UPDATES  

NEWS

జర్నలిస్టు కాలనీకి మౌలిక సదుపాయాలు త్వరలో కల్పిస్తాం.. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా డాక్టర్ గడల శ్రీనివాసరావు ఒకే వేదికపై రాష్ట్రస్థాయి అవార్డులు అందుకున్న తండ్రీ కన్నా కూతురు పారుల్ అత్యాధునిక ఎక్మో చికిత్సతో 23 ఏళ్ల యువతికి పునర్జన్మ వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డితో కలిసి మొక్క నాటిన విశ్వామిత్ర చౌహాన్ ఖానంపల్లి ఎఫ్ఎన్ టి, భూ సేకరణకు 5.40 కోట్ల నిధులు విడుదల ఘనంగా సర్ధార్ సర్వాయి పాపన్న జయంతి రామయ్యపల్లిలో పంట కుంట పనులు ప్రారంభించిన సర్పంచ్ జర్నలిస్టుల హక్కుల సాధనకు టీయూడబ్ల్యూజే నిరంతర కృషి ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

 విషాదం నింపిన పోలియో చుక్కలు

పోలియో చుక్కలు వేసిన అరగంటలో 3 నెలల బాలుడు మృతి

సంగారెడ్డి / కంగ్టి (తెలంగాణ వాణి ప్రతినిధి) మండల పరిధిలోని భీమ్రా గ్రామానికి చెందిన నడిమి దొడ్డి స్వర్ణలత ఉమాకాంత్ దంపతుల 3నెలల కుమారుడు పోలియో వ్యాక్సిన్ చుక్కలను తీసుకున్న కొద్దిసేపటికే మరణించాడని తల్లితండ్రులు కన్నీటి పర్వతమయ్యారు. బాబు అస్వస్థతకు గురై వాంతులు చేయడం, ఏడవడం ఆగకపోవడం, కళ్ళు తెల్లబారడం, చేతులు-కాళ్లు విలవిలలాడడంతో ఆసుపత్రికి తీసుకెళ్లగా బాలుడు మృతి చెందినట్టు డాక్టర్ ధ్రువీకరించారని బాలుడికి ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవన్నారు. బాలుడి మృతి విషయం తెలుసుకున్న స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ బి నాగమణి, బాలుడి తల్లిదండ్రులతో మాట్లాడి జరిగిన సంఘటన వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ బి నాగమణిని వివరణ కోరగా పోలియో చుక్కల మందుతో బాలుడి మరణం సంభవించలేదని అన్నారు.ఒక వ్యాక్సిన్ లో 18 మంది చిన్నారులకు చుక్కల మందు వేయడం జరుగుతుందన్నారు. బాలుడి తల్లిదండ్రులు గ్రామస్తులు అనుమానించడంతో 3 నెలల బాలుడిని నారాయణఖేడ్ ఏరియా ఆసుపత్రికి పోస్టుమార్టం నిర్వహించడానికి 108 వాహనంలో బాలుడి మృతదేహాన్ని తరలించారు.

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9703247143
telanganavanidaily.com

విషాదం నింపిన పోలియో చుక్కలు

12 Oct 2025, 7:41 pm TELANGANA VANI

పోలియో చుక్కలు వేసిన అరగంటలో 3 నెలల బాలుడు మృతి

సంగారెడ్డి / కంగ్టి (తెలంగాణ వాణి ప్రతినిధి) మండల పరిధిలోని భీమ్రా గ్రామానికి చెందిన నడిమి దొడ్డి స్వర్ణలత ఉమాకాంత్ దంపతుల 3నెలల కుమారుడు పోలియో వ్యాక్సిన్ చుక్కలను తీసుకున్న కొద్దిసేపటికే మరణించాడని తల్లితండ్రులు కన్నీటి పర్వతమయ్యారు. బాబు అస్వస్థతకు గురై వాంతులు చేయడం, ఏడవడం ఆగకపోవడం, కళ్ళు తెల్లబారడం, చేతులు-కాళ్లు విలవిలలాడడంతో ఆసుపత్రికి తీసుకెళ్లగా బాలుడు మృతి చెందినట్టు డాక్టర్ ధ్రువీకరించారని బాలుడికి ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవన్నారు. బాలుడి మృతి విషయం తెలుసుకున్న స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ బి నాగమణి, బాలుడి తల్లిదండ్రులతో మాట్లాడి జరిగిన సంఘటన వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ బి నాగమణిని వివరణ కోరగా పోలియో చుక్కల మందుతో బాలుడి మరణం సంభవించలేదని అన్నారు.ఒక వ్యాక్సిన్ లో 18 మంది చిన్నారులకు చుక్కల మందు వేయడం జరుగుతుందన్నారు. బాలుడి తల్లిదండ్రులు గ్రామస్తులు అనుమానించడంతో 3 నెలల బాలుడిని నారాయణఖేడ్ ఏరియా ఆసుపత్రికి పోస్టుమార్టం నిర్వహించడానికి 108 వాహనంలో బాలుడి మృతదేహాన్ని తరలించారు.

Generating image…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest