UPDATES  

NEWS

తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులని మర్యాదా పూర్వకముగా కలిసిన జాతీయ ఇంజనీర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి టి.మధుకర్. తెలంగాణ వాణి పాత్రికేయుల ఆత్మీయ సమ్మేళనం యంగ్ ఇండియన్ బ్లడ్ డోనర్స్ క్లబ్ దేశ వ్యాప్తంగా రక్త దాతలను అందిస్తున్న జె బి బాలు అభినందనీయులు ఎస్.ఎస్.స్సి బోర్డు నందు అసిస్టెంట్ కమిషనర్ గా పదోన్నతి పొందిన కోటేశ్వర రావుకు మొక్కతో శుభాకాంక్షలు తెలంగాణలో మరోసారి భూ ప్రకంపనలు పుట్టిన రోజు ఓ మొక్కను బహుమతిగా ఇవ్వండి: ప్రకృతి ప్రేమికుడు కళ్యాణ్ యంగ్ ఇండియన్ సేవా పురస్కార అవార్డు గ్రహీత యం.బాలు నాయక్ పుట్టిన రోజు మొక్కను నాటిన కె ఎన్ రాజశేఖర్ పదో తరగతి ఫలితాల్లో రేలకాయలపల్లి ప్రభంజనం..సమిష్టి కృషితోనే 100% ఫలితాలు: హెచ్ ఎం శ్రీనివాసరావు నాయక్ పదవ తరగతి ఫలితాల్లో పెంకె గీతిక విజయకేతనం….పలువురు అభినందనలు  పిల్లలలో మానసిక ధైర్యాన్ని నింపండి:-TSUTF ఇల్లందు మండల అధ్యక్షులు A.రాంబాబు.

 గ్రామ సరిహద్దు వివాదం పరిష్కారానికి ఆర్డీవో హామీ

మెట్ పల్లి (తెలంగాణ వాణి)

మెట్‌పల్లి డివిజన్ పరిధిలోని మల్లాపూర్ మండలం మొగిలిపేట, నడకుడా గ్రామాల సరిహద్దు వివాదం చిలికి చిలికి గాలి వానగా మారింది. శనివారం మొగిలిపేట గ్రామస్తులు ధాన్యం విక్రయించేందుకు వివాదాస్పద స్థలాన్ని చదును చేయడంతో విషయం తెలుసుకున్న నడకుడ గ్రామస్తులు రావడంతొ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రెవెన్యూ, పోలీస్ శాఖ వారు సంఘటన స్థలానికి వచ్చారు. మల్లాపూర్ తాసిల్దార్ వీర్ సింగ్ రెండు గ్రామాల సరిహద్దు వివాదాన్ని పరిష్కరిస్తామని అన్నా కాని శాంతించకపోవడంతో ఆర్డిఓ శ్రీనివాస్, డిఎస్పి రాములు, మెట్‌పల్లి, కోరుట్ల సిఐలు అనిల్ కుమార్, సురేష్ బాబు ఆయా సర్కిల్ పరిధిలోని ఎస్సైలు కూడా పోలీసు సిబ్బందితో వచ్చి రెండు గ్రామాల ప్రజలు ఎలాంటి తొందరపాటు చర్యలు చేపట్టకుండా వారికి నచ్చ చెప్పారు. అనంతరం మెట్‌పల్లి ఆర్డీవో శ్రీనివాస్ మాట్లాడుతూ ఏప్రిల్ 16వ తేదీన గ్రామ సరిహద్దుల సర్వే చేయించి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీనితో రెండు గ్రామాల ప్రజలు ఆందోళన విరమించారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest