UPDATES  

NEWS

దీక్షిత ధరణి అసోసియేషన్ మేనేజర్ ప్రకృతి ప్రేమికుడు శ్రీనివాస్ ను అభినందించిన భద్రాద్రి జిల్లా ప్రకృతి ప్రేమికుడు బాలు నాయక్. వివేకానంద యూత్ ఆధ్వర్యంలో బద్ది పోచమ్మ అమ్మవారికి బోనాలు కాంపెల్లి కనకేష్ అద్వర్యంలో ఎమ్మెల్సి కవిత ను మర్యాద పూర్వకంగా కలిసిన యువజన నాయకులు బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు,పాల్వంచ కో-ఆపరేటివ్ సొసైటీ ఉపాధ్యక్షులు కాంపెల్లి కనకేష్ పటేల్ నివాసానికి విచ్చేసిన బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు గజమాలతో ఘన స్వాగతం పలికిన బీఆర్ఎస్ శ్రేణులు ప్రజలు యువతి యువకులు సీత్లా పండగను ఘనంగా జరుపుకున్నారు ఘనంగా బంజారాల సీత్లా పండగ వికాస తరంగిణి కొత్తగూడెం శాఖ ఆధ్వర్యంలో రేగళ్లలో జూలై 4న ఉచిత క్యాన్సర్ క్యాంప్ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా వైద్య సిబ్బంది సేవలు భేష్ కేంద్ర హోంశాఖ మంత్రి పర్యటన సక్సెస్ కు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు

 జీనియస్ బుక్ ఆఫ్ రికార్డు గ్రహీత విశ్వామిత్ర చౌహాన్ ను సన్మానించిన జిల్లా జడ్జి వసంత్ పాటిల్ 

పర్యావరణ పరిరక్షణ కొరకు తన వంతు బాధ్యతగా కృషి చేస్తూ వాక్ ఫర్ ట్రీ కాన్సెప్ట్ తో గత మూడు సంవత్సరాలుగా క్రమం తప్పకుండా ప్రతిరోజు మొక్కలు నాటుతున్న చిరంజీవి మూడు విశ్వామిత్ర చౌహాన్ ను జిల్లా జడ్జి వసంత్ పాటిల్ ఘనంగా సన్మానించారు.ఇటీవల జీనియస్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కించుకున్న విషయం తెలుసుకున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి వసంత్ పాటిల్ ప్రత్యేకంగా విశ్వామిత్ర చౌహాన్ ను పిలిపించి శాలువతో సన్మానించారు. గతంలో చాలాసార్లు చిన్నారి తనతో మొక్కలు నాటారని గుర్తు చేసుకున్నారు.ఈ సందర్భంగా చిన్నారి విశ్వామిత్ర చౌహాన్ జడ్జి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం జడ్జి చిన్నారికి గ్రీన్ పెన్ను ఇచ్చి ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆశీర్వదించారు.చిరంజీవి విశ్వామిత్ర చౌహాన్ కు ఉన్నట్టే పర్యావరణం మీద ప్రతి ఒక్కరికి శ్రద్ధ ఉండాలని బాధ్యతగా మొక్కలు నాటాలని జడ్జి అన్నారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest