UPDATES  

NEWS

ఓణీల శుభకార్యానికి హాజరై చిన్నారులను ఆశీర్వదించిన ఐక్య తల్లిదండ్రుల సంఘం నాయకులు. మత సామరస్యానికి ప్రతీక గ్యార్వి షరీఫ్ ఉత్సవం : వజ్జా ఈశ్వరి మృతుడి కుటుంబానికి 5వేలు ఆర్థిక సాయం అందజేసిన మాజీ ఎంపీపీ ముసిపట్ల రేణుక తిరుపతి రెడ్డి ఆశ కార్యకర్త పదవికి రాజీనామా చేసి పంచాయతీ బరిలో ఘనంగా 69వ మహాపరినిర్వాణ దివాస్ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి: ప్రకృతి ప్రేమికుడు బాలు నాయక్ నంద తండా బిఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థిగా జయరాం నాయక్.. ప్రజల ఆశీర్వాదమే గెలుపు బాట గార్లలో అంబేద్కర్ విగ్రహానికి ఘనాభివందనం చేసిన ఎయిర్‌పోర్ట్ ఎ జి యం గంగావత్ వెంకన్న గిరిజన సంక్షేమ శాఖ ఏడీ సర్వేశ్వర రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఐటిడిఎ గిరిజన సంక్షేమ శాఖ ఉమ్మడి జిల్లాల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టీ.మధుకర్. జనవాసులకు దూరంగా వైన్ షాపు నిర్వహించాలి

 పోలీసుల అదుపులో దారి తప్పిన గురువు

పిల్లల పట్ల పైత్యపు చేష్టలు

తల్లితండ్రుల ఆగ్రహం

కొత్తగూడెం (తెలంగాణ వాణి)

సమాజంలో గురువులకు ఎంతో గొప్ప స్థానం ఉంది. పిల్లలను తల్లిదండ్రులు కనీ పెంచినప్పటికీ.. వారికి విద్యాబుద్దులు నేర్పించి సమాజంలో గొప్ప పొజీషన్ లో ఉండేలా చేసేది గురువులు మాత్రమే.

అందుకే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అంటారు. విద్యార్థులు దారి తప్పితే వారిని సన్మార్గంలో నడిపించేవారే ఉపాధ్యాయులు. అలాంటిది ఈ మధ్య కాలంలో కొంతమంది గురువు స్థానాన్ని బ్రష్టు పట్టిస్తున్నారు. పాఠశాలకు మద్యం సేవించి రావడం, సహ ఉపాధ్యాయులు, విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, విద్యార్థులను లైంగికంగా వేధించడం లాంటివి చేస్తున్నారు. కాగా శుక్రవారం విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఓ టీచర్ ని కొత్తగూడెం 1టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే కొత్తగూడెం, పోస్టాఫీసు సెంటర్ వద్ద గల సింగరేణి పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విధ్యార్ధినులను తెలుగు ఉపాధ్యాయుడు వేణు ఎక్కడ పడితే అక్కడ చేతులు వేస్తూ, గిచ్చుతూ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నడాని ఆరోపిస్తూ విధ్యార్ధునుల కుటుంబ సభ్యులు పాఠశాల ఎదుట ఆందోళన చేపట్టగా రంగంలోకి దిగిన 1వ టౌన్ పోలీసులు ఫిర్యాదు స్వీకరించి ఉపాధ్యాయుడు వేణు ని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించి విచారణ చేపట్టారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest