UPDATES  

NEWS

ప్రభుదయాల్‌ పాత అనుబంధాలతో సింగరేణి సి.యం.డి ఇస్రో యువికా–26కు దరఖాస్తులు ఆహ్వానం: భద్రాది జిల్లా సైన్స్ అధికారి బి.సంపత్ కుమార్ భద్రాచలం డివిజన్ లో పి ఆర్ టి యు టి ఎస్ సమావేశం మండల స్థాయి బాల మేళా 2.0 విజయవంతం : ఎంఇఓ కృష్ణయ్య కార్పొరేటర్ చింతలపూడి శ్రావణి – సాయి కుమార్ దంపతుల చేతుల మీదుగా నూతన పట్టు వస్త్రాలు బహుకరణ హోలీ పండుగను ఘనంగా జరుపుకున్న లక్ష్మీదేవిపల్లి పంచాయతీ సిబ్బంది కేజీబీవీ,యుఆర్‌ఎస్,సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలపై మూడు దశల పోరాటం:టీఎస్‌యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి.రాజు. రంగులమయమైన ఇండోర్ స్టేడియం: తైక్వాండో విద్యార్థుల హోలీ హంగామా ! నూతన జిల్లా కలెక్టర్ అంకిత్ ఐఏఎస్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన టిఎస్ యు.టి.ఎఫ్ భద్రాది జిల్లా కమిటి  సేవాలాల్ సద్గురు చూపిన మార్గం ఆదర్శనీయం: వైరా ఎమ్మెల్యే మాళోత్ రాందాస్ నాయక్

 క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్ అడ్లూరి

ధర్మారం (తెలంగాణ వాణి విలేఖరి)

క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ధర్మారం మండల కేంద్రంలోని మిగిద్దో మినిస్ట్రీస్ చర్చికితో పాటు పలు చర్చిలలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ముఖ్య అతిథిగా ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ఇతరుల పట్ల ప్రేమ సహనం శాంతి సేవాభావం ద్రాత్రుత్వమనే సుగుణాల ఆచరణలో మానవాళిని సన్మార్గం వైపు నడిపించిన యేసుక్రీస్తు జీవనం అందరికీ ఆదర్శనీయమని అన్నారు. ఆయన గొప్ప దేవుడనికొనియాడారు, ఆయన కృప ఈ రాష్ట్ర ప్రజలందరికీ, ముఖ్యమంత్రి కి ఉండాలని కోరారు. రాష్ట్రంలో క్రిస్టియన్ మైనార్టీల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని అన్నారు. శాసనసభ ఎన్నికలలో ధర్మపురి నియోజకవర్గంలోని ప్రజలకు, క్రైస్తవ సోదర సోదరీమణులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటానని హామీ ఇచ్చారు. పాస్టర్ దేవి జాన్ నెల్సన్ ప్రపంచ శాంతిని కోరుతూ ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాజీ ఎంపీటీసీ తోడేటి రాజ లింగయ్య గౌడ్, ఓరెమ్ చిరంజీవి, బెక్కం జనార్ధన్, ఆర్ఐ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest