ఆడపిల్లల పెళ్లికి ₹5,016 ఆర్థిక సాయం
చందుర్తి, ఫిబ్రవరి 20 (తెలంగాణ వాణి):
చందుర్తి మండలం బండపల్లి గ్రామ సర్పంచ్ కటకం మల్లేశం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. గ్రామంలో ఆడపిల్లల పెళ్లి జరిగితే ₹5,016 ఆర్థిక సహాయం అందిస్తానని ప్రకటించిన ఆయన, ఆ మాట ప్రకారం మొదటి విడతగా రెండు కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేశారు.
గడ్డం మమత – మనోహర్ రెడ్డి దంపతుల కుమార్తె అద్విక రెడ్డి మరియు దర్శనాల సత్తయ్య – మాధవి దంపతుల కుమార్తె శ్వేత వివాహాలు శనివారం జరగనున్న నేపథ్యంలో, శుక్రవారం రాత్రి సర్పంచ్ మల్లేశం స్వయంగా రూ.5,016 చొప్పున సహాయం అందించారు.
ఈ కార్యక్రమంలో మహమ్అజీమ్, అంబాల దాసు, లక్ష్మారెడ్డి, గసికంటి రాజు, న్యాత సుమన్, అన్వర్, రాజిరెడ్డి, శేఖర్, మల్లేశం, తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గ్రామ అభివృద్ధి, సామాజిక బాధ్యతల పట్ల కట్టుబాటు చూపిన సర్పంచ్ చర్యను గ్రామస్తులు అభినందించారు.



