UPDATES  

 ఇశ్రాయేలు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వీల్ చైర్ పంపిణీ

దివ్యాంగులకు చేయూతనందించడం అభినందనీయం : తల్లాడ కార్యదర్శి శ్రీహరికృష్ణ

తల్లాడ, ఆగష్టు 25 (తెలంగాణ వాణి) : సమాజంలో వెనుకబడిన దివ్యాంగులకు స్వచ్ఛంద సేవా సంస్థలు చేయూతనందించడం అభినందనీయమని తల్లాడ గ్రామపంచాయతీ కార్యదర్శి శ్రీ హరికృష్ణ అన్నారు. మంగళవారం ఇజ్రాయిల్ ఛారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు ఖమ్మంపాటి ఇశ్రాయేలు ఆధ్వర్యంలో తల్లాడకు చెందిన బత్తుల నాగేంద్రమ్మ అనే దివ్యాంగురాలుకి వీల్ చైర్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన సెక్రటరీ మాట్లాడుతూ మానవసేవే మాధవసేవ అన్నారు. అనంతరం ఇశ్రాయేలు మాట్లాడుతూ తమ సంస్థ ఆధ్వర్యంలో దివ్యాంగురాలికి సహాయం చేయటం సంతోషంగా ఉందన్నారు. తమ సంస్థ ద్వారా అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిసి వెంకటేశ్వరరావు, నారపోగు ప్రసాదు, దారెల్లి బాబు, చల్లా దుర్గాప్రసాద్, రామకృష్ణ తదితరులు ఉన్నారు.

Date of Publish : 26 August 2026, 8:19 am Posted by : TELANGANA VANI

ఇశ్రాయేలు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వీల్ చైర్ పంపిణీ

దివ్యాంగులకు చేయూతనందించడం అభినందనీయం : తల్లాడ కార్యదర్శి శ్రీహరికృష్ణ

తల్లాడ, ఆగష్టు 25 (తెలంగాణ వాణి) : సమాజంలో వెనుకబడిన దివ్యాంగులకు స్వచ్ఛంద సేవా సంస్థలు చేయూతనందించడం అభినందనీయమని తల్లాడ గ్రామపంచాయతీ కార్యదర్శి శ్రీ హరికృష్ణ అన్నారు. మంగళవారం ఇజ్రాయిల్ ఛారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు ఖమ్మంపాటి ఇశ్రాయేలు ఆధ్వర్యంలో తల్లాడకు చెందిన బత్తుల నాగేంద్రమ్మ అనే దివ్యాంగురాలుకి వీల్ చైర్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన సెక్రటరీ మాట్లాడుతూ మానవసేవే మాధవసేవ అన్నారు. అనంతరం ఇశ్రాయేలు మాట్లాడుతూ తమ సంస్థ ఆధ్వర్యంలో దివ్యాంగురాలికి సహాయం చేయటం సంతోషంగా ఉందన్నారు. తమ సంస్థ ద్వారా అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిసి వెంకటేశ్వరరావు, నారపోగు ప్రసాదు, దారెల్లి బాబు, చల్లా దుర్గాప్రసాద్, రామకృష్ణ తదితరులు ఉన్నారు.

Generating image…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest