UPDATES  

NEWS

సి.పి.ఎస్ రద్దు చేయాలని ఉపాధ్యాయుల డిమాండ్ తడి చెత్త పొడి చెత్త వేరుగా చేసి ఇస్తున్నా ప్రజలు కొత్తగూడెం మేయర్ బరిలోకి ప్రముఖ విద్యావేత్త డా. యం.వీరనాయక్ తెలంగాణ వాణి దిన పత్రిక క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఖేడ్ డిఎస్పి వెంకట్ రెడ్డి ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలి: టి పి టి ఎఫ్ మండల అధ్యక్షుడు బి.సుక్య సర్పంచ్ కె.రవి ను సన్మానం చేసిన సొసైటీ వైస్ చైర్మన్ కాంపల్లి కనకేష్‌ కిన్నెరసాని గ్రామపంచాయతీ సర్పంచ్ వజ్జ రామకృష్ణ, ఉపసర్పంచ్ వజ్జా ఇంద్రజ ఆధ్వర్యంలో ముగిసిన క్రికెట్ టోర్నమెంట్ మహిళల కళలకు వేదికగా ముగ్గుల పోటీలు దేశ అభివృద్ధి మోదీ లక్ష్యం- రఘునాధ్

 ఈనెల 18న తెలంగాణ రాష్ట్ర బంద్ ని విజయవంతం చేద్దాం

జాతీయ బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి జంగ మహేందర్

ధర్మారం (తెలంగాణ వాణి) తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన తరగతులకు చెందిన రిజర్వేషన్ల ను అడ్డుకున్నందుకు నిరసనగా బీసీ కుల సంఘాల ఆధ్వర్యంలో ఆర్ కృష్ణయ్య నాయకత్వంలో ఈనెల 18వ తేదీన రాష్ట్రవ్యాప్త బంద్ కు అన్ని రాజకీయ పార్టీలు కుల సంఘాలు వ్యాపార వాణిజ్య సంస్థలు సంపూర్ణ మద్దతు తెలుపాలని జాతీయ రాష్ట్ర కార్య నిర్వహక కార్యదర్శి జంగ మహేందర్ కోరారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జీవో 9 జారీ చేసినప్పటికీ అట్టి జీవో పై హైకోర్టు స్టే విధించడం అత్యంత బాధాకరమని ఇది రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ లో ఉన్న బడుగు బలహీన వర్గాలకు నోటి కాడి ముద్ద లాగేసినట్టు భావావించాల్సిన పరిస్థితి ఉత్పన్నమైనదని ఆయన అన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయ్యాక ఎన్నికల్లో కోర్టు జోక్యం చేసుకోవడం సబబు కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ధర్మసానం పై బీసీలందరికీ అపారమైన నమ్మకం ఉందని ఆయన అన్నారు. బీసీలు అందరు కలిసి రోడ్ల పైకి వచ్చి తమ నిరసనలు తెలిపే సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు దేశంలోనే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కూడా అత్యధిక జనాభా కలిగిన మనము మన వాటా ఏందో ఎంతో తెలుసాల్సిన అవసరం ఉందని బీసీ సంఘాలు అన్ని ఈ రోజు ఏక తాటి పై వచ్చి బంద్ కి పిలుపునిచ్చారన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest