UPDATES  

NEWS

జనగామ జిల్లా కలెక్టర్ తీరుపై జర్నలిస్ట్ నాయకుల ఫిర్యాదు పచ్చని ఔషధ మొక్కలు అందజేసి ఆశీర్వాదం పొందిన చిన్నారి అఫాన్ జైదీ సర్పంచ్ జర్పల దేవి ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం రోడ్డెక్కిన అన్నదాతలు వైన్స్ సిట్టింగ్ రూమ్ లో వ్యక్తి మృతి రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం… సరైన రోడ్డు సౌకర్యం లేకా వర్ష కాలం వస్తే రైతులకు కష్టాలే… ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి: గిరిజన సంక్షేమ సంఘం నాయకులు రాంబాబు,ఎంపీ నాయక్ ఉపాధి హామీ కూలీల ప్రాణం తీసుకున్న అతివేగం లక్ష్మీదేవి పల్లి మండలంలో వడదెబ్బకు వ్యవసాయ కూలీ మహిళా మృతి

 గ్రామ సరిహద్దు వివాదం పరిష్కారానికి ఆర్డీవో హామీ

మెట్ పల్లి (తెలంగాణ వాణి)

మెట్‌పల్లి డివిజన్ పరిధిలోని మల్లాపూర్ మండలం మొగిలిపేట, నడకుడా గ్రామాల సరిహద్దు వివాదం చిలికి చిలికి గాలి వానగా మారింది. శనివారం మొగిలిపేట గ్రామస్తులు ధాన్యం విక్రయించేందుకు వివాదాస్పద స్థలాన్ని చదును చేయడంతో విషయం తెలుసుకున్న నడకుడ గ్రామస్తులు రావడంతొ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రెవెన్యూ, పోలీస్ శాఖ వారు సంఘటన స్థలానికి వచ్చారు. మల్లాపూర్ తాసిల్దార్ వీర్ సింగ్ రెండు గ్రామాల సరిహద్దు వివాదాన్ని పరిష్కరిస్తామని అన్నా కాని శాంతించకపోవడంతో ఆర్డిఓ శ్రీనివాస్, డిఎస్పి రాములు, మెట్‌పల్లి, కోరుట్ల సిఐలు అనిల్ కుమార్, సురేష్ బాబు ఆయా సర్కిల్ పరిధిలోని ఎస్సైలు కూడా పోలీసు సిబ్బందితో వచ్చి రెండు గ్రామాల ప్రజలు ఎలాంటి తొందరపాటు చర్యలు చేపట్టకుండా వారికి నచ్చ చెప్పారు. అనంతరం మెట్‌పల్లి ఆర్డీవో శ్రీనివాస్ మాట్లాడుతూ ఏప్రిల్ 16వ తేదీన గ్రామ సరిహద్దుల సర్వే చేయించి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీనితో రెండు గ్రామాల ప్రజలు ఆందోళన విరమించారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest