ధర్మారం (తెలంగాణ వాణి) పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పత్తిపాక ప్రాథమిక పాఠశాలలో గురువారం ముందస్తు రక్షాబంధన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు నూతి మల్లన్న మాట్లాడుతూ… మన భారతీయ సంస్కృతిలో ప్రతీ పండుగకు ఎంతో విశిష్టత ఉంటుందని, ఈ రక్షాబంధన్ సోదరభావానికి ప్రతీక అని, సమాజంలో ఐక్యతకు నిదర్శనం ఈ పండుగ అని అన్నారు. అనంతరం విద్యార్థులకు మిఠాయిలు పంపిణీ చేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు ఒకరికొకరు నేను నీకు రక్ష, నీవు నాకు రక్ష, మనమందరం దేశానికి, ధర్మానికి రక్ష అంటూ రాఖీలు కట్టుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ జూలపల్లి ఖండ్ వ్యవస్థా ప్రముఖ్ చింతల ప్రసాద్, పాఠశాల ఉపాధ్యాయులు గండ్రాతి శ్రీలత, అనుమల్ల శారద, సిరిపురం సునీల్, చెక్కపల్లి అరుణశ్రీ, నాగెల్లి సౌజన్య తదితరులు పాల్గొన్నారు
Post Views: 3




