UPDATES  

NEWS

ముస్లిం సోదరీమణులకు రంజాన్ తోఫా అందజేసిన టిఎన్ఆర్ ట్రస్ట్ ప్రపంచ కార్మిక వర్గానికి మార్గదర్శకుడు కారల్ మార్క్స్ : ఎమ్మెల్యే, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పాల్వంచలో ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్‌కు ప్రముఖుల హాజరు బడ్జెట్‌లో విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలి: ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావుకు AISF వినతి సర్వారాం గ్రామంలో ప్రజా పాలనలో భాగంగా శుభ్రత కార్యక్రమం: సర్పంచ్ భూక్యా సునీత రాంబాబు గొందిగూడెం పాఠశాలలో అభివృద్ధి పనులకు భూమిపూజ… మినీ ఆర్వో ప్లాంట్ ప్రారంభం ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక రాజాపురం పాఠశాలలో పారిశుధ్య కార్యక్రమాలు  ప్రగతి ప్రణాళికలో భాగంగా సర్పంచ్‌ల శిక్షణలో పాల్గొన్న సర్పంచ్ తాటి అనిత ప్రాథమిక పాఠశాల రాజాపురంలో అభివృద్ధి పనులు సంఘమే శరణ్యం.. సంఘమే శాశ్వతం

మహిళా సాధికారత పూలే సావిత్రిబాయి ఘనత

ధర్మారం (తెలంగాణ వాణి) పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని గౌతమ బుద్ధ ఫంక్షన్ హాల్ లో గురువారం కరెన్సీ పై అంబేద్కర్ ఫోటో సాధన సమితి జాతీయ ఉపాధ్యక్షులు బొల్లి స్వామి అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్య క్రమానికి పలువురు మండల దళిత బహుజన నాయకులు హాజరైనారు.అనంతరం పూలే, సావిత్రిబాయి చిత్రపటాలకు పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం బొల్లి స్వామి మాట్లాడుతూ.. పూణే, బాంబే లోని 141 బాల బాలికల […]

లక్ష్మీదేవి పల్లి గ్రామ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు: సర్పంచ్ తాటి అనిత

లక్ష్మీదేవి పల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ తాటి అనిత నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.గత సంవత్సరం అనుభవాలను పాఠాలుగా తీసుకుని,కొత్త ఏడాది గ్రామ అభివృద్ధి,ప్రజల శ్రేయస్సు, సుఖసంతోషాలతో సాగాలని ఆమె ఆకాంక్షించారు.గ్రామ ప్రజలందరికీ ఆరోగ్యం,ఆనందం,సమృద్ధి కలగాలని పాడి పంటలు బాగా పండాలని,గల్లీ గల్లీ తిరుగుతూ ప్రజలను ప్రత్యక్షంగా కలిసి తాటి అనిత తిరుమలేష్ దంపతులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

నూతన సంవత్సర వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలి ఎస్సై ప్రవీణ్

ధర్మారం (తెలంగాణ వాణి) ధర్మారం మండల ప్రజలు, యువత నూతన సంవత్సర వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని స్థానిక ఎస్సై ఎం ప్రవీణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. డిసెంబర్ 31 రాత్రి నూతన సంవత్సరం సందర్భంగా నిర్వహించుకునే వేడుకలను శాంతియుతంగా, నిబంధనలకు లోబడి జరుపుకోవాలని పేర్కొన్నారు. వేడుకల సందర్భంగా శాంతి భద్రతలకు భంగం కలగకుండా మండల వ్యాప్తంగా పోలీసు యంత్రాంగం పటిష్టమైన భద్రత చర్యలు చేపడుతుందన్నారు. 31వ తేదీ రాత్రి, మండల కేంద్రాలతో పాటు అన్ని […]

సర్పంచ్ గా భాద్యతలు చేపట్టిన ప్రేమేందర్

లక్ష్మిదేవిపల్లి (తెలంగాణ వాణి) సర్పంచిగా హమాలీ కాలనీ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే తన ధ్యేయమని నూతన సర్పంచ్ గా భాద్యతలు చేపట్టిన సర్పంచ్ గుగులోత్ ప్రేమేందర్ అన్నారు. మంగళవారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో భాద్యతలు చేపట్టిన సందర్భంగా సర్పంచ్ ప్రేమేందర్ మాట్లాడుతూ హమాలీ కాలనీ గ్రామాన్ని అభివృద్ధి చేయడమే ధ్యేయంగా పనిచేస్తానన్నారు. రాజకీయాలకు అతీతంగా పాలకవర్గం సహకారంతో కలిసి గ్రామాభివృద్ధి కోసం కృషి చేస్తానన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి […]

ప్రభుత్వ ఉన్నత పాఠశాల నేతాజీ రామవరం లో తిథి భోజనాలు

ప్రభుత్వ ఉన్నత పాఠశాల నేతాజీ రామవరం లో ప్రధానోపాధ్యాయురాలు ద్రౌపతి ఆధ్వర్యంలో విజయలక్ష్మి, సులోచనల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ప్రతి ఏడాది విద్యార్థులకు తిథి భోజనాలు ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని ప్రధానోపాధ్యాయులు తెలిపారు. పిల్లలకు భోజనం ఏర్పాటు చేయడం సంతోషం, సంతృప్తిని ఇస్తుందని విజయలక్ష్మి పేర్కొన్నారు.

నందా తండా గ్రామపంచాయతీ సర్పంచ్‌ మాలోత్ బలరాం కు ఘన సన్మానం

చుంచుపల్లి మండలం నందా తండా గ్రామపంచాయతీ సర్పంచ్‌గా మాలోత్ బలరాం ఎన్నికైన సందర్భంగా స్థానిక గిరిజన సంఘాల నాయకులు, ఉద్యోగులు హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు. పంచాయతీ అభివృద్ధి కోసం అంకితభావంతో కృషి చేసి, రాబోయే రోజుల్లో నందా తండాను ఆదర్శ గ్రామపంచాయతీగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు.

ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావును సన్శేమానించిన శేఖరం బంజర గ్రామ ప్రజలు

సిపిఐ పార్టీ వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పాల్వంచలోని సిపిఐ కార్యాలయంలో కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావును శేఖరం బంజారా గ్రామ ప్రజలు మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో గిరిజన విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు ఇస్లావత్ అనిల్ నాయక్‌,రంజిత్ నాయక్, నరేష్ నాయక్,రవి నాయక్, హరిబాబు నాయక్,కవిత,అనూష,భద్ర, హరిత,బుజ్జి,రూపదేవి, అనిత, యువతీ యువకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఏటీఎంల చోరీ జరిగిన సంఘటన స్థలాలను పరిశీలించిన ఇంచార్జి పోలీస్ కమిషనర్ ఎం రాజేష్ చంద్ర

ఐదు స్పెషల్ టీం ల ఏర్పాటు, ముమ్మరంగా తనిఖీలు భద్రత బలోపేతం కోసం బ్యాంకు అధికారులతో సమన్వయం నిజామాబాద్(తెలంగాణ వాణి) నిజామాబాద్ నగరంలో శనివారం తెల్లవారు జామున రెండు ఏటీఎంలలో చోరీ జరిగిన సంఘటన స్థలాలను శనివారం ఇంచార్జి పోలీస్ కమిషనర్ ఎం రాజేష్ చంద్ర పర్యవేక్షించారు. టౌన్ 4 పోలీస్ స్టేషన్ పరిధిలోని పాంగ్ర బ్రాంచ్ కు సంబంధించిన డెవలప్మెంట్ క్రెడిట్ బ్యాంక్ ఏ. టి. ఎమ్, టౌన్ 5 పోలీస్ స్టేషన్ పరిధిలోని వర్ని […]

పాస్టర్ యు.అమృత రావు కు మొక్కలు అందించి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన ప్రకృతి హారతి దీక్ష గౌరవ సలహాదారులు ఏటిఈసి జిల్లా అధ్యక్షుడు బాలు నాయక్

లక్ష్మీదేవి పల్లి మండలం సాటివారిగూడెంలోని త్రియేక దేవర్చనాలయం చర్చ్‌లో పాస్టర్ యు.అమృత రావు కు మొక్కలు అందించి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన ప్రకృతి హారతి దీక్ష గౌరవ సలహాదారులు ఏటిఈసి జిల్లా అధ్యక్షుడు బాలు నాయక్ మాలోత్.ఈ కార్యక్రమంలో పాస్టర్ ఉంగటూరి అమృత రావు,ప్రభు భూషణం, వెంకట్రావు,జానయ్య, గుంటూరు రాంబాబు, ఏలియా,గడ్డం సురేష్, ఎం. రమేష్ తదితరులు పాల్గొన్నారు

త్రియేక దేవర్చనాలయం చర్చ్‌లో ఘనంగా క్రిస్టమస్ వేడుకలు:పాస్టర్ యు.అమృత రావు

లక్ష్మీదేవి పల్లి మండలం సాటివారిగూడెంలోని త్రియేక దేవర్చనాలయం చర్చ్‌లో పాస్టర్ యు.అమృత రావు ఆధ్వర్యంలో క్రిస్టమస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా సంఘ సభ్యులతో కలిసి దేవునికి మహిమ కలిగించేలా ప్రత్యేక ప్రార్థనలు చేశారు.శాంతి,ప్రేమ, సోదరభావం అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పాస్టర్ అమృత రావు కోరారు.ప్రజలందరూ ఏసు ప్రభు సూచించిన మార్గంలో నడవాలని అన్నారు.కార్యక్రమంలో ఉపాధ్యాయులు బాలు నాయక్, ప్రభు భూషణం,వెంకట్రావు, జానయ్య,రాంబాబు,ఏలియా,గడ్డం సురేష్,ఎం.రమేష్ తదితరులు పాల్గొన్నారు.