UPDATES  

NEWS

సి.పి.ఎస్ రద్దు చేయాలని ఉపాధ్యాయుల డిమాండ్ తడి చెత్త పొడి చెత్త వేరుగా చేసి ఇస్తున్నా ప్రజలు కొత్తగూడెం మేయర్ బరిలోకి ప్రముఖ విద్యావేత్త డా. యం.వీరనాయక్ తెలంగాణ వాణి దిన పత్రిక క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఖేడ్ డిఎస్పి వెంకట్ రెడ్డి ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలి: టి పి టి ఎఫ్ మండల అధ్యక్షుడు బి.సుక్య సర్పంచ్ కె.రవి ను సన్మానం చేసిన సొసైటీ వైస్ చైర్మన్ కాంపల్లి కనకేష్‌ కిన్నెరసాని గ్రామపంచాయతీ సర్పంచ్ వజ్జ రామకృష్ణ, ఉపసర్పంచ్ వజ్జా ఇంద్రజ ఆధ్వర్యంలో ముగిసిన క్రికెట్ టోర్నమెంట్ మహిళల కళలకు వేదికగా ముగ్గుల పోటీలు దేశ అభివృద్ధి మోదీ లక్ష్యం- రఘునాధ్

 తెలుగు వెలుగు సాహితీ వేదిక అవార్డు అందుకున్న షేక్ మాయ మస్తాన్

ఖమ్మం (తెలాంగాణ వాణి) మ్యాజిక్ కళా రంగంలో విశిష్టమైన కృషి చేసినందుకు తెలుగు వెలుగు సాహితీ వేదిక అవార్డును ఖమ్మం వాసి షేక్ మాయ మస్తాన్ అందుకున్నారు. మండలి వెంకట కృష్ణారావు శతజయంతి 2025 -2026 అంతర్జాతీయ తెలుగు భాషా సాహితీ సాంస్కృతిక ఉత్సవాలు హైదరాబాద్ శ్రీ త్యాగరాయ కళావేదిక లో జరిగాయి . ఈ అవార్డును తెలుగు వెలుగు సాహితీ వేదిక చైర్మన్ పోలోజు రాజకుమార్ చార్యులు , తెలంగాణ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకుళా భరణం కృష్ణ మోహన్ రావు , ప్రముఖ జ్యోతిష్య నిపుణులు దైవజ్ఞ శర్మ గురువు , తెలంగాణ విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వేములవాడ మదన్మోహన్ చారి లు అందించారు . ఈ సందర్భంగా అవార్డు గ్రహీత మస్తాన్ మాట్లాడుతూ గత 15 సంవత్సరాల నుంచి మ్యాజిక్ రంగంలో మ్యాజిక్ ని కష్టపడి నేర్చుకున్నానని , వారిది వీధి గారడి చేసుకునే కుటుంబంలో నుంచి వచ్చానని , నిరుపేద కుటుంబంలో పుట్టి కష్టపడి మ్యాజిక్ ఐటమ్స్ నేర్చుకొని మ్యాజిక్ రంగంలో అందరూ మెచ్చుకునే విధంగా ఖమ్మం జిల్లా చుట్టుపక్కల ప్రోగ్రామ్స్ చేస్తున్నానని అన్నారు . తన ప్రతిభను చూసి పెద్దలు మహానంది అవార్డును ఇచ్చారని తెలిపారు . మరికొన్ని మ్యాజిక్ సామాన్లు కొనుక్కొని ఇంకా చాలా ప్రోగ్రాలు చెయ్యడానికి ఆర్థిక సహాయం కింద ప్రభుత్వం లోన్స్ ఇప్పించాలని కోరారు .

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest