UPDATES  

NEWS

అంగన్‌వాడీల్లో ఒంటిపూట బడి అమలు పట్ల హర్షం వ్యక్తం చేసిన విద్యా పరిరక్షణ కమిటీ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు హరిలాల్ నాయక్  సృజన టెక్ ఫెస్ట్ 2025–26 విజేతలకు ఘన సన్మానం:ప్రిన్సిపాల్ బండి శ్రీనివాస్, ఖబడ్దార్ బిఆర్ఎస్ నాయకుల్లారా రామ భక్త శ్రీ శ్రీ శ్రీ లాలు దాస్ అందరికి ఆదర్శం రక్తదానానికి యువత ముందుకు రావాలి: డీఎస్పీ ఆదినారాయణ ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులు డాక్టర్ వరుణ్ కుమార్‌ కు మొక్కలు అందజేసిన వైభవంగా సర్వారం ఒడ్డుగూడెం తండాలో కోదండ రామాలయం విగ్రహ ప్రతిష్ట టీఎస్ యుటిఎఫ్ భద్రాచలం మండల కమిటీ నుంచి ఎంఈఓకు ప్రాతినిధ్యం కొత్తగూడెంలో నయా ల్యాబ్‌ దందా ? అసెంబ్లీ ముట్టడికి పిలుపు.. LHPS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, న్యాయవాది రమేష్ నాయక్ బాణోత్‌ ముందస్తు అరెస్ట్

 సృజన టెక్ ఫెస్ట్ 2025–26 విజేతలకు ఘన సన్మానం:ప్రిన్సిపాల్ బండి శ్రీనివాస్,

GPW సికింద్రాబాద్ మరియు JNGPT రామంతాపూర్‌లో నిర్వహించిన సృజన టెక్ ఫెస్ట్ 2025–26 రాష్ట్రస్థాయి పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్థులను ప్రభుత్వ పాలిటెక్నిక్, కొత్తగూడెంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ బండి శ్రీనివాస్,విభాగాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొని విజేతలతో పాటు వారి తల్లిదండ్రులను సన్మానించి అభినందించారు.సివిల్ ఇంజినీరింగ్ విభాగం “స్మార్ట్ అండ్ సస్టైనబుల్ ఇన్నోవేషన్ ఇన్ సివిల్ ఇంజినీరింగ్” అంశంపై మౌలిక వసతుల సమస్యలకు స్మార్ట్, స్థిరమైన పరిష్కారాలను ప్రదర్శించగా, మెకానికల్ ఇంజినీరింగ్ విభాగం “స్మార్ట్ అండ్ సస్టైనబుల్ క్రాప్ మేనేజ్‌మెంట్” అంశంపై వ్యవసాయ రంగానికి సంబంధించిన వినూత్న ఆలోచనలను ఆవిష్కరించింది.ఈ విజయానికి మార్గదర్శకులుగా నిలిచిన సివిల్ ఇంజినీరింగ్ విభాగపు లెక్చరర్ జె. హరికృష్ణ, మెకానికల్ ఇంజినీరింగ్ విభాగపు సీనియర్ లెక్చరర్ కె.టి. రఘురాం సేవలను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ బండి శ్రీనివాస్ మాట్లాడుతూ, ఇలాంటి వేదికలు విద్యార్థుల సాంకేతిక నైపుణ్యాల పెంపొందనకు దోహదపడతాయని తెలిపారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest