UPDATES  

NEWS

మత సామరస్యానికి ప్రతీక గ్యార్వి షరీఫ్ ఉత్సవం : వజ్జా ఈశ్వరి మృతుడి కుటుంబానికి 5వేలు ఆర్థిక సాయం అందజేసిన మాజీ ఎంపీపీ ముసిపట్ల రేణుక తిరుపతి రెడ్డి ఆశ కార్యకర్త పదవికి రాజీనామా చేసి పంచాయతీ బరిలో ఘనంగా 69వ మహాపరినిర్వాణ దివాస్ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి: ప్రకృతి ప్రేమికుడు బాలు నాయక్ నంద తండా బిఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థిగా జయరాం నాయక్.. ప్రజల ఆశీర్వాదమే గెలుపు బాట గార్లలో అంబేద్కర్ విగ్రహానికి ఘనాభివందనం చేసిన ఎయిర్‌పోర్ట్ ఎ జి యం గంగావత్ వెంకన్న గిరిజన సంక్షేమ శాఖ ఏడీ సర్వేశ్వర రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఐటిడిఎ గిరిజన సంక్షేమ శాఖ ఉమ్మడి జిల్లాల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టీ.మధుకర్. జనవాసులకు దూరంగా వైన్ షాపు నిర్వహించాలి మున్సిపల్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారుల ఆకస్మిక తనిఖీలు

 ఫుట్ బాల్ లో రాష్ట్రస్థాయికి ఎంపికైన విద్యార్థులు

ధర్మారం (తెలంగాణ వాణి విలేఖరి) మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల కళాశాల విద్యార్థులు ఫుట్బాల్ విభాగంలో అండర్ 19 లో రాష్ట్రస్థాయికి ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ ఈరవేణి రాజ్ కుమార్ తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈనెల 7న కరీంనగర్ బిఆర్ అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించిన ఎస్జిఎఫ్ అండర్ 19 బాలికల విభాగంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా సెలక్షన్స్ లో ధర్మారం ఆదర్శ కళాశాలకు చెందిన 11 మంది విద్యార్థులు రాష్ట్రస్థాయికి ఎంపికైనట్లు తెలిపారు. ఎంపికైన క్రీడాకారులు ఈనెల 10,11,12 తేదీలలో సంగారెడ్డి జిల్లాలో నిర్వహించే రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ అండర్ 19 ఫుట్బాల్ పోటీలలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా జట్టు తరఫున పాల్గొంటారని ప్రిన్సిపల్ రాజ్ కుమార్ తెలిపారు. రాష్ట్రస్థాయికి ఎంపికైన విద్యార్థులను ప్రిన్సిపాల్ తో పాటు వ్యాయామ ఉపాధ్యాయులు బైకని కొమరయ్య, మేకల సంజీవరావు, ఉపాధ్యాయులు అభినందించారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest