UPDATES  

NEWS

మత సామరస్యానికి ప్రతీక గ్యార్వి షరీఫ్ ఉత్సవం : వజ్జా ఈశ్వరి మృతుడి కుటుంబానికి 5వేలు ఆర్థిక సాయం అందజేసిన మాజీ ఎంపీపీ ముసిపట్ల రేణుక తిరుపతి రెడ్డి ఆశ కార్యకర్త పదవికి రాజీనామా చేసి పంచాయతీ బరిలో ఘనంగా 69వ మహాపరినిర్వాణ దివాస్ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి: ప్రకృతి ప్రేమికుడు బాలు నాయక్ నంద తండా బిఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థిగా జయరాం నాయక్.. ప్రజల ఆశీర్వాదమే గెలుపు బాట గార్లలో అంబేద్కర్ విగ్రహానికి ఘనాభివందనం చేసిన ఎయిర్‌పోర్ట్ ఎ జి యం గంగావత్ వెంకన్న గిరిజన సంక్షేమ శాఖ ఏడీ సర్వేశ్వర రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఐటిడిఎ గిరిజన సంక్షేమ శాఖ ఉమ్మడి జిల్లాల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టీ.మధుకర్. జనవాసులకు దూరంగా వైన్ షాపు నిర్వహించాలి మున్సిపల్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారుల ఆకస్మిక తనిఖీలు

 కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్

బీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సిర్సే సంజీవ్

బోథ్ (తెలంగాణా వాణి ప్రతినిధి) బోథ్ మండలంలోని మర్లపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సిర్సే సంజీవ్ గురువారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆయనకు ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సిర్సే సంజీవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో ఎన్నో సంవత్సరాల నుంచి కొనసాగుతున్నానని, పార్టీలో ఉండి ప్రజలను పార్టీ చేస్తున్న మోసాలు చూడలేకనే ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగిందని స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుతామన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ మోసాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీని ప్రజలు బుద్ది చెబుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లు సురేందర్ యాదవ్, దేవేందర్, రాము, మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest