UPDATES  

NEWS

జనాభా గణన 2027 శిక్షణ కార్యక్రమం ప్రారంభం – పాల్వంచలో 36 మందికి ట్రైనింగ్ ఏపీలో మరో ఘోర రోడ్డు ప్రమాదం… వేములవాడలో ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు సాంకేతిక విజ్ఞానానికి వారధి… హుస్నాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్! కేటీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి హ్యాండ్ బోర్ మరమ్మతు – ప్రజల సమస్యకు తక్షణ పరిష్కారం:కార్పొరేటర్ కళావతిధనరాజ్ కాంగ్రెస్ నాయకులకు కాకులమర్రి లక్ష్మణ్ బాబు భయం పట్టుకుంది అంగన్‌వాడీల్లో ఒంటిపూట బడి అమలు పట్ల హర్షం వ్యక్తం చేసిన విద్యా పరిరక్షణ కమిటీ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు హరిలాల్ నాయక్  సృజన టెక్ ఫెస్ట్ 2025–26 విజేతలకు ఘన సన్మానం:ప్రిన్సిపాల్ బండి శ్రీనివాస్, ఖబడ్దార్ బిఆర్ఎస్ నాయకుల్లారా

 గాయని మధుప్రియచే రజనీ ఫెర్టిలిటీ సెంటర్ లో లక్కీడ్రా

మగాడి విజయం వెనుక స్త్రీ, స్త్రీ శక్తి వెనుక పురుషుడు ఉండాల్సిందే : గాయని మధు ప్రియ

కరీంనగర్ మార్చి 08 (తెలంగాణ వాణి)

ప్రతి మగాడి విజయం వెనుక ఒక స్త్రీ ఉన్నట్లే, ప్రతి మహిళ శక్తి వెనుక పురుషుడి హస్తం తప్పనిసరి అని ప్రముఖ గాయని మధు ప్రియ అన్నారు. శనివారం స్థానిక రెనీ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రిలో రజని సంతాన సాఫల్య కేంద్రం ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ సృష్టికి మూలం అమ్మ అని, ఆడతామో అందాల ఆనంద పౌర సమాజ నిర్మాత అని తెప్పాల్సిన పని లేదన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ప్రతి ఏట ఒక ప్రత్యేక ఉచిత ఫర్టిలిటీ సేవలు పొందడానికి అర్హులైన 10 మందిని లక్కీ డిప్‌ ద్వారా ఎంపిక చేసుకొని లక్షల విలువైన ఆధునిక వైద్య సేవలను ఉచితంగా కల్పిస్తున్న రెనీ ఆసుపత్రి చైర్మన్‌ డాక్టర్ బంగారి స్వామి, డైరెక్టర్ డా.రజనీ ప్రియదర్శిని దంపతులను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో మాట, పాట కలగలిపి అమ్మ గొప్పతనాన్ని ఆవిష్కరించిన ఉచిత సంతాన సాఫల్య వైద్య సేవలు పొందే పది మందిని లక్కీడిప్‌ ద్వారా 348 మందిలో 10 మందిని ఎంపిక చేసారు. డా రజనీ ప్రియదర్శిని మాట్లాడుతూ తమ అత్త పేరిట ప్రతి ఏట 20 లక్షల విలువైన సంతాన సాఫల్య ఉచిత సేవలు అందించడం చాలా సంతృప్తిని ఇచ్చిందన్నారు. డా బంగారి స్వామి మాట్లాడుతూ చిన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి చేర్చిన సమాజానికి ఎంతో రుణ పడి ఉన్నామని,తమ ఆసుపత్రి ద్వారా ఏడాదికి 50 లక్షలకు పైగా ఉచిత వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి మధుప్రియను ఆసుపత్రి యాజమాన్యం ఘనంగా సత్కరించారు. డా కెప్టెన్‌ బుర్ర మధుసూదన్ రెడ్డి సమన్వయ కర్తగా నిర్వహించిన ఈ సమావేశంలో ఆసుపత్రి మెడికల్‌ సూపరింటెండెంట్‌ డా రవీంద్రారెడ్డి చారి, డీన్ డా.మునీష్, గుండె వైద్య నిపుణులు డా.దినకర్ తాటిమట్ల, జనరల్ ఫిజీషియన్ డా.నిఖిల్ లక్ష్మణ్, డా లతీష్ రెడ్డి, నాన్ క్లినికల్ డైరెక్టర్ మేకల అరవింద్‍ రావు, జనరల్ మేనేజర్ పవన్ ప్రసాద్ మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest