UPDATES  

 ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న బండపల్లి సర్పంచ్

ఆడపిల్లల పెళ్లికి ₹5,016 ఆర్థిక సాయం

చందుర్తి, ఫిబ్రవరి 20 (తెలంగాణ వాణి):

చందుర్తి మండలం బండపల్లి గ్రామ సర్పంచ్ కటకం మల్లేశం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. గ్రామంలో ఆడపిల్లల పెళ్లి జరిగితే ₹5,016 ఆర్థిక సహాయం అందిస్తానని ప్రకటించిన ఆయన, ఆ మాట ప్రకారం మొదటి విడతగా రెండు కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేశారు.

గడ్డం మమత – మనోహర్ రెడ్డి దంపతుల కుమార్తె అద్విక రెడ్డి మరియు దర్శనాల సత్తయ్య – మాధవి దంపతుల కుమార్తె శ్వేత వివాహాలు శనివారం జరగనున్న నేపథ్యంలో, శుక్రవారం రాత్రి సర్పంచ్ మల్లేశం స్వయంగా రూ.5,016 చొప్పున సహాయం అందించారు.

ఈ కార్యక్రమంలో మహమ్అజీమ్, అంబాల దాసు, లక్ష్మారెడ్డి, గసికంటి రాజు, న్యాత సుమన్, అన్వర్, రాజిరెడ్డి, శేఖర్, మల్లేశం, తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

గ్రామ అభివృద్ధి, సామాజిక బాధ్యతల పట్ల కట్టుబాటు చూపిన సర్పంచ్ చర్యను గ్రామస్తులు అభినందించారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest