హైదరాబాద్ (తెలంగాణ వాణి స్టేట్ కోఆర్డినేటర్)
వరంగల్ జిల్లా స్థాయి తైక్వాండో సీఎం కప్ లో విజయం సాధించి హైదరాబాదులో ఎస్ జి ఎఫ్ ఐ (స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ చాటి గోల్డ్ మెడల్ సాధించిన విద్యార్థిని విద్యార్థులు బి అక్షయ, సి అక్షర, ఎ అక్షయ, మామునూరి శ్రమజా సంపత్, కె కిజీయాబీ, ప్రశాంత్, బి రామ్ చరణ్, సి అభ్యాస్, కే ధీరజ్ సాయి, కే వేదాన్ష్ లు మంగళవారం దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న జాతీయస్థాయి తైక్వాండో టాంగ్-ట పోటీల్లో పాల్గొనేందుకు న్యూఢిల్లీ బయలుదేరారు. ఈ సందర్బంగా ఉమ్మడి హనుమకొండ జిల్లా అధ్యక్షులు మారుజోడు రాంబాబు మాట్లాడుతూ జిల్లా తైక్వాండో ప్రధాన కార్యదర్శి గడ్డం వెంకట స్వామి నేతృత్వంలో కోచ్ గా మామూనూరి సంపత్ ఇచ్చిన శిక్షణలో నిష్ణాతులైన వీరు ఢిల్లీ గడ్డపై గెలిచి తెలంగాణ జెండా ఎగరవేయాలని యావత్తు దేశ యువతకు ఆదర్శంగా నిలవాలన్నారు.