UPDATES  

NEWS

సరైన రోడ్డు సౌకర్యం లేకా వర్ష కాలం వస్తే రైతులకు కష్టాలే… ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి: గిరిజన సంక్షేమ సంఘం నాయకులు రాంబాబు,ఎంపీ నాయక్ ఉపాధి హామీ కూలీల ప్రాణం తీసుకున్న అతివేగం లక్ష్మీదేవి పల్లి మండలంలో వడదెబ్బకు వ్యవసాయ కూలీ మహిళా మృతి మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు పసునూరి నరహరి లొంగుబాటు గిరిజనాభివృద్ధి పనులు నాణ్యతతో సకాలంలో పూర్తి చేస్తాం : ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మధుకర్ 10 లక్షలు లంచం డిమాండ్ చేసిన అటవీశాఖ అధికారులు కరీంనగర్‌లో ఉద్రిక్తత కస్టమర్ల ముసుగులో వచ్చి కాల్పులు.. షోరూమ్‌లో దోపిడీ మే 4న మెగా జాబ్ మేళాకు ఆన్లైన్‌లో నమోదు చేసుకోవాలి : కలెక్టర్ అంకిత్

 భారతీయ విద్యానికేతన్ స్కూల్ మోస్ర పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం

నిజామాబాద్ (తెలంగాణ వాణి)

చిన్ననాడు ఆడిపాడుతూ చదువుకున్న చిన్నప్పటి స్మృతులను గుర్తుచేసుకుంటూ చదువులమ్మ ఒడిలో సందడి చేశారు. మోస్రా భారతీయ విద్యానికేతన్ హైస్కూల్ 1996-97 బ్యాచ్ విద్యార్థులు పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని అపూర్వంగా జరుపుకున్నారు. చదువులు నేర్పిన గురువులను ఘనంగా సన్మానించుకున్నారు. శాలువా, పూల దండలు వేసి, మెమెంటో అందజేసి గురువులు రంగారావు అనసూయ, శివసచరణ్, హరిచర్సన్, వెంకటేష్, సంజీవ్, గోపాల్, నాగభూషణం, సాయిలు, విజేందర్, స్వరూప, పాదాలకు నమస్కరించారు. ఉదయం నుంచి డిఆర్ఆర్ ఫంక్షనల్ లో ఎంతో ఉల్లాసంగా గడిపారు. ఎవరు ఎక్కడ, ఏ రంగంలో స్థిరపడ్డారో సమ్మేళనంలో పరిచయం చేసుకున్నారు. ఆనాటి తీపి గుర్తులను నెమరు వేసుకుంటూ సంతోషంగా గడుపుతారు. పాఠశాల ద్వారా తాము ఇంత మంది కలవడం సంతోషంగా ఉందన్నారు. అందరు కలిసి భోజనాలు చేశారు. ఎంతో మందిని ఉన్నతులుగా తీర్చిదిద్దిన భారతీయ విద్యా నికేతన్ హైస్కూల్ రుణం తీర్చుకోలేనిదని విద్యార్థులు అన్నారు. గురువులకు ఎప్పటికీ రుణపడి వుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు 1996-1997 బ్యాచ్ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest