UPDATES  

NEWS

ప్రగతి ప్రణాళికలో భాగంగా సర్పంచ్‌ల శిక్షణలో పాల్గొన్న సర్పంచ్ తాటి అనిత ప్రాథమిక పాఠశాల రాజాపురంలో అభివృద్ధి పనులు సంఘమే శరణ్యం.. సంఘమే శాశ్వతం పాఠశాలల సమీపంలోని చిరుతిండి దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్ కాలువల శుభ్రతతో ప్రజారోగ్యం – సర్పంచ్ జర్పుల దేవి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టి.మధుకర్ సుడిగాలి పర్యటన కవిత దీక్షకు మద్దతు తెలిపిన బిరుదురాజు వెంకటేశ్వర రాజు రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డిని సత్కరించిన ఎమ్మెల్యే కూనంనేని కేజీబీవీ,యుఆర్ఎస్,సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి:టీఎస్ యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి డిఎస్.నాగేశ్వరరావు చంద్రు ఫౌండేషన్ ఆధ్వర్యంలో పది విద్యార్థులకు పరీక్ష సామాగ్రి పంపిణీ

 సంఘమే శరణ్యం.. సంఘమే శాశ్వతం

మాజీల వ్యవహారం నవ్విపోదురు గాక మాకేంటి అన్నట్టుగా ఉంది. సంఘానికి వెన్నుపోటు పొడిచి, తీవ్ర ఆరోపణలు ఎదుర్కొని సంఘం నుండి బహిష్కరణకు గురైన వారు ఇప్పుడు మరో సంఘంలో చేరి మాపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు. మీపై ఉన్న ఆరోపణలకు సమాధానాలు చెప్పకుండా వాటిని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. జిల్లాలో ఉపాధ్యాయుల నుండి వసూలు చేసిన బిల్డింగ్ ఫండ్ మొత్తం ఎంత, మండలాల వారీగా ఎంత వసూలు చేశారో శ్వేతపత్రం విడుదల చేసే ధైర్యం ఉందా? ఉపాధ్యాయులకు ప్లాట్లు ఇప్పిస్తామని ఒక్కొక్కరి దగ్గర వసూలు చేసిన 1500 రూపాయలు ప్రస్తుతం ఎవరి ఖాతాలో ఉన్నాయో వెల్లడించగలరా? అలాగే మీ పదవీకాలంలో వసూలు చేసిన సభ్యత్వ రుసుము, జనరల్ ఫండ్ వివరాలు మరియు బిల్డింగ్ ఫండ్ పేరుతో వివిధ రాజకీయ పార్టీల నుండి వసూలు చేసిన చందాల వివరాలపై శ్వేతపత్రం విడుదల చేసి మీ నిజాయితీని నిరూపించుకోండి. ఒక అబద్ధాన్ని పదేపదే చెప్పితే అదే నిజమవుతుందని భావించడం మానుకోవాలి. ఉపాధ్యాయులు సంఘంపై అభిమానంతో ఇచ్చిన ప్రతి రూపాయి సంఘానికి చెందేలా చేస్తామని, ప్రతి పైసా వసూలు చేస్తామని స్పష్టం చేస్తున్నాం.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest