UPDATES  

NEWS

కవితక్క కొత్త పార్టీ పేరు TRS జనాభా గణన 2027 శిక్షణ కార్యక్రమం ప్రారంభం – పాల్వంచలో 36 మందికి ట్రైనింగ్ ఏపీలో మరో ఘోర రోడ్డు ప్రమాదం… వేములవాడలో ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు సాంకేతిక విజ్ఞానానికి వారధి… హుస్నాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్! కేటీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి హ్యాండ్ బోర్ మరమ్మతు – ప్రజల సమస్యకు తక్షణ పరిష్కారం:కార్పొరేటర్ కళావతిధనరాజ్ కాంగ్రెస్ నాయకులకు కాకులమర్రి లక్ష్మణ్ బాబు భయం పట్టుకుంది అంగన్‌వాడీల్లో ఒంటిపూట బడి అమలు పట్ల హర్షం వ్యక్తం చేసిన విద్యా పరిరక్షణ కమిటీ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు హరిలాల్ నాయక్  సృజన టెక్ ఫెస్ట్ 2025–26 విజేతలకు ఘన సన్మానం:ప్రిన్సిపాల్ బండి శ్రీనివాస్,

 బీజేపీ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షులుగా వీరవెల్లి రాజేష్ గుప్తా

ఖమ్మం (తెలంగాణ వాణి ప్రతినిధి హనిఫ్ పాషా) బీజేపీ పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఆ పార్టీ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షులు వీరవెల్లి రాజేష్ గుప్త పేర్కొన్నారు. బిజెపి జిల్లా ఉపాధ్యక్షునిగా తనను నియమించిన పార్టీ అధినాయకత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేసారు. స్థానిక సంస్థల ఎన్నికల ముందు తనకు పార్టీ జిల్లా ఉపాధ్యక్షునిగా నియమించడం తనకు ఒక గొప్ప అవకాశం అని, ఈ ఎన్నికల్లో బిజేపీ సత్తా ఎంటో చూపించాల్సిన ఆవశ్యకత కొత్తగా బాధ్యతలు స్వీకరించిన తనతో పాటు మిగితా కార్యవర్గంపై ఉందన్నారు. తనపై నమ్మకంతో జిల్లా ఉపాధ్యక్షునిగా నియమించిన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రామచందర్ రావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, సహ మంత్రి బండి సంజయ్, జాతీయ నాయకులు పొంగులేటి సుధాకర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవరావు రాష్ట్ర నాయకులు సన్నే ఉదయ్ ప్రతాప్ శీలం పాపారావు వాకధాని పుల్లారావు పాటు ఇతర అదినాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. తన శక్తి మేరకు పార్టీ పటిష్టతకు, స్థానిక ఎన్నికల్లో బిజెపి గెలుపుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest