లక్ష్మీదేవి పల్లి మండలంలోని వేపల్లగడ్డ గ్రామపంచాయతీ పరిధి హాలియా తండలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బానోత్ శాంతి శుక్రవారం వడదెబ్బకు గురై మృతి చెందింది. నూనావత్ భీమా అనే రైతు పొలంలో మొక్కజొన్న తూర్పలు కూలీ చేస్తుండగా అకస్మాత్తుగా కుప్పకూలి మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు.ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున మధ్యాహ్న వేళల్లో బయటకు వెళ్లవద్దని వైద్యులు సూచిస్తున్నారు.
Post Views: 10


