UPDATES  

NEWS

సి.పి.ఎస్ రద్దు చేయాలని ఉపాధ్యాయుల డిమాండ్ తడి చెత్త పొడి చెత్త వేరుగా చేసి ఇస్తున్నా ప్రజలు కొత్తగూడెం మేయర్ బరిలోకి ప్రముఖ విద్యావేత్త డా. యం.వీరనాయక్ తెలంగాణ వాణి దిన పత్రిక క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఖేడ్ డిఎస్పి వెంకట్ రెడ్డి ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలి: టి పి టి ఎఫ్ మండల అధ్యక్షుడు బి.సుక్య సర్పంచ్ కె.రవి ను సన్మానం చేసిన సొసైటీ వైస్ చైర్మన్ కాంపల్లి కనకేష్‌ కిన్నెరసాని గ్రామపంచాయతీ సర్పంచ్ వజ్జ రామకృష్ణ, ఉపసర్పంచ్ వజ్జా ఇంద్రజ ఆధ్వర్యంలో ముగిసిన క్రికెట్ టోర్నమెంట్ మహిళల కళలకు వేదికగా ముగ్గుల పోటీలు దేశ అభివృద్ధి మోదీ లక్ష్యం- రఘునాధ్

 ఘనంగా గుర్రం జాషువా వర్ధంతి వేడుకలు

ధర్మారం జులై 24 (తెలంగాణ వాణి విలేఖరి) మండల కేంద్రంలోని అంబేద్కర్ కూడలిలో నవయుగ చక్రవర్తి ప్రసిద్ధ కవి వర్ధంతి వేడుకలను దళిత సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ ఆయన తన సామాజిక స్పృహతో కూడిన రచనల ద్వారా తెలుగు సాహిత్యంలో గొప్ప స్థానం పొందాడని అన్నారు. ముఖ్యంగా కుల వ్యవస్థపై తన కవితల ద్వారా తిరుగుబాటు చేశాడని సమాజంలో అసమానతలను ఎత్తి చూపాడన్నారు.ఆయన రచనలు నేటికీ తెలుగు సాహిత్యంలో ముఖ్యమైన భాగంగా పరిగణించబడ్డాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు దేవి జనార్ధన్, కాడే సూర్యనారాయణ, కుషనపెళ్లి రవి, దేవి రాజలింగు, బొల్లి నందయ్య, సుంచు మల్లేశం, గజ్జల రాజేష్, గుమ్మడి రమేష్, రాజు, బోయిని మల్లేశం, తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest