ప్రకృతి హరిత దీక్షుడు,ప్రకృతి ప్రేమికుడు చిరంజీవి మహమ్మద్ ఆఫాన్ జైదీ నీ అభినందించిన జమాతే ఇస్లామి హింద్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఖలీద్ బషీర్ జఫర్.శుక్రవారం జమాతే ఇస్లామి హింద్ కార్యకర్తల శిక్షణ కార్యక్రమం ఎంఐ ఫంక్షన్ హాల్ లక్ష్మీదేవి పల్లి భద్రాద్రి కొత్తగూడెంలో నిర్వహించారు.ముఖ్యఅతిథిగా విచ్చేసిన డాక్టర్ ఖలీద్ బషీర్ జమాతే ఇస్లామి హింద్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుల కి మరియు జఫర్,నయీముద్దీన్ ఉపాధ్యక్షులకి, షరీఫ్,జిల్లా అధ్యక్షులు తాజుద్దీన్ ఫారుక్,జహంగీర్ షరీఫ్ కొత్తగూడెం పట్టణ అధ్యక్షులు, మహిళా అధ్యక్షురాళ్ళు షహనాజ్,సపురా,యాజస్ ఫాతిమా తో పాటు ప్రముఖులకి కార్యకర్తలకు 50 రకాల పచ్చని మొక్కలు అందించి శుభాకాంక్షలు తెలిపాడు.తన రెండవ ఏటా నుంచి మొక్కలు నాటుతూ.. వివిధ కార్యక్రమాలలో మొక్కలని బహుమతిగా ఇస్తూ ప్రకృతి సేవలు చేస్తున్న ప్రకృతి హరిత దీక్షుడు ప్రకృతి ప్రేమికుడు చిరంజీవి మహమ్మద్ ఆఫాన్ జైదీ నీ మరియు షేక్ రిషాన్ గౌస్ భాయ్ మనవడును డాక్టర్ ఖలీద్ బషీర్ అభినందిస్తూ ప్రతి ఒక చిన్నారీ కూడా మహమ్మద్ ఆఫాన్ జైది నీ ఆదర్శంగా తీసుకొని, ప్రకృతి సేవలు చేయాలని అతిథులు అన్నారు.మొక్కలే మానవాళికి జీవనాధారం అని..ఈ చిన్నారూలని ప్రకృతి సేవలకు చేయుటకు ప్రోత్సాహాన్ని ఇస్తున్న ప్రకృతి హరిత దీక్షా వ్యవస్థాపక అధ్యక్షుడు మొక్కల కె ఎన్ రాజశేఖర్ ప్రకృతి ప్రేమికుడు మరియు జైదీ పేరెంట్స్ అమన్,రేష్మ మరియు నానమ్మ తాతయ్య పర్వీన్ ముస్తఫా లను ప్రముఖులు కార్యకర్తలు అభినందించారు.
