UPDATES  

NEWS

 సర్పంచ్ జర్పల దేవి ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం

లక్ష్మీదేవిపల్లి మండలం అశోక్ నగర్ కాలనీ పంచాయతీలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాన్ని సిపిఐ సర్పంచ్ జర్పల దేవి, పంచాయతీ కార్యదర్శి చింతల ప్రవీణ్ కుమార్ ప్రారంభించారు.ఈ సందర్భంగా లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రభుత్వం అమలు చేస్తున్న గృహ పథకాలతో పేద కుటుంబాల సొంతింటి కల నెరవేరుతోందని తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ చలమల సంధ్య, వార్డు సభ్యులు, లబ్ధిదారులు మిట్టపల్లి శిరీష, ధారావత్ స్రవంతి, ఇందిరమ్మ ఇళ్ల కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest