UPDATES  

NEWS

వివేకానంద పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్ ఈనెల 18న తెలంగాణ రాష్ట్ర బంద్ ని విజయవంతం చేద్దాం కటికనపల్లి ట్రాక్టర్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షునిగా సాయిలు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ విద్యార్థిని పరామర్శించిన టిజిపిఏ రాష్ట్ర ఉపాధ్యక్షులు దార మధు టేకులపల్లి టీఎస్‌యుటిఎఫ్‌ మండల ప్రధాన కార్యదర్శి డి.హరి నాయనమ్మ దశదిన కార్యక్రమానికి హాజరై శ్రద్ధాంజలి ఘటించిన టిఎస్ యుటిఎఫ్ నాయకులు  పెద్దిరెడ్డి రియాన్ చక్రవర్తి ని ఆశీర్వదించిన రాకేష్ దత్త విషాదం నింపిన పోలియో చుక్కలు పెద్దచింతకుంట గ్రామంలో ఇంటింటికి సీఐటీయూ బైండ్ల కళాకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా బైండ్ల ప్రతాప్ తడ్కల్ లో పల్స్ పోలియో కార్యాలయం

 గ్రామస్తుల సమిష్టి కృషి

రోడ్డుకు ఇరువైపుల ఉన్న చెట్లు తొలగింపు

ధర్మారం (తెలంగాణ వాణి విలేఖరి) సమిష్టి కృషితో సాధ్యం కానిది ఏది లేదనే విషయాన్ని ఆచరణలో పెట్టి చూపారు ఆ గ్రామస్తులు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని చామనపల్లి గ్రామానికి వెళ్లే దారికి ఇరువైపుగా ఏపుగా పెరిగిన చెట్లను, పిచ్చి మొక్కలను కంప చెట్లను తొలగించెందుకే శ్రమదానం చేశారు. పిచ్చి మొక్కలు పెరిగడంతో పది రోజులుగా కుమ్మరి కుంట వయా కొత్తూర్, న్యూ కొత్తపల్లి, చామనపల్లి గ్రామాల మీదుగా ధర్మారం మోడల్ స్కూల్, ధర్మారం వెళ్లే బస్సు రావడం నిలిపివేయడంతో స్కూల్ కి వెళ్లే విద్యార్థిని విద్యార్థులకు ఇబ్బంది పడుతున్నారని రెండు రోజులుగా చామనపల్లి కొత్తపల్లి న్యూ గ్రామాల ప్రజలు, యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రోడ్డుకు అడ్డుగా ఉన్న చెట్లను శ్రమదానం చేసి తొలగించారు. దీంతో పాటు కొత్తూరు నుండి చామనపల్లి మీదుగా కటికనపల్లి వరకు ఉన్న రోడ్డుకి ఇరువైపులా ఉన్న చెట్ల మండలను పిచ్చి మొక్కలను తొలగించి వాహనాదారులకు ఇబ్బంది లేకుండా చేశారు. కటికనపల్లి మాజీ ఉపసర్పంచ్ రామడుగు గంగారెడ్డి చెట్ల మండలను తొలగించేందుకు తన సొంత జెసిబి ని ఉచితంగా అందించారు. ఈ కార్యక్రమంలో భాజపా మండల శాఖ అధ్యక్షుడు తీగుళ్ల సతీష్ రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు నాగరాజు, న్యూ కొత్తపల్లి గ్రామ మాజీ ఉపసర్పంచ్ అయితర వేణి రమేష్, సురేందర్, తిరుపతి ,శివ, నరసయ్య, లచ్చయ్య , సంపత్ సంధినేని సంతోష్, కూనారపు రాములు, సుందరగిరి చందు తో పాటు రెండు గ్రామాల ప్రజలు యువకులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest