UPDATES  

NEWS

జనాభా గణన 2027 శిక్షణ కార్యక్రమం ప్రారంభం – పాల్వంచలో 36 మందికి ట్రైనింగ్ ఏపీలో మరో ఘోర రోడ్డు ప్రమాదం… వేములవాడలో ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు సాంకేతిక విజ్ఞానానికి వారధి… హుస్నాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్! కేటీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి హ్యాండ్ బోర్ మరమ్మతు – ప్రజల సమస్యకు తక్షణ పరిష్కారం:కార్పొరేటర్ కళావతిధనరాజ్ కాంగ్రెస్ నాయకులకు కాకులమర్రి లక్ష్మణ్ బాబు భయం పట్టుకుంది అంగన్‌వాడీల్లో ఒంటిపూట బడి అమలు పట్ల హర్షం వ్యక్తం చేసిన విద్యా పరిరక్షణ కమిటీ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు హరిలాల్ నాయక్  సృజన టెక్ ఫెస్ట్ 2025–26 విజేతలకు ఘన సన్మానం:ప్రిన్సిపాల్ బండి శ్రీనివాస్, ఖబడ్దార్ బిఆర్ఎస్ నాయకుల్లారా

 జగిత్యాల కలెక్టరేట్‌లో అవినీతి కలకలం

లంచం తీసుకుంటూ ఏసీబీ దాడిలో సీనియర్ అసిస్టెంట్ రఘు పట్టివేత

జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏసీబీ దాడులు

జగిత్యాల (తెలంగాణ వాణి)

లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన సీనియర్ అకౌంటెంట్ రఘు కుమార్ జగిత్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని జిల్లా ట్రెజరీ కార్యాలయంలో శుక్రవారం ఏసీబీ అధికారులు దాడులు చేశారు.కోరుట్ల పోలీస్ స్టేషన్లో పోలీస్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న పవన్ కుమార్ సిపిఎస్ సంబం ధించిన డబ్బులు తమ అకౌంట్లో జమకావాలని జిల్లా ట్రెజరీ కార్యాలయంలో సీనియర్ అకౌంటుగా పనిచేస్తున్న అరిగే రఘు కుమార్ సంప్రదించాడు. దీనికిగాను ఏడు వేల రూపాయలు లంచం కావాలని అడగడంతో ఇస్తానని పవన్ కుమార్ ఒప్పుకు న్నాడు.దీంతో సిపిఎస్ సంబం ధించిన డబ్బులు ఒక లక్ష నాలుగు వేల రూపాయలు పవన్ కుమార్ అకౌంట్లో జమైనవి.7000 రూపాయలు లంచం ఇస్తామన్న డబ్బులు ఇవ్వాలని అకౌంటెంట్ రఘు కుమార్ కానిస్టేబుల్ పవన్ కుమార్ కు అనేకసార్లు ఫోన్ చేయగా శుక్రవారం కొండగట్టు ఆంజనేయస్వామి జయంతి బందోబస్తుకు వెళుతున్నానని ట్రెజరీ అప్ కి వచ్చి నీకు ఇస్తానని తెలిపి 7వేల రూపాయలు రఘు కుమారుకు ఇస్తుండగా ఏసీబీ డి.ఎస్.పి రమణమూర్తి ఆధ్వ ర్యంలో వల పన్ని పట్టుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది ప్రజాధనాన్ని దోచే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. “సేవలో ఉండే ఉద్యోగులు సేవను మరిచి లంచాల కోసం ఎదురు చూడటం దురదృష్టకరం”అంటూ మండిపడుతున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest