జగిత్యాల (తెలంగాణ వాణి) కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి రాజకీయాలకు దూరంగా ఉంటున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి జీవన్ రెడ్డి గురువారం నాడు కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువను కప్పుకున్నారు.తన అభిమానుల అభిప్రాయం మేరకు భవిష్యత్ కార్యక్రమం ప్రకటిస్తానన్న జీవన్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఏ పార్టీలో చేరేది స్పష్టంగా ప్రకటించని మాజీ మంత్రి జీవన్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకోవడంతో కొంతకాలంగా కొనసాగుతున్న ఉత్కంఠకు జీవన్ రెడ్డి తెరదించారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు భారీగా తరలివచ్చారు. అనంతరం జీవన్ రెడ్డి అనుచరులు సైతం బీఆర్ఎస్ పార్టీలోకి చేరుతున్నట్లు ప్రకటించారు.గత గత కొద్ది రోజులుగా కొనసాగుతున్న ఊహగానాలకు మాజీ మంత్రి జీవన్ రెడ్డి తీరదించారు. ఆయన టిఆర్ఎస్ లో చేరారు.ఈ క్రమంలో ఇవాళ టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు.
