UPDATES  

NEWS

గిరిజన సంక్షేమ శాఖ ఏడీ సర్వేశ్వర రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఐటిడిఎ గిరిజన సంక్షేమ శాఖ ఉమ్మడి జిల్లాల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టీ.మధుకర్. జనవాసులకు దూరంగా వైన్ షాపు నిర్వహించాలి మున్సిపల్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారుల ఆకస్మిక తనిఖీలు మహాత్మ జ్యోతిరావు పూలే కు 135వ ఘన నివాళి కాపర్ వైర్ దొంగల పట్టివేత కోర్టుకు అప్పగింత ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు బొమ్మరెడ్డిపల్లి లో టీబి ఛాంపియన్ అవగాహన కార్యక్రమం మంత్రులను మర్యాదపూర్వకంగా కలిసిన పెరిక కుల రాష్ట్ర నాయకులు బొమ్మరెడ్డి పల్లిలో ఉచిత ఆరోగ్య శిబిరం అనుమతులు లేని ఆసుపత్రులపై ఆగ్రహం వ్యక్తం చేసిన డిఎంహెచ్ఓ

 క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్ అడ్లూరి

ధర్మారం (తెలంగాణ వాణి విలేఖరి)

క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ధర్మారం మండల కేంద్రంలోని మిగిద్దో మినిస్ట్రీస్ చర్చికితో పాటు పలు చర్చిలలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ముఖ్య అతిథిగా ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ఇతరుల పట్ల ప్రేమ సహనం శాంతి సేవాభావం ద్రాత్రుత్వమనే సుగుణాల ఆచరణలో మానవాళిని సన్మార్గం వైపు నడిపించిన యేసుక్రీస్తు జీవనం అందరికీ ఆదర్శనీయమని అన్నారు. ఆయన గొప్ప దేవుడనికొనియాడారు, ఆయన కృప ఈ రాష్ట్ర ప్రజలందరికీ, ముఖ్యమంత్రి కి ఉండాలని కోరారు. రాష్ట్రంలో క్రిస్టియన్ మైనార్టీల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని అన్నారు. శాసనసభ ఎన్నికలలో ధర్మపురి నియోజకవర్గంలోని ప్రజలకు, క్రైస్తవ సోదర సోదరీమణులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటానని హామీ ఇచ్చారు. పాస్టర్ దేవి జాన్ నెల్సన్ ప్రపంచ శాంతిని కోరుతూ ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాజీ ఎంపీటీసీ తోడేటి రాజ లింగయ్య గౌడ్, ఓరెమ్ చిరంజీవి, బెక్కం జనార్ధన్, ఆర్ఐ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest