UPDATES  

NEWS

ముస్లిం సోదరీమణులకు రంజాన్ తోఫా అందజేసిన టిఎన్ఆర్ ట్రస్ట్ ప్రపంచ కార్మిక వర్గానికి మార్గదర్శకుడు కారల్ మార్క్స్ : ఎమ్మెల్యే, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పాల్వంచలో ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్‌కు ప్రముఖుల హాజరు బడ్జెట్‌లో విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలి: ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావుకు AISF వినతి సర్వారాం గ్రామంలో ప్రజా పాలనలో భాగంగా శుభ్రత కార్యక్రమం: సర్పంచ్ భూక్యా సునీత రాంబాబు గొందిగూడెం పాఠశాలలో అభివృద్ధి పనులకు భూమిపూజ… మినీ ఆర్వో ప్లాంట్ ప్రారంభం ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక రాజాపురం పాఠశాలలో పారిశుధ్య కార్యక్రమాలు  ప్రగతి ప్రణాళికలో భాగంగా సర్పంచ్‌ల శిక్షణలో పాల్గొన్న సర్పంచ్ తాటి అనిత ప్రాథమిక పాఠశాల రాజాపురంలో అభివృద్ధి పనులు సంఘమే శరణ్యం.. సంఘమే శాశ్వతం

 ప్రేమించిన అమ్మాయిని మర్చిపోలేక మనస్థాపానికి గురై ఆత్మహత్య

హైదరాబాద్ / పటాన్ చెరువు (తెలంగాణ వాణి ప్రతినిది)

గుమ్మడిదల్ మండలంలో బీహార్ నుండి బతుకు తెరువు కోసం దోమడుగు గ్రామంలో రాజ్ కుమార్ భార్య గీతాదేవి ముగ్గురు కొడుకులుతో కలిసి ఓ ప్రయివేట్ కంపెనీలో పనిచేసుకుంటూ గత రెండు సంవత్సరాల జీవనం సాగిస్తున్నారు. అయితే పెద్ద కుమారుడు అంకిత్ కుమార్ వాళ్ల సొంత గ్రామానికి చెందిన అమ్మాయిని ప్రేమించడంతో పెద్దలు నిరాకరించారు. విషయం తెలుసుకున్న అంకిత్ బీహార్ కు వెళ్లి తరచూ అమ్మాయిని కలుస్తుండడంతో , అబ్బాయిని అమ్మాయి తల్లిదండ్రులు రెడ్ హ్యాండుగా పట్టుకున్నారు. మరోసారి ఇలా జరిగితే పోలీస్ లకు ఫిర్యాదు చేస్తామని బెదిరించారు. కాగ విషయం తెలుసుకున్న అంకిత్ కుమార్ తల్లిదండ్రులు వెంటనే బీహార్ కి వెళ్లి కొడుకుకి సర్ది చెప్పి తిరిగి ఇంటికి తీసుకురావడం జరిగింది. తదననంతరం అమ్మాయి దగ్గరనుంచి ఎటువంటి సమాచారం లేకపోవడంతో మనస్థాపానికి గురైన అంకిత్ కుమార్ సాయంత్రం సమయంలో ఫ్యాన్ కి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడి తల్లిదండ్రులను ఏం జరిగిందో కనుక్కొని దర్యాప్తు ప్రారంభించారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest