UPDATES  

NEWS

జనగామ జిల్లా కలెక్టర్ తీరుపై జర్నలిస్ట్ నాయకుల ఫిర్యాదు పచ్చని ఔషధ మొక్కలు అందజేసి ఆశీర్వాదం పొందిన చిన్నారి అఫాన్ జైదీ సర్పంచ్ జర్పల దేవి ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం రోడ్డెక్కిన అన్నదాతలు వైన్స్ సిట్టింగ్ రూమ్ లో వ్యక్తి మృతి రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం… సరైన రోడ్డు సౌకర్యం లేకా వర్ష కాలం వస్తే రైతులకు కష్టాలే… ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి: గిరిజన సంక్షేమ సంఘం నాయకులు రాంబాబు,ఎంపీ నాయక్ ఉపాధి హామీ కూలీల ప్రాణం తీసుకున్న అతివేగం లక్ష్మీదేవి పల్లి మండలంలో వడదెబ్బకు వ్యవసాయ కూలీ మహిళా మృతి

 జగిత్యాల కలెక్టరేట్‌లో అవినీతి కలకలం

లంచం తీసుకుంటూ ఏసీబీ దాడిలో సీనియర్ అసిస్టెంట్ రఘు పట్టివేత

జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏసీబీ దాడులు

జగిత్యాల (తెలంగాణ వాణి)

లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన సీనియర్ అకౌంటెంట్ రఘు కుమార్ జగిత్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని జిల్లా ట్రెజరీ కార్యాలయంలో శుక్రవారం ఏసీబీ అధికారులు దాడులు చేశారు.కోరుట్ల పోలీస్ స్టేషన్లో పోలీస్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న పవన్ కుమార్ సిపిఎస్ సంబం ధించిన డబ్బులు తమ అకౌంట్లో జమకావాలని జిల్లా ట్రెజరీ కార్యాలయంలో సీనియర్ అకౌంటుగా పనిచేస్తున్న అరిగే రఘు కుమార్ సంప్రదించాడు. దీనికిగాను ఏడు వేల రూపాయలు లంచం కావాలని అడగడంతో ఇస్తానని పవన్ కుమార్ ఒప్పుకు న్నాడు.దీంతో సిపిఎస్ సంబం ధించిన డబ్బులు ఒక లక్ష నాలుగు వేల రూపాయలు పవన్ కుమార్ అకౌంట్లో జమైనవి.7000 రూపాయలు లంచం ఇస్తామన్న డబ్బులు ఇవ్వాలని అకౌంటెంట్ రఘు కుమార్ కానిస్టేబుల్ పవన్ కుమార్ కు అనేకసార్లు ఫోన్ చేయగా శుక్రవారం కొండగట్టు ఆంజనేయస్వామి జయంతి బందోబస్తుకు వెళుతున్నానని ట్రెజరీ అప్ కి వచ్చి నీకు ఇస్తానని తెలిపి 7వేల రూపాయలు రఘు కుమారుకు ఇస్తుండగా ఏసీబీ డి.ఎస్.పి రమణమూర్తి ఆధ్వ ర్యంలో వల పన్ని పట్టుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది ప్రజాధనాన్ని దోచే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. “సేవలో ఉండే ఉద్యోగులు సేవను మరిచి లంచాల కోసం ఎదురు చూడటం దురదృష్టకరం”అంటూ మండిపడుతున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest