ధర్మారం (తెలంగాణ వాణి విలేఖరి) భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబు, పెద్దపల్లి మాజీ శాసనసభ్యుడు గుజ్జుల రామకృష్ణారెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జి కన్నం అంజయ్య, జిల్లా ఉపాధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ కొమ్ము రాంబాబు దేశాల మేరకు శుక్రవారం భారతీయ జనతా పార్టీ ధర్మారం మండల శాఖ కార్యవర్గాన్ని పూర్తిస్థాయిలో నియమించినట్లు ఆ శాఖ మండల అధ్యక్షుడు తీగుళ్ల సతీష్ రెడ్డి విలేకరులకు తెలిపారు. మండల ఉపాధ్యక్షులుగా కర్రే లక్ష్మణ్, దేవి కొమరేష్, సామంతుల కిరణ్, బైరి శేఖర్, ప్రధాన కార్యదర్శులుగా కుందేళ్ళ కిరణ్, దేవి రాజలింగం, గోనే సాయి, కార్యదర్శులుగా జనగామ సంజీవ్, చీకట్ల శేఖర్, పల్లె లక్ష్మణ్, సాగంటి నరసయ్య, కోశాధికారిగా కేశవేణి నాగరాజు, కార్యవర్గ సభ్యులుగా నాడెం మల్లేశం, మల్యాల వెంకటేష్, శాఖాపురం వెంకటేష్ ,గడ్డం రాజేశ్వర్ రెడ్డి, కుంట రాజిరెడ్డి, వన్నెల బాల్ రెడ్డిలను నియమించారు. యువ మోర్చా మండల అధ్యక్షుడుగా మామిడి చెందు. దళిత మోర్చా మండల అధ్యక్షులుగా అత్తిరి పత్తిరి రమేష్, ఎస్సీ ఎస్టీ మండల అధ్యక్షులుగా రవి, కిషన్ మోర్చా మండల అధ్యక్షులుగా దీటీ మల్లయ్య లను పూర్తి స్థాయి మండల కమిటీని నియమించినట్లు అధ్యక్షుడు సతీష్ రెడ్డి తెలిపారు.