UPDATES  

NEWS

కేజీబీవీ,యుఆర్ఎస్,సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి:టీఎస్ యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి డిఎస్.నాగేశ్వరరావు చంద్రు ఫౌండేషన్ ఆధ్వర్యంలో పది విద్యార్థులకు పరీక్ష సామాగ్రి పంపిణీ బండపల్లిలో విద్యుత్ సెగకు నిరుపేద ఇల్లు బుగ్గి: సర్వం కోల్పోయి వీధిన పడ్డ కుటుంబం కేజీబీవీ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన త్రాగిన మైకంలో యాక్సిడెంట్ చేసి ఇద్దరు మృతులకు కారణమైన అంబులెన్స్ డ్రైవర్ కు10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష కూలీలైన్ మసీదు యూత్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు టి ఎస్ యు టి ఎఫ్ అద్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవం మహిళా దినోత్సవం .. రోజు మొక్కతో శుభాకాంక్షలు తెలిపిన ప్రకృతి ప్రేమికుడు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డు హోల్డర్ విశ్వామిత్ర చౌహాన్ ఖమ్మంలో శ్రీ చైతన్య టెక్నో స్కూల్‌ విద్యార్థుల ఐఎన్‌టీఎస్ఓ ఒలింపియాడ్ పరీక్షలు విద్యార్థుల ప్రతిభ.. సారపాకలో బి ప్రకాష్ రావు మాతృమూర్తి దశదిన కార్యక్రమంలో పాల్గొన్న టి ఎస్ యు టి ఎఫ్ భద్రాది జిల్లా నాయకులు 

 బైండ్ల కళాకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా బైండ్ల ప్రతాప్

యాదగిరిగుట్ట (తెలంగాణ వాణి) యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామానికి చెందిన ప్రముఖ బైండ్ల కళాకారుడు ఒగ్గు రాణా ప్రతాప్ బైండ్ల కు తెలంగాణ బైండ్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు నాగిళ్ళ లక్ష్మణ్ రావు చేతుల మీదుగా బైండ్ల కళాకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా ఆదివారం రోజున నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు నాగిళ్ళ లక్ష్మణ్ రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బైండ్ల సంక్షేమానికి 200 కోట్లు ప్రవేశపెట్టి వారిని ఆదుకోవాలని, ప్రత్యేకంగా బైండ్ల కార్పొరేషన్ను ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల్లో అవకాశాలు కల్పించాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బైండ్ల కులస్తులకు రాజకీయ అవకాశాలు కల్పించాలని బైండ్ల కులస్తులను వృత్తిని కాపాడాలని కోరారు. అనంతరం బైండ్ల కళాకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎన్నికైన వగ్గు రాణా ప్రతాప్ బైండ్ల కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. కళాకారుల వృత్తి సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమించి వారికి అండగా ఉండాలని తెలిపారు. అనంతరం బైండ్ల కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన వగ్గు రాణా ప్రతాప్ మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర కమిటీకి వివిధ జిల్లాల బైండ్ల కళాకారులందరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చిన్నపాక మల్లేశం, రాష్ట్ర కోఆర్డినేటర్ ఎస్పీ స్వామి, బైండ్ల రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎల్లమ్మ కంటి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest