ధర్మారం (తెలంగాణ వాణి ప్రతినిధి): మండలంలోని పత్తిపాక ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ప్రభుత్వం సరఫరా చేసిన షూలను గ్రామ సర్పంచ్ మందాల శ్రావణి-హరీష్ శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు.
కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు నూతి మల్లన్న, ఉపాధ్యాయులు గండ్రాతి శ్రీలత, నాగెల్లి సౌజన్య, ఉప సర్పంచ్ పూసాల మల్లేశం, వార్డు సభ్యులు ఎదుల్ల అంజయ్య, కాంపెల్లి కొమురయ్య, జిల్లాల కాంతారాజు, వెల్మదాసరి అంజమ్మ-నర్సయ్య, కర్నె నరేష్ తదితరులు పాల్గొన్నారు.
Post Views: 14




