్సిపల్ కమిషనర్

నిజామాబాద్ ఆగస్టు 28:(తెలంగాణ వాణి ప్రతినిధి)

నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ గురువారం నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నగరంలోని లోతట్టు ప్రాంతాలను పరిశీలించి అధికారులకు మునిసిపల్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. నగరంలోని రైల్వే అండర్ బ్రిడ్జి , గౌతమ్ నగర్ బైపాస్, జునైరా హోటల్, బోధన్ రోడ్, న్యూ బ్రిడ్జి సమీపంలోని సాగర్ హిల్స్ వివిధ ప్రాంతాలను ఆయన పరిశీలించారు. ఆకస్మాత్తుగా కురిసే భారీ వర్షాల వలన ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా పూర్తి జాగ్రత్త తీసుకోవాలని మున్సిపల్ సిబ్బంది ఎల్లప్పుడు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. కమిషనర్ వెంట ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్, సానిటరీ ఇన్స్పెక్టర్లు ఇతర మున్సిపల్ సిబ్బంది తదితరులు ఉన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest